RangaReddy

News September 5, 2024

మెట్రోలో ఫీడర్ సర్వీసులు పెంచాలని డిమాండ్

image

నగరంలో ప్రయాణికులు మెట్రోకి మొగ్గు చూపుతున్నారు. దీంతో 5 లక్షల మార్క్ దాటింది. అన్ని స్టేషన్ల వరకు ఫీడర్ సర్వీస్లు లేకపోవడంతో ప్రయాణికులు సొంత వాహనాల్లో స్టేషన్లకు రావాల్సి వస్తోందంటున్నారు. అయితే ఇటీవల పార్కింగ్ ఫీజుల వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. అన్ని ప్రాంతాల నుంచి ఫీడర్ సర్వీసులు ఉంటే వాహనం తేవాల్సిన అవసరం లేదని ప్రయాణికులు అంటున్నారు. మెట్రో కోచ్లు పెంచాలనే డిమాండ్ పెరుగుతోంది.

News September 5, 2024

HYD: హైడ్రాకు హైకోర్టు నిషేధాజ్ఞలు

image

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి పరిధి హస్మత్‌పేటలోని 13.17 ఎకరాలకు సంబంధించి NVN కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌‌పై తక్షణ చర్యలు తీసుకోకుండా… హైడ్రా, ఇతర అధికారులపై తెలంగాణ హైకోర్టు నిషేధాజ్ఞలు జారీ చేసింది. పూర్తి విచారణ చేపట్టిన అనంతరం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించింది.

News September 5, 2024

HYD: రేవంత్ కుట్రలో ఎస్సీలు సమిధలవుతున్నారు: RSP

image

గురుకుల విద్యపై ప్రస్తుత ప్రభుత్వం కుట్ర చేస్తోందని భారాస నేత RS. ప్రవీణ్ కుమార్ వాపోయారు. తెలంగాణ భవన్‌లో బుధవారం మాట్లాడారు. ‘గురుకులాల్లోని 2,000 మంది టీచర్లను తొలగించడంతో విద్యార్థుల భవిత అగమ్యగోచరంగా మారింది. ఈ కుట్ర నుంచి గురుకులాలను కాపాడుకోవాలి. కేసీఆర్ హయాంలో నాణ్యమైన గురుకుల విద్య అందించారు. ప్రభుత్వం కుట్రకు ఎస్సీలే సమిధలవుతున్నారు’ అని సీఎం ఫైర్ అయ్యారు.

News September 5, 2024

HYD: AI, సైబర్ సెక్యూరిటీపై సబ్ సమ్మిట్

image

గచ్చిబౌలి పరిధిలో వివిధ రాష్ట్రాలకు చెందిన నిపుణుల సమక్షంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ అంశాలపై గ్లోబల్ సబ్ సమ్మిట్ జరిగింది. AI సిస్టమ్స్ ప్రాముఖ్యతపై నిపుణుల బృందం విస్తృతంగా చర్చించినట్లు తెలంగాణ స్టేట్ ఎమర్జింగ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీని యువత అందిపుచ్చుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు.

News September 5, 2024

HYD: పెరిగిన విగ్రహాల తయారీ.. తగ్గిన ధరలు?

image

గణపతి విగ్రహాలకు కేరాఫ్ అడ్రస్ ధూల్‌పేట. వినాయకచవితి సమీపించడంతో HYD, ఇతర జిల్లాల నుంచి విగ్రహాల కొనుగోలుకు ఇక్కడికి వస్తుంటారు. అయితే, గతంతో పోల్చితే ఈసారి విక్రయాలు ఎక్కువగా ఉంటాయని భారీగా గణనాథులను వ్యాపారులు సిద్ధం చేశారు. అనుకున్న స్థాయిలో విక్రయాలు జరగలేదు. ధరలు తగ్గించి అమ్మకాలు సాగిస్తున్నట్లు టాక్. 2023లో రూ.60 వేలు పలికిన విగ్రహం ఈసారి రూ. 40 వేలకు అమ్ముతున్నట్లు ఓ వ్యాపారి తెలిపారు.

News September 4, 2024

నీలోఫర్ కేఫ్‌లో లేబుల్స్ లేని ఫుడ్స్

image

బంజారాహిల్స్‌లోని రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. నీలోఫర్ కేఫ్ కిచెన్ అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించారు. రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిచిన షుగర్ సిరప్, మసాలా దినుసులు వంటి లేబుల్ లేని వస్తువులు చూసి అసహనం వ్యక్తం చేశారు. అమ్మకానికి ఉంచిన కేక్‌లను కూడా లేబుల్ చేయలేదు. దీంతో పాటు వంటగదిలో ఎక్స్పైరీ అయిన అరకిలో చీజ్, మిరప పొడి, 5 కిలోల కాల్చిన వేరుశెనగలు ఉన్నాయి.

News September 4, 2024

HYD: హైడ్రా కమిషనర్ హెచ్చరిక

image

హైడ్రా పేరుతో బెదిరింపులు, వసూళ్లకు పాల్పడితే జైలుకు పంపిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. కొంతమంది బిల్డర్లను బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. హైడ్రాలో ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నట్లు బెదిరిస్తున్నారని చెప్పారు. తమ విభాగాన్ని నీరు గార్చే ప్రయత్నాలు, తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హైడ్రా పేరుతో బెదిరిస్తే పీఎస్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.

News September 4, 2024

HYD: హైడ్రా GOOD NEWS.. ఇక ఈజీ!

image

HYD నగరంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా, ప్రజల నుంచి వినతులను సైతం స్వీకరిస్తున్నట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. భవిష్యత్తులో సామాన్య మానవుడు సైతం చూసుకునేలా చెరువులు, కుంటల FTL, బఫర్ జోన్ వివరాలను యాప్‌లో పొందుపరుస్తామని తెలిపారు. తద్వారా భూమి కొనుగోలు చేసేటప్పుడు అందరూ చెక్ చేసుకోవడానికి వీలుంటుందన్నారు. అక్రమాలు, సహా ఇతర ఫిర్యాదులను సైతం యాప్ ద్వారా స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.

News September 4, 2024

HYD: మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు, సూచనలు

image

✓HYD హిమాయత్‌సాగర్ జలాశయం 4 ఫీట్ల నీటిమట్టం పెరిగితే నిండిపోతుంది ✓వర్షాలు తగ్గడంతో ఇన్‌ఫ్లో తగ్గింది
✓ఒక్క వర్షం వచ్చినా జలాశయం పూర్తిగా నిండి పోతుంది
✓జలయశయం నిండితే దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
✓HYD, RR జిల్లా కలెక్టర్లు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి
✓ఎప్పటికప్పుడు అధికారిక యంత్రాంగం పరిస్థితిని పర్యవేక్షించాలి.

News September 4, 2024

HYD: సెప్టెంబర్ 17న ప్రత్యేక కార్యక్రమాలు

image

HYD నగరంలోని పరేడ్ గ్రౌండ్ వద్ద సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలలో భారతదేశ హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. మరోవైపు HYD,RR, MDCL,VKB జిల్లాల వ్యాప్తంగా అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.రేషన్ కార్డులు, ఆరోగ్య కార్డుల పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన ప్రభుత్వం,వీటికి సంబంధించిన వివరాలు సేకరించనుంది.