India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డబుల్ పేర్లు ప్రధాన పార్టీ అభ్యర్థులకు గుబులు రేపుతున్నాయి. చేవెళ్ల మండలం ధర్మసాగర్కు చెందిన కొండా విశ్వేశ్వర్రెడ్డి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. AIFB నుంచి కర్మన్ఘాట్కు చెందిన కొండా విశ్వేశ్వర్రెడ్డి నామినేషన్ వేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం రంజిత్ రెడ్డి నామినేషన్ వేయగా.. ఇదే పేరుతో దుండిగల్కు చెందిన రంజిత్రెడ్డి గాదె రెవెల్యూషనరీ సోషలిస్టు పార్టీ నుంచి నామినేషన్ వేశారు.
చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శామీర్పేట పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. వెస్ట్ మారేడ్పల్లికి చెందిన బత్తుల కుమార్(45) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి వెళ్లిన కుమార్ తన భార్య మంజులకు ఫోన్చేసి తాను బొల్లారం చెరువు వద్ద ఉన్నానని, చెరువులో దూకి చనిపోతున్నానని చెప్పాడు. దీంతో అక్కడ వెతకగా కనిపించలేదు. శామీర్పేట చెరువు వద్ద మృతదేహం లభ్యమైంది.
భార్యతో గొడవపడిన భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కీసర PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. బీబీనగర్ మండలానికి చెందిన మహేశ్(38) భార్య భవాని తన ఫోన్ ద్వారా ఓ వ్యక్తికి ఫోన్పే ద్వారా డబ్బులు పంపింది. ఇది గమనించిన మహేశ్ తన భార్యను నిలదీయగా.. పుట్టింటికి వెళ్లింది. దీంతో మహేశ్ తన బావమరిదికి వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం అనుబంధ ఓటరు జాబితాను విడుదల చేసింది. అనుబంధ జాబితా ప్రకారం తాజాగా రంగారెడ్డి జిల్లాలో 36,23,960 మంది ఓటర్లు ఉన్నారు. ఫిబ్రవరిలో విడదల చేసిన తుది జాబితా ప్రకారం జిల్లా ఓటర్లు 35,91,120 ఉన్నారు. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 7,58,102 ఓటర్లు ఉన్నారు. ఎన్ఆర్ఐ ఓటర్లు 302, సర్వీసు ఓటర్లు 56, పీడబ్ల్యూ ఓటర్లు 45,745 ఉన్నారు. జిల్లాలో మొత్తం 45,434 ఓటర్లను తొలగించారు.
హైదరాబాద్-విజయవాడ రూట్లో వెళ్లే ప్రయాణికుల కోసం ప్రతి 10 నిమిషాలకో బస్సును RTC అందుబాటులో ఉంచిందని MD సజ్జనార్ తెలిపారు. ఆ మార్గంలో ప్రతిరోజు 120కి పైగా బస్సులను సంస్థ నడుపుతోందని, అందులో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ-గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ 62 బస్సులున్నాయి. ఈ బస్సుల్లో tsrtconline.in రిజర్వేషన్ చేసుకునే వారికి 10 శాతం రాయితీని సంస్థ కల్పించింది.
మాజీ CM KCRపై సీనియర్ న్యాయవాది అరుణ్ కుమార్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో KCRతో పాటు అప్పటి కేబినెట్లోని 39 మంది MLAలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఢిల్లీ లాంటి నగరాల మాదిరిగా HYD వ్యాప్తంగా డిజిటల్ డోర్ నంబరింగ్ (DDN) చేయడంపై GHMC కసరత్తు చేస్తోంది. 2018లో మూసాపేటలో పైలట్ ప్రాజెక్టుగా ఆధార్ అనుసంధానంతో 7 అంకెలతో కూడిన డిజిటల్ డోర్ నంబర్ కేటాయించే కార్యక్రమం ప్రారంభించింది. కానీ అప్పుడు పూర్తి స్థాయిలో అమలు కాలేదు. DDN కేటాయించడం వల్ల ఇంటి అడ్రస్ తెలుసుకోవడం సులభతరం అవుతుంది. DDN కేటాయిస్తామని GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ గతంలోనూ చెప్పారు.
HYD నగరంలో డిజిటల్ డోర్ నెంబరింగ్ కై ఇంటింటికీ సర్వే జరిపి ఇంటి పాత నంబర్, బస్తీ పేరు, ప్రాంతం, ఇంటి ఫొటో, యజమాని ఫోన్ నంబర్ సేకరిస్తారు. ఆంగ్ల అక్షరాలు, అంకెల కలయికతో ప్రతి ఇంటికి నంబర్లను కేటాయిస్తారు. డిజిటల్ డోర్ నంబర్ ఉపయోగించి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ GPS సాయంతో ఇంటిని గుర్తించి, నేరుగా అక్కడికి చేరుకునే వెసులుబాటు ఉంటుందన్నారు.
HYD, RR ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఉష్ణోగ్రతలకు తోడు వడగాలులు పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. శేరిలింగంపల్లి, హఫీజ్పేటలోని అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో 43.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత, బంట్వారం మండలం తొర్మామిడి-నాగారంలో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. HYD వ్యాప్తంగా 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఓ బాలికను ప్రేమ పేరుతో వేధించిన యువకుడిపై కాచిగూడ పోలీసులు పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. SI నరేశ్ కుమార్ వివరాల ప్రకారం.. శివరాంపల్లిలో నివాసం ఉంటున్న సాయికిరణ్ అలియాస్ నాని (20) కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి కాచిగూడకు చెందిన ఓ బాలిక ఇన్స్టాగ్రామ్లో పరిచయమైంది. బాలికను వేధిస్తుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్ట్ చేశారు.
Sorry, no posts matched your criteria.