India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వర్కింగ్ జర్నలిస్టుల వేజ్ బోర్డును పునరుద్ధరించాలన్న ఐజేయూ(ఇండియన్ జర్నలిస్టు యూనియన్) డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు. హర్యానాలోని పంచకులలో ఆగస్టు 3, 4వ తేదీల్లో జరిగిన ఐజేయూ జాతీయ కౌన్సిల్ సమావేశాల ముగింపు సెషన్కు ఆదివారం చీఫ్ గెస్టుగా హాజరైన గవర్నర్ బండారు దత్తాత్రేయ భరోసా కల్పించారు.
మూడంతో 3 నెలలు నిలిచిన శుభకార్యాలు నేటి నుంచి మళ్లీ షురూ కానున్నాయి. నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభంకానున్న నేపథ్యంలో HYD, RRలో వివాహాది కార్యక్రమాలు జోరందుకోనున్నాయి. దీంతో ఈ నెల రోజుల పాటు ఎటుచూసినా సందడి వాతావరణమే నెలకొననుంది. ఇప్పటికే పెళ్లి సంబంధాలు కుదుర్చుకున్న వారు నిశ్చయ తాంబూలాలు మార్చుకొని వివాహానికి సిద్ధమవుతున్నారు. వివాహాలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో కల్యాణ మండపాలు ముస్తాబుకానున్నాయి.
HYD నగరంలో నవంబర్ నెలలో అంబర్పేట వంతెనను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నామని R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ కట్టింది కాబట్టే ఐటీ కంపెనీలు HYD ప్రాంతానికి వచ్చాయన్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను నవంబర్ నెలలో ప్రారంభించి 18 నుంచి 20 నెలల్లో పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు.
✓ 6KM వంతెనకు 6 సంవత్సరాలా..?: వెంకటరెడ్డి
✓అంబర్పేట వంతెనను నవంబర్లో ప్రారంభించేలా చూస్తాం: వెంకటరెడ్డి
✓OU: M.Tech చదువుతూ 4 ఉద్యోగాలు సాధించిన తులసి
✓కొండాపూర్: బ్రిడ్జి మీద నుంచి పడి ఇద్దరు దుర్మరణం
✓సైబరాబాద్: 309 మందుబాబులు పట్టుపడ్డారు
✓ఐటి ఉత్పత్తులలో బెంగళూరును అధిగమిస్తాం: శ్రీధర్ బాబు
✓అబిడ్స్ లో డబ్బుల కోసం బాలిక కిడ్నాప్..!
ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్ చదువుతూ నల్లగొండకు చెందిన చింతల తులసి ఏకంగా 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ప్రభంజనం సృష్టించింది. తాజాగా వచ్చిన ఫలితాల్లో AEE, AE, గ్రూప్-4, పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలు సాధించింది. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించిన తులసి.. ప్రభుత్వ ఉద్యోగమే ధ్యేయంగా గత రెండు సంవత్సరాలుగా పరీక్షలకు సన్నద్ధమవుతూ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది.
IT ఉత్పత్తుల ఎగుమతిలో రూ.7లక్షల కోట్లతో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా, హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. వచ్చే మూడేళ్లలో తాము బెంగళూరును అధిగమించి ముందుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. కాగా, రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు నేటి నుంచి ఈనెల 13 వరకు మంత్రి అమెరికా, సౌత్ కొరియాలో పర్యటిస్తున్నారు.
RR జిల్లా కలెక్టర్ శశాంక అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ✓LRS అప్లికేషన్లో ప్రాసెసింగ్పై చర్యలు చేపట్టాలి. ✓పెండింగ్ ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ✓అంగన్వాడి కేంద్రాలలో మరుగుదొడ్లు, తాగునీటి వసతులు కల్పించాలి. ✓జిల్లావ్యాప్తంగా స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాం విజయవంతం చేయాలి. ✓రైతు రుణమాఫీపై రైతులకు సమాచారం అందించండి.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో తాగి వాహనాలు నడిపి 309 మంది బాబులు పోలీసులకు పట్టుబడ్డారు. కమిషనరేట్ పరిధిలో శుక్రవారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. 309 మందిలో అత్యధికంగా 211 మంది ద్విచక్ర వాహనదారులు కాగా.. 11 మంది ఆటో డ్రైవర్లు, 36 మంది కారు, ఒకరు భారీ వాహన డ్రైవర్లు ఉన్నారు.
పద్మ పురస్కారాల గ్రహీత, ప్రముఖ నర్తకి యామినీ కృష్ణమూర్తి మృతి పట్ల రాష్ట్ర CM రేవంత్ రెడ్డి HYDలో సంతాపం తెలిపారు. భరత నాట్య, కూచిపూడి నృత్య కళకు యామినీ విశిష్ట సేవలందించారని, ఎంతో మంది యువతకు నాట్యం నేర్పించి దేశంలోనే కళారంగానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చారని గుర్తు చేసుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆయన భగవంతుడిని ప్రార్థించారు.
దోస్తానా అంటే HYD, రంగారెడ్డి వాసులు ప్రాణమిస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వీడని బంధాలు రాజధానిలో కోకొల్లలు. ఆటపాటలతో పాటు ఆపదలోనూ తోడు ఉంటారు. ఇక స్కూల్ దోస్తుల జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంటాయి. ఫెయిర్ వెల్ పార్టీలో కన్నీరు పెట్టిన మిత్రులెందరో ఉంటారు. అటువంటి మిత్రుల కోసమే నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..? Happy Friendship Day
Sorry, no posts matched your criteria.