RangaReddy

News August 10, 2024

CID డైరెక్టర్ జనరల్‌గా షికా గోయల్ బాధ్యతల స్వీకరణ

image

IPS అధికారిణి షికా గోయల్ DGP ర్యాంకు పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా శనివారం HYDలో సీఐడీ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలను స్వీకరించినట్లు తెలిపారు. ఇప్పటికే షికా గోయల్ తెలంగాణ ఉమెన్ సేఫ్టీ ఇన్‌ఛార్జి డీజీగా, సైబర్ బ్యూరో డైరెక్టర్‌గా, ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ డైరెక్టర్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ బాధ్యతలను సైతం కొనసాగించనున్నట్లు తెలిపారు.

News August 10, 2024

HYD: ప్రజలను తప్పుదారి పట్టిస్తోన్న KTR, హరీశ్‌రావు: SRR

image

బోగస్ స్టేట్‌మెంట్లతో KTR, హరీశ్‌రావు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్ మీడియా కమిటీ తెలంగాణ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. HYD గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా వారి నైజం మాత్రం మారలేదని అన్నారు. వారిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ నీటి విషయంలో వారు సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు.

News August 10, 2024

CID డైరెక్టర్ జనరల్‌గా షికా గోయల్ బాధ్యతల స్వీకరణ

image

IPS అధికారి షికా గోయల్ DGP ర్యాంకు పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా శనివారం HYDలో సీఐడీ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలను స్వీకరించినట్లు తెలిపారు. ఇప్పటికే షికా గోయల్ తెలంగాణ ఉమెన్ సేఫ్టీ ఇన్‌ఛార్జి డీజీగా, ఫైబర్ బ్యూరో డైరెక్టర్‌గా, ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ డైరెక్టర్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ బాధ్యతలను సైతం కొనసాగించనున్నట్లు తెలిపారు.

News August 10, 2024

HYD: ప్రజలకు రాచకొండ సీపీ సూచనలు

image

HYD నగర ప్రజలకు రాచకొండ సిపి సుధీర్ బాబు వర్షాకాలం వేళ పలు సూచనలు చేశారు. ✓రోడ్డు పై వాహనం నడిపే సమయంలో సడన్ బ్రేక్స్ వేయకండి ✓ఒక వాహనానికి మరో వాహనానికి మధ్య 10 ఫీట్ల దూరం పాటించండి ✓తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలి ✓కారులాంటి వాహనాలు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలి ✓తడిగా ఉన్న రోడ్ల పై అత్యంత జాగ్రత్తగా వెళ్లాలని అన్నారు.

News August 10, 2024

HYD సిటీ పోలీస్ కమిషనరేట్‌కు రూ.316.44 కోట్లు

image

HYD కమిషనరేట్ పరిధిలో 2023-24వ సంవత్సరంలో రూ.176.26 కోట్లు కేటాయించగా, 2024-25 సంవత్సరంలో రూ.316.44 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. బందోబస్తు కోసం రూ.12.30 కోట్లు, కమ్యూనిటీ పోలీసింగ్ కోసం రూ.10 లక్షలు, చిన్నారుల మహిళా భద్రత కోసం రూ.20 లక్షలు, సీసీ టీవీ నిఘా కోసం రూ.50 కోట్లు, వ్యవస్థీకృత నేరాలపై పోరాటం కోసం రూ.18.45 కోట్లు, భవనాల నిర్మాణం కోసం రూ.10 కోట్లు కేటాయించారు.

News August 10, 2024

HYD: విశ్రాంత మహిళా ఉద్యోగిని బెదిరించి రూ.22 లక్షలు లూటీ

image

విశ్రాంత మహిళా ఉద్యోగిని నుంచి సైబర్ నేరస్థులు నగదు దోచేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD నగరానికి చెందిన విశ్రాంత మహిళా ఉద్యోగినికి(80) గుర్తు తెలియని వ్యక్తి ఢిల్లీ CP అని ఫోన్ చేశాడు. మీ మొబైల్ నంబర్‌తో మత్తు పదార్థాల పార్సిల్ వచ్చిందని అరెస్టు చేస్తామని బెదిరించాడు. భయపడ్డ బాధితురాలు నేరగాడు చెప్పిన ఖాతాకు రూ.22 లక్షలు జమ చేశారు. ఆ తర్వాత మోసమని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News August 10, 2024

నాలాల్లో నీటి నిల్వ వల్ల దోమల బ్రీడింగ్‌కు అవకాశం: ఆమ్రపాలి

image

HYD నగరంలో వరద నీటి కాలువలో నీరు నేరుగా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని GHMC కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు. నాలాల్లో నీటి నిల్వ వల్ల దోమల బ్రీడింగ్‌కు అవకాశం ఉందన్నారు. అలాంటి సందర్భంలో దోమలు వ్యాప్తి చెందకుండా పూడికతీత చేపట్టాలని అధికారులకు సూచించారు. స్మార్ట్ వాటర్ డ్రైన్, మూసీ నదిలో వరద నీరు నేరుగా వెళ్లకపోవడం మూలంగా నిల్వ ఉండిపోతున్నాయన్నారు. ఫలితంగా దోమల వ్యాప్తి ఎక్కువగా ఉందన్నారు.

News August 10, 2024

HYD: వరదల నియంత్రణకు రూ.2,541 కోట్లు

image

దేశంలోని 6 ప్రధాన నగరాలైన HYD, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్, పూణే ప్రాంతాల్లో వరదల నియంత్రణకు రూ.2,514.36 కోట్లతో కేంద్రం 6 ప్రాజెక్టులను రూపొందించింది.కేంద్ర హోం మంత్రి అమిత్ షా, నీతి అయోగ్ అధ్యక్షుడు సుమన్ బేరిల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అనుమతి లభించింది.రూ.470.50 కోట్లతో యువ ఆపద మిత్ర పథకంలో NCC,NSS,NYKS భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ చెందిన 2.37 లక్షల వాలంటీర్ల సేవలను ఉపయోగించనున్నారు..

News August 10, 2024

HYD నిమ్స్‌లో అడ్మిషన్లు

image

HYD పంజాగుట్ట నిమ్స్‌లో బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలని యాజమాన్యం ప్రకటనలో కోరింది. ఇందులో భాగంగా బీపీటీలో 50 సీట్లు, బీఎస్సీ నర్సింగ్ 100 సీట్లు, బీఎస్సీ డిగ్రీ కోర్సులో 100 సీట్లు భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఆసక్తి గల వారు ఈ నెల 23లోపు ఆన్లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

News August 10, 2024

HYD: ప్రజాపాలన కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి: ZC

image

ఎల్బీనగర్ జోన్ పరిధిలోని  కాప్రా, ఉప్పల్, హయత్ నగర్, ఎల్బీనగర్, సరూర్ నగర్ తదితర ప్రాంతాలలో ప్రజాపాలన దరఖాస్తు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ZC హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు. దరఖాస్తుల సవరణ, పథకాలు అందనివారికి అందేలా చూస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.