RangaReddy

News April 25, 2024

HYD: బెంగళూరు వెళ్లే వారికి ఆర్టీసీ GOOD NEWS

image

హైదరాబాద్-బెంగళూరు మార్గంలో వెళ్లే వారికి ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. HYD నుంచి బెంగళూరుకు వెళ్లే అన్ని హైఎండ్ సర్వీసుల్లోనూ ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ రూట్‌లో వెళ్లే ప్రయాణికులు 10 శాతం రాయితీని వినియోగించుకుని, సంక్షేమంగా ప్రయాణించాలని కోరారు. SHARE IT

News April 25, 2024

HYD: ఇంటర్‌ FAIL.. అమ్మాయి సూసైడ్

image

HYDలో ఇంటర్ స్టూడెంట్‌ సూసైడ్ చేసుకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. హైదర్‌గూడ శివనగర్‌ వాసి శ్రీనివాసరెడ్డి కూతురు హరిణి (16) మెహదీపట్నం‌లోని ఓ కాలేజీ‌‌లో ఇంటర్‌ చదువుతోంది. నేడు విడుదలైన ఫలితాల్లో మాథ్స్‌ సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయ్యింది. ఈ విషయాన్ని శుభకార్యానికి వెళ్ళిన తల్లికి ఫోన్ చేసి చెప్పింది. తల్లి ఇంటికొచ్చే లోపే ఉరేసుకొంది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

News April 25, 2024

IPL: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్

image

రేపు ఉప్పల్ స్టేడియం వేదికగా SRH VS RCB ఐపీఎల్‌ మ్యాచ్ జరగనుంది. ఫ్యాన్స్ కోసం మెట్రో, TSRTC అధికారులు‌ అదనపు సర్వీసులు నడుపుతున్నారు. రేపు అర్ధరాత్రి 12:15 వరకు మెట్రో రైళ్లు నడుస్తాయి. మెహదీపట్నం, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, కోఠి, అఫ్జల్‌గంజ్, లక్డీకపూల్, దిల్‌సుఖ్‌నగర్, జీడిమెట్ల, JBS, పాతబస్తీ తదితర ఏరియాల నుంచి స్టేడియానికి మొత్తం 24 రూట్‌లలో RTC సర్వీసులు ఉంటాయి. సద్వినియోగం చేసుకోండి. SHARE IT

News April 25, 2024

పద్మారావు మంచోడే: CM రేవంత్ రెడ్డి

image

సికింద్రాబాద్‌ MLA పద్మారావు మంచోడే అని CM రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం సికింద్రాబాద్ కార్నర్ మీటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌తో కలిసి పాల్గొన్నారు. ‘పద్మారావు పరువు తీసేందుకే కేసీఆర్ ఆయన్ని పోటీకి దింపారు. పజ్జన్న నామినేషన్‌కు కేసీఆర్, కేటీఆర్ ఎందుకు రాలేదు? దీన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. సికింద్రాబాద్ సీటును కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టారు’ అంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు.

News April 25, 2024

HYD: గృహ జ్యోతి పథకంపై BIG UPDATE

image

HYD నగరం సహా అనేక చోట్ల 30 రోజుల తర్వాత కరెంటు బిల్లు జనరేట్ చేయడం ద్వారా 200 యూనిట్లకు ఎక్కువగా వచ్చి గృహజ్యోతి పథకాన్ని పొందలేకపోతున్నామని పలువురు వాపోయారు. దీని పై స్పందించిన TSSPDCL అధికారులు, గృహ జ్యోతి పథకానికి కరెంటు బిల్లింగ్ తేదీతో సంబంధం లేదని, నెలసరి సగటు యూనిట్లకే (RED BOX) పథకం లెక్కించబడుతుందని తెలిపింది.కాగా ప్రభుత్వం నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందిస్తున్న సంగతి తెలిసిందే.

News April 25, 2024

ఇంటర్ సెకండ్ ఇయర్‌ ఫలితాల్లో హైదరాబాద్ ఇలా..

image

ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో హైదరాబాద్ 3 జోన్లు 11, 19, 14వ స్థానంలో నిలిచాయి. HYD-1 జోన్ 67.12 శాతంతో 11వ స్థానంలో నిలిచింది. 27,514 మంది పరీక్షలు రాయగా 18,468 మంది పాసయ్యారు. HYD-2వ జోన్ 64.85 శాతంతో 19వ స్థానంలో నిలిచింది. 34,426 మంది పరీక్షలు రాయగా 22,326 మంది పాసయ్యారు. HYD-3వ జోన్ 65.59 శాతంతో 14వ స్థానంలో నిలిచింది. 11,193 మంది పరీక్షలు రాయగా 7,341 మంది ఉత్తీర్ణత సాధించారు.

News April 25, 2024

ఇంటర్ ఫస్ట్ ఇయర్‌ ఫలితాల్లో హైదరాబాద్ ఇలా..

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో హైదరాబాద్ 3 జోన్లు 7, 10, 12వ స్థానంలో నిలిచాయి. HYD-1 జోన్ 62.14 శాతంతో 7వ స్థానంలో నిలిచింది. 28,728 మంది పరీక్షలు రాయగా 17,852 మంది పాసయ్యారు. HYD-2వ జోన్ 59.06 శాతంతో 10వ స్థానంలో నిలిచింది. 35,155 మంది పరీక్షలు రాయగా 20,764 మంది పాసయ్యారు. HYD-3వ జోన్ 58.52 శాతంతో 12వ స్థానంలో నిలిచింది. 12,698 మంది పరీక్షలు రాయగా 7,431 మంది ఉత్తీర్ణత సాధించారు.

News April 25, 2024

ఇంటర్ సెకండ్ ఇయర్‌లో మేడ్చల్ సెకండ్

image

ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా 79.31 శాతంతో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. 58,933 మంది పరీక్షలు రాయగా 46,742 మంది పాసయ్యారు. రంగారెడ్డి జిల్లా 77.63 శాతంతో మూడో స్థానంలో నిలిచింది. 64,759 మంది పరీక్షలు రాయగా 50,273 మంది పాసయ్యారు. వికారాబాద్ జిల్లా 61.42 శాతంతో 27వ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 6,456 మంది పరీక్షలు రాయగా 3,965 మంది ఉత్తీర్ణత సాధించారు.

News April 25, 2024

ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో రంగారెడ్డి టాప్

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా తొలి 71.7 శాతంతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 71,297 మంది పరీక్షలు రాయగా 51,121 మంది పాసయ్యారు. మేడ్చల్ జిల్లా 71.58 శాతంతో 2వ స్థానంలో నిలిచింది. 64,828 మంది పరీక్షలు రాయగా 46,407 మంది పాసయ్యారు. వికారాబాద్ జిల్లా 53.11 శాతంతో 22వ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 6,455 మంది పరీక్షలు రాయగా 3,428 మంది ఉత్తీర్ణత సాధించారు.

News April 25, 2024

మల్కాజిగిరి BRS అభ్యర్థి ఆస్తులు రూ.82.54 కోట్లు

image

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాగిడి లక్ష్మారెడ్డి కుటుంబానికి సంబంధించిన ఆస్తులు రూ.82.54 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇందులో స్థిరాస్తులు రూ.62.12 కోట్లు, చరాస్తులు రూ.20.42 కోట్లు ఉన్నాయని వెల్లడించారు. అప్పులు రూ.10.20 కోట్లు, ప్రస్తుతం నగదు రూ.5.70 లక్షల ఉండగా.. బంగారం 2,000 గ్రాములు, వెండి 4 కిలోలు, ఒక డైమండ్ ఉన్నట్లు తెలిపారు.