RangaReddy

News April 26, 2024

GHMC సమ్మర్ క్యాంప్ కోచింగ్.. JUST రూ.10

image

HYDలో ఉన్న పిల్లలకు GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ గుడ్ న్యూస్ తెలిపారు. కేవలం రూ.10తో సమ్మర్ కోచింగ్ క్యాంపుల్లో శిక్షణ పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. ఆసక్తి ఉన్నవారు sports.ghmc.gov.in లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సువర్ణ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. 37 రోజుల పాటు 44 క్రీడలపై శిక్షణ అందించనున్నారు.

News April 26, 2024

HYD: మరో 10 రోజులు జాగ్రత్త!

image

ఉప్పల్ మల్లాపూర్ వార్డు కార్యాలయం వద్ద గురువారం 42.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నేటి నుంచి మరో 10 నుంచి 15 రోజులు విపరీతమైన వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో HYD నగరంలో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అత్యవసరమైతే కానీ, బయటకు వెళ్లకుండా ఉండడం మంచిదని TSDPS తెలియజేసింది.

News April 25, 2024

హైదరాబాదీలకు రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి

image

హైదరాబాద్‌ డెవలప్‌మెంట్‌ బాధ్యత కాంగ్రెస్ తీసుకొంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం రాజేంద్రనగర్‌లో MP అభ్యర్థి రంజిత్‌ రెడ్డికి మద్దతు‌గా ప్రచారం నిర్వహించారు. రూ. లక్ష కోట్లు ఖర్చు చేసి మూసీ నదిని సుందరీకరిస్తామని CM హామీ ఇచ్చారు. ఇక్కడి భూముల విలువను పెంచుతామన్నారు. ఇవన్నీ జరగాలంటే కాంగ్రెస్ MP అభ్యర్థిని పార్లమెంట్‌కు పంపాలని ఓటర్ల‌ను విజ్ఞప్తి చేశారు.

News April 25, 2024

సికింద్రాబాద్ MP అభ్యర్థిగా ఆటో డ్రైవర్ నామినేషన్

image

సికింద్రాబాద్ పార్లమెంట్ MP అభ్యర్థిగా ఆటో డ్రైవర్ నామినేషన్ దాఖలు చేశారు. వారసిగూడకు చెందిన మహ్మద్ ఇబ్రహీం నిత్యం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడికి ఎలాంటి న్యాయం చేయడం లేదని, అందుకోసమే తాను నామినేషన్ దాఖలు చేశానని చెప్పారు. సామాన్యుడినైనా తనను ప్రజలు ఆశీర్వదించి పార్లమెంట్‌కు పంపిస్తే ప్రజల కోసం పోరాటం చేస్తానని చెప్పారు.

News April 25, 2024

HYD: సమ్మర్ టూర్, నాచురల్ క్యాంప్ వెళ్లొద్దామా?

image

HYD నగర శివారులోని చిలుకూరు బాలాజీ టెంపుల్ వెళ్లే దారిలో మృగవని నేషనల్ పార్క్ ఉంది. దాదాపు 850 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జాతీయ పార్కులో అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాత్రి పూట నేచురల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేసవి వేళ సమ్మర్ టూర్లతో పర్యాటకుల సంఖ్య పెరిగింది. చల్లటి గాలులు, పచ్చటి అందాల మధ్య నేచురల్ క్యాంప్ కోసం ఆసక్తి కనబరుస్తున్నారు.

News April 25, 2024

నెహ్రూ జూ పార్కులో నేటి నుంచి వేసవి శిబిరం

image

HYD నెహ్రూ జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి తెలిపారు. ఈ నెల 25 నుంచి జూన్ 30 వరకు కొనసాగుతుందన్నారు. నాలుగో తరగతి నుంచి పై విద్యార్థులకు జూకు సంబంధించిన జంతువులు, వాటి ఆవాసాలు, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పిస్తామన్నారు. చిత్ర లేఖనం పోటీలు ఉంటాయన్నారు. మధ్యాహ్నం భోజనంతో పాటు స్నాక్స్ ఇస్తామన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1000 అని చెప్పారు.

News April 25, 2024

HYD: వర్షాకాలం కోసం 166 అత్యవసర బృందాలు

image

HYD నగరంలో వర్షాకాలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు 166 అత్యవసర బృందాలను రంగంలోకి దింపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో 64 మొబైల్, 104 మినీ మొబైల్ బృందాలు ఉండగా, 160 స్టాటిక్ లేబర్స్ టీమ్స్ ఉంటాయి.మొబైల్, మినీ మొబైల్ ఎమర్జెన్సీ టీముల్లో షిఫ్టుల వారీగా ప్రతి టీంలో నలుగురు కార్మికులు ఉంటారు. వివిధ సాధనాలతో నీటిని తొలగించడం లాంటి పనులు నిర్వహిస్తారు.

News April 25, 2024

HYD: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఓ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యానని మనస్తాపం చెంది విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజేంద్రనగర్‌ పరిధిలో జరిగింది. హైదర్‌గూడకు చెందిన విద్యార్థి(16)ని ఇంట్లో క్షణికావేశంలో ఉరేసుకుంది. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 25, 2024

HYD: బాలికపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి

image

బాలికపై ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన బషీరాబాద్‌ PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. ఓ గ్రామానికి చెందిన బాలిక(16)పై అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నరేశ్(24) కన్నేశాడు. రోజూ బాలిక చదువుతున్న పాఠశాల వద్ద ప్రయాణికులను ఎక్కించుకునేందుకు వచ్చి మాటలు కలిపి ప్రేమ పేరుతో నమ్మించాడు. పలుమార్లు బాలికపై లైంగిక దాడికి పాల్పడగా గర్భం దాల్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

News April 25, 2024

శంషాబాద్ విమానాశ్రయానికి నేరుగా ఆర్టీసీ బస్సులు

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే పుష్పక్ బస్సులు నేటి నుంచి రూట్ మారనున్నాయి. ప్రస్తుతం మెహిదీపట్నం నుంచి PVNR ఎక్స్‌ప్రెస్ వే మీదుగా వెళ్లే బస్సులు ఫ్లైఓవర్ కింద ఉన్న రోడ్డు నుంచి రాకపోకలు సాగిస్తాయని మెహదీపట్నం డిపో మేనేజర్ మూర్తి తెలిపారు. ఈ పుష్పక్ బస్సు సౌకర్యం ఈ రోజు అర్ధరాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.