India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD కూకట్పల్లి JNTUH ద్వారా అమెరికా యూనివర్సిటీల్లో ప్రవేశాలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అమెరికా యూనివర్సిటీలతో ఇప్పటికే MOU ఒప్పందాలు జరిగాయి. MOUలతో ఇంటిగ్రేటెడ్ బీటెక్ MS డిగ్రీ ఐదేళ్లకే పూర్తి చేసుకోవచ్చు. మూడేళ్లు JNTU, ఒక ఏడాది బీటెక్, మరో ఏడాది ఎమ్మెస్ అమెరికాలో చదివితే సరిపోతుంది. రెగ్యులర్ B.Tech, MS చేసేందుకు ఆరేళ్లు పడుతుండగా.. దీంతో ఐదేళ్లు మాత్రమే పట్టనుంది.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ సేవరేజ్ అండ్ వాటర్ బోర్డు (HMWSSB) సప్లై మేనేజింగ్ డైరెక్టర్గా ఐఏఎస్ అధికారి అశోక్ రెడ్డి బాధ్యతల స్వీకరించిన సందర్భంగా పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. అత్యుత్తమ సేవలు అందించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. వాటర్ బోర్డు పరిధిలో ఉన్న ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామన్నారు.
గ్రేటర్ హైదరాబాద్కు తాగునీటి కొరత రాకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-2కు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మల్లన్న సాగర్ నుంచి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్కు గోదావరి జలాలని తరలించి ఆయా ప్రాజెక్టులని పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.5,560 కోట్లు కేటాయించి ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ ఆర్టీసీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి మరో జేఏసీ ఏర్పాటు అయింది. నేడు తెలంగాణ ఆర్టీసీలోని యూనియన్ల సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. జేఏసీ ఛైర్మన్గా ఈదురు వెంకన్న(EU), వైస్ ఛైర్మన్గా థామస్ రెడ్డి(TMU), కన్వినర్గా ఎండి మౌలానా(NMU), కో కన్వీనర్లుగా సుద్దాల సురేష్(BWU), కత్తుల యాదయ్య(BKU), యాదగిరి నియమితులయ్యారు.
గ్రేటర్ హైదరాబాద్కు తాగునీటి కొరత రాకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-2కు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మల్లన్న సాగర్ నుంచి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్కు గోదావరి జలాలని తరలించి ఆయా ప్రాజెక్టులని పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.5,560 కోట్లు కేటాయించి ఉత్తర్వులు జారీ చేశారు.
మాజీ సైనికుడికి ఇచ్చిన భూమిపై దర్యాప్తు చేయాలని రెవెన్యూ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఆ భూమిపై నోటీసులు ఇచ్చి రెండు వైపుల వాదనలు వినాలని ఎమ్మార్వోను ఆదేశించింది. పెద్దషాపూర్లో మాజీ సైనికుల కోటాలో కేటాయించిన మూడెకరాల్లో రెండెకరాలను ఖారిజా ఖాతాగా పేర్కొంటూ కలెక్టర్కు ఎమ్మార్వో రాసిన లేఖను మాజీ సైనికుడు శ్యాంసుందర్రావు హైకోర్టులో సవాల్ చేయడంతో మంగళవారం విచారించింది.
బిత్తిరి సత్తిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే భగవద్గీత గ్రంథాన్ని అపహాస్యం చేశారని, వ్యంగ్యంగా వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని రాష్ట్రీయ వానరసేన ఫిర్యాదు చేసింది. మనోభావాలు దెబ్బతీసేలా ఇలాంటి వీడియోలు తీసిన రవి కుమార్(బిత్తిరి సత్తి)పైన తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ వానరసేన ఫిర్యాదులో పేర్కొంది.
తెలంగాణలో BRS పనైపోయిందని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. HYD నాంపల్లిలో ఆయన మాట్లాడారు. BJPకి రాష్ట్రంలో అనుకూల వాతావరణం ఉందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల 8 ఎంపీ స్థానాలు గెలుచుకున్నామని, ప్రజలు BJPని ఆదరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. మీ కామెంట్?
నగరంలోని PVNR ఎక్స్ప్రెస్ వే పైనుంచి ఓ వ్యక్తి దూకేశాడు. అత్తాపూర్ పోలీసుల వివరాల ప్రకారం.. రాంబాగ్లో నివాసముండే అంబదాస్ (40)కు వివాహం కాలేదు. మద్యానికి డబ్బులు ఇవ్వాలని తన తల్లిని అడిగాడు. ఆమె నిరాకరించడంతో గొడవ పెట్టుకొని బయటకెళ్లిపోయాడు. మనస్థాపంతో అత్తాపూర్లోని PVNR ఎక్స్ప్రెస్ వే పైకి ఎక్కి కిందకు దూకేశాడు. ఈ ఘటనలో అతడికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.
ఉస్మానియా యూనివర్సిటీ వెళ్లేవారికి ముఖ్య గమనిక. క్యాంపస్ విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పలు నిషేధాలు విధించారు.
☛జంతుబలి నిషేధం
☛ఔటర్స్ సోషల్ మీడియా రీల్స్ కోసం రావొద్దు
☛డ్రైవింగ్ నేర్చుకునేవారికి క్యాంపస్లో నో ఎంట్రీ
☛పెంపుడు జంతువులను ల్యాండ్ స్కేప్లో తీసుకురావొద్దు
అసాంఘిక కార్యక్రమాలు చేయరాదని క్యాంపస్ అంతటా బ్యానర్లు ఏర్పాటు చేశారు. 24/7 సెక్యూరిటీ పర్యవేక్షిస్తున్నారు.
SHARE IT
Sorry, no posts matched your criteria.