India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏప్రిల్ 21న (ఆదివారం) మహవీర్ జయంతి వేడుకలు నిర్వహించేందుకు జైనులు సిద్ధమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్లో వీరి సంఖ్య ఎక్కువే ఉండడంతో ఆ రోజు భారీ ర్యాలీలు తీయనున్నారు. ఈ నేపథ్యంలోనే GHMC పరిధిలో మాంసం దుకాణాలు (మటన్, పశువుల కబేళాలు, బీఫ్ షాపులు) మూసివేయనున్నారు. ఇందుకు సంబంధించి బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ ఆదేశాలు జారీ చేశారు. SHARE I
హైదరాబాద్ శివారులో దారుణం జరిగింది. చేవెళ్ల మండలంలోని ఊరేళ్ళ గ్రామ సమీపంలోని ఓ ఫామ్హౌస్లో నారాయణ దాస్ (46) హత్యకు గురయ్యారు. CI లక్ష్మారెడ్డి వివరాల ప్రకారం.. చేవెళ్ల గ్రామానికి చెందిన నారాయణ దాస్ను వరుసకు బావమరిది అయిన తూర్పటి భాస్కర్ గొడ్డలితో నరికి హత్య చేసినట్లు వెల్లడించారు. అనంతరం చేవెళ్ల PSలో నిందితుడు లొంగిపోయినట్లు తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
HYDలోని చైతన్యపురికి చెందిన గాడిపర్తి సాహి దర్శిని UPSCలో 112వ ర్యాంకు పొందారు. ఆమె తల్లి హైకోర్టులో న్యాయవాది, తండ్రి ప్రైవేటు స్కూల్ నిర్వాహకుడు. ఇంటర్ వరకూ HYDలోనే చదువుకున్నారు. ఐఐటీ పట్నాలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. పేదవారికి సేవ చేయాలన్నదే తన లక్ష్యమని సాహి దర్శిని పేర్కొన్నారు.
వ్యభిచార గృహాలపై HYD పోలీసులు దాడులు కొనసాగిస్తున్నారు. తాజాగా ఫిలింనగర్ రోడ్ నం.8లో రైడ్స్ చేశారు. ‘అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం మేరకు దాడులు చేశాం. సబ్ఆర్గనైజర్, విటుడిని అరెస్ట్ చేశాం. దీపక్ అనే వ్యక్తి ఆన్లైన్ ద్వారా ఈ దందా చేస్తున్నట్లు గుర్తించాం’ అని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. వ్యభిచారకూపంలో మగ్గుతున్న యువతి(22)ని స్టేట్ హోంకు తరలించారు.
RANK 50: KN చందన జాహ్నవి, హిమాయత్నగర్
82: మెరుగు కౌశిక్, హబ్సిగూడ
112: సాహి దర్శిని, చైతన్యపురి
231: తరుణ్, మంచన్పల్లి, పూడూరు-VKB
312: ముస్తఫా హష్మి, హైదరాబాద్
411: నందిరాజు శ్రీమేఘనాదేవి, హైదరాబాద్
545: నరేంద్ర పడాల, కోహెడ, తుర్కయాంజాల్-RR
649: ఐశ్వర్య నెల్లి శ్యామల, హైదరాబాద్
770: మహమ్మద్ అష్ఫక్, పెద్దేముల్-VKB
891: K. శశికాంత్, షాద్నగర్-RR
SHARE IT
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఉపఎన్నికకు 500 వరకు బ్యాలెట్ కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు అందుబాటులో ఉంటాయన్నారు. కంటోన్మెంట్ పరిధిలో దాదాపుగా 2.51 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, 232 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
పాతబస్తీ మెట్రో నిర్మాణంలో వ్యయం తగ్గించేందుకు అధికారులు టెక్నికల్ అంశాలపై ఫోకస్ పెట్టారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా 5.5KM అంటున్నప్పటికీ , ఇప్పటికే మూసీలో 0.3KM మెట్రో రివర్సల్ ఉంది. ఇంకా 5.2KM నిర్మిస్తే సరిపోతుంది. దీంతో కొంత వ్యయం తగ్గించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. పాత అలైన్మెంట్ ప్రకారం ఆరు స్టేషన్లు ఉండగా, నాలుగు స్టేషన్లకు కుదించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
HYD నగరం నుంచి విశాఖపట్నం, బెంగళూరు, తిరుపతి మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు అనుగుణంగా రాత్రి వేళల్లో MMTS అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. HYD నగరానికి వచ్చే వందే భారత్ రైళ్లన్నీ రాత్రి 11 గంటల తర్వాతే వస్తున్నాయని.. ఆ సమయంలో ప్రజారవాణా లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నామని పేర్కొన్నారు.
రాష్ట్ర రాజధాని HYD నగరానికి 3D చిత్రం రాబోతుంది. గ్రేటర్ విస్తీర్ణాన్ని డ్రోన్లతో రికార్డు చేసి, తద్వారా వచ్చే బేస్ మ్యాప్ పై క్షేత్రస్థాయి సర్వేలో తీసే ఫొటోలు, ఇతర వివరాలను పొందుపరుస్తారు. దీని పై GHMC ఐటీ విభాగం భారీ కసరత్తు చేసింది. మొదట ఆస్తిపన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు,తాగునీరు, విద్యుత్తు కనెక్షన్లు, నగరంలోని ఎత్తుపల్లాలు, నిర్మాణాలను సైతం డిజిటలైజ్ చేయనున్నారు.
అనంతగిరి HYD నగరానికి దాదాపుగా 70.3 కిలోమీటర్ల దూరంలో ఉంది. బయట వాతావరణంతో పోల్చితే ఇక్కడ 5 సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత తక్కువే ఉంటుంది. గుహలు, కోటలు, దేవాలయాలు ఈ ప్రదేశ ఔన్నత్యాన్ని తెలియజేస్తాయి. అనంత పద్మనాభస్వామి దేవాలయం ఫేమస్. అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్ కూడా ఉంటుంది. మూసీనది పుట్టింది కూడా ఇక్కడే. వేసవి కావడంతో టూరిస్టుల ఇటువైపు మొగ్గుచూపుతున్నారని అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.