India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD శివారు ఆమనగల్లు మండల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ నాయకుడు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. పులిగోనిపల్లి తండాకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు రమేశ్ నాయక్ (36) ఆమనగల్లు నుంచి తన ఆటోలో తండాకు వెళుతున్నాడు. హనుమాన్ ఆలయం మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు SI వెంకటేశ్ తెలిపారు.
రాష్ట్రంలో ప్రతి ఏటా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు 15 వేలు నమోదవుతుండగా.. కొత్త కేసుల్లో 13% సర్వైకల్ క్యాన్సర్ ఉంటున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఒక్క HYD MNJ ఆస్పత్రిలోనే రోజూ 300-400 మందికి సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు చేస్తుండగా 2-3 కేసులు బయట పడుతున్నాయి. ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో వ్యాక్సిన్ అందించినట్లు MNJ డైరెక్టర్ జయలత తెలిపారు.
మూడంతో 3 నెలలు నిలిచిపోయిన శుభ కార్యక్రమాలు సోమవారం నుంచి మొదలు కానున్నాయి. ఎల్లుండి నుంచి శ్రావణ మాసం మొదలు కానున్న నేపథ్యంలో HYD, ఉమ్మడి RRలో ఫంక్షన్ హాళ్లకు గిరాకీ రానుంది. ఈనెల 8, 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24, 28, 30వ తేదీల్లో వివాహ ముహూర్తాలు ఉన్నట్లు అర్చకులు తెలిపారు. గృహప్రవేశాలకు ఇప్పటికే చాలామంది శుభ ముహూర్తాలు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కాగా, శ్రావణ మాసం SEP3తో ముగుస్తుంది.
HYD సిటీలో బస్సుల సంఖ్య పెంచాలని కోరుతూ గాంధీ హాస్పిటల్ ఎదురుగా బస్ స్టాప్లో సంతకాల సేకరణ చేశారు. CPM నగర కార్యవర్గ సభ్యురాలు నాగలక్ష్మి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ మహిళల ఉచిత బస్సు పథకం మంచిదే కానీ.. HYD నగర జనాభాకు అనుగుణంగా బస్సుల సంఖ్య లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో నగరంలో 3,800 బస్సులు ఉండేవని, గత BRS ప్రభుత్వం మూడేళ్లలో 1,000 బస్సులు తగ్గించిందన్నారు.
HYD త్వరలో తిరుగులేని నగరంగా మారుతుందా అంటే నిపుణులు అవుననే చెబుతున్నారు. నగర శివారులో 200 ఎకరాల్లో AI సిటీ, 100 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీ, 100 ఎకరాల్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, హెల్త్ హబ్, ఫార్మా విలేజెస్, మూసి ప్రక్షాళన, 800 ఎకరాల్లో టెక్స్ టైల్ వెల్ స్పన్, 300 ఎకరాల్లో కైటెక్స్, 250 ఎకరాల్లో ఫాక్స్ కాన్, 15 ఎకరాల్లో ఒలెక్ట్రా లాంటి భారీ కంపెనీల ఏర్పాటు పూర్తైతే HYDకు తిరుగు లేదంటున్నారు.
విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ వంటివి యువతకు చేరడం, అర్థరాత్రిళ్లూ మద్యం అమ్మకాలు నేరాలకు కారణమవుతున్నాయి. మూడు కమిషనరేట్లలో మాదకద్రవ్యాలను అడ్డుకుంటున్నా ఏదో ఒక రూపంలో చేరుతున్నాయి. టీజీన్యాబ్ ఈ ఏడాది ఇప్పటి వరకూ 788 కేసుల్లో 1580 మందిని అరెస్టు చేసి రూ.74 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకుంది. ఇందులో సగానికి పైగా రాజధాని HYD పరిధిలో స్వాధీనం చేసుకున్నవే కావడం గమనార్హం.
ముందస్తు జాగ్రత్తలతో డెంగ్యూ, మలేరియా, ఇతర వ్యాధులను కట్టడి చేయగలమని HYD నగరంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న వైద్యారోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగూ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. నగరంలోని 225 బస్తీ దవాఖానాల్లో జ్వరాలకు ఉచితంగా వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయన్నారు. నీరసం, జ్వరం వంటి సమస్యలు ఉన్నవారు బస్తీ దవాఖానల్లో చూపించుకోవాలని సూచించారు.
BRS ఎమ్మెల్యేలు పద్ధతి మార్చుకోవాలని ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ అన్నారు. MLA క్వార్టర్స్లో ఈరోజు CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిన్న అసెంబ్లీలో BRS వాళ్లు కావాలనే తనను టార్గెట్ చేశారని, HYD అభివృద్ధిపై మాట్లాడనీయలేదన్నారు. సీఎంను, తనను కించపరిచారని, అందుకే సహనం కోల్పోయి అలా మాట్లాడానని, క్షమాపణ చెప్పానని పేర్కొన్నారు. పదేళ్లలో ఏనాడూ తనకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రాలేదన్నారు.
HYD మాసబ్ ట్యాంక్ వద్ద ఉన్న జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఈ విద్యాసంవత్సరం 2024-25 నుంచి 85% సీట్లు తెలంగాణ స్థానికత ఉన్నవారికే కేటాయించనున్నట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్ రమేష్ బాబు తెలిపారు. తెలంగాణ ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఇది అమలులోకి వచ్చిందని తెలిపారు. 15% అన్ రిజర్వుడ్గా ఉంటుందని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా హాస్పిటల్ను గోషామహల్లోని పోలీస్ క్వార్టర్స్కు తరలిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో పాత ఉస్మానియా భవనాన్ని హెరిటేజ్ భవనంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. దీనికోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నారు. కాగా, ఉస్మానియా ఆసుపత్రి శిథిలావస్థకు చేరుకోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారని పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Sorry, no posts matched your criteria.