RangaReddy

News August 9, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓రాయపోల్ గ్రామంలో కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి
✓అసైన్డ్ భూములు అర్హులకు అందేలా చూస్తాం:భట్టి
✓బంజారాహిల్స్: ఆదివాసి భవన్లో వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క
✓5 లక్షల మంది మహిళలకు AI పై త్వరలో శిక్షణ
✓ఆగస్టు 15 నుంచి ఆర్టిసి బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగే ఛాన్స్
✓క్రికెట్ క్లబ్ దాఖలు చేసిన పిటిషన్ విచారించాలి:హైకోర్టు

News August 9, 2024

హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి వైద్య సేవలు

image

ప్రపంచస్థాయి వైద్య సదుపాయాలతో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ముందుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం బేగంపేటలోని ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, వివేకానంద క్లినిక్స్ నూతన శాఖను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. హాస్పిటల్లో ఆధునిక శాస్త్ర చికిత్సకు అందజేస్తున్న టెక్నాలజీ, వైద్య సేవలను పరిశీలించారు. దేశంలో రాష్ట్రం ప్రధాన ఆరోగ్య గమ్యస్థానంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు.

News August 9, 2024

HYD: అర్హులకే అసైన్డ్ భూములు: భట్టి విక్రమార్క

image

ఇందిరాగాంధీ కాలంలో భూమి లేని పేదలకు పంచిన ఆసైన్డ్ భూములు తిరిగి అర్హులకే చెందేలా చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భరోసానిచ్చారు. మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నాదర్‌గుల్ రైతులు ప్రగతిభవన్‌లో డిప్యూటీ సీఎంను కలిసి తమకు కేటాయించిన భూములను కొంతమంది ప్రైవేటు వ్యక్తులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని పిర్యాదు చేశారు. తగిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం తెలిపారు.

News August 9, 2024

HYD: ఫుడ్ కోర్టులు, రిసార్ట్స్ ప్రైవేటీకరణ!

image

రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఏటా కోట్లాది నిధులను సమకూరుస్తున్న పర్యాటక సంస్థ రిసార్ట్స్, ఫుడ్ కోర్టులను ప్రైవేట్ పరం చేయడానికి రంగం సిద్ధమైంది. మొదటగా గోల్కొండ ఇబ్రహీంబాగ్ సమీపంలోని తారామతి బారాదరి ఫుడ్ కోర్టు నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా సుమారు కోటికి పైగా పర్యాటక సంస్థకు ఆదాయాన్నిచ్చే ఫుడ్ కోర్టును ప్రైవేట్ పరం చేయడాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు.

News August 9, 2024

HYD: 5 లక్షల మంది మహిళలకు AIలో శిక్షణ

image

ఏఐ రంగంలో మహిళా సాధికారత సాధించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), సౌత్ ఏషియన్ ఉమెన్ ఇన్ టెక్నాలజీ (ఎస్ఏడబ్ల్యు ఐటీ), ఎడ్యుటెక్ కంపెనీ గువీ సంయుక్తంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ప్రపంచంలోకెల్లా మహిళలకు అతిపెద్ద శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నాయి. జెన్ ఏఐ లెర్నింగ్ ఛాలెంజ్ పేరిట సెప్టెంబర్ 21న ఏకంగా 5 లక్షల మంది మహిళలకు శిక్షణ అందించనున్నాయి.

News August 9, 2024

HYD: కుక్కల దాడిలో మరో బాలుడి మృతి

image

జవహర్‌నగర్‌లో కుక్కల దాడికి బాలుడు మృతిచెందిన ఘటన మరువకముందే HYD శివారులో మరో ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామానికి చెందిన శివ-మాధురి దంపతుల కుమారుడు క్రియాన్ష్(4) ఇటీవల స్కూల్‌కు వెళ్లి వస్తుండగా అతడిపై కుక్కలు దాడి చేశాయి. దీంతో బాలుడికి తీవ్ర గాయాలవగా తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తాజాగా బాలుడు మృతిచెందాడు.

News August 9, 2024

HYD: HCA లీగ్ మ్యాచ్లు నిర్వహించొద్దు: హైకోర్టు

image

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లీగ్ మ్యాచ్లు నిర్వహించొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. HCA అపెక్స్ కౌన్సిల్ రిలీజ్ చేసిన ప్రకటన ఆధారంగా ఎలాంటి మ్యాచ్లు నిర్వహించొద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆటగాళ్ల ఎంపిక నిమిత్తం లీగ్ మ్యాచ్లను నిర్వహించేందుకు హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ విడుదల చేసిన ప్రకటనను సవాలు చేస్తూ హైదరాబాద్ చార్మినార్ క్రికెట్ క్లబ్ దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించింది.

News August 9, 2024

నాంపల్లి: భూదాన్ యజ్ఞ బోర్డు రద్దు కరెక్టే: హైకోర్టు

image

భూదాన్ యజ్ఞ బోర్డును రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు చట్టబద్ధమైనదని హైకోర్టు తీర్పు వెలువరించింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బోర్డు ఛైర్మన్, మెంబర్స్ దాఖలు చేసిన అప్పీలును డిస్మిస్ చేసింది. అంతేకాకుండా ప్రత్యేక అధికారిగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నియామకాన్ని సమర్థించింది. బోర్డు రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది.

News August 9, 2024

శంషాబాద్: ఆగస్ట్ 15 తర్వాత విమానాశ్రయంలో రద్దీ!

image

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణీకులకు ముఖ్య సూచిక చేసింది. ఆగస్ట్ 15 నుంచి వారం రోజులపాటు ప్రయాణీకుల రద్దీ పెరిగే అవకాశం ఉందని అందుకే విమాన ప్రయాణాలు చేసే వారు ఎయిర్ పోర్ట్‌కు ముందుగానే చేరుకోవాని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రకటించింది. రాఖీ పండుగ కారణంగా ప్యాసింజర్లు రద్దీ పెరుగుతుందని ఎయిర్ పోర్ట్ అంచనా వేసింది. ఈమేరకు ఫ్లైట్ సమయానికంటే ముందే బయలుదేరాలని సూచించింది.

News August 9, 2024

HYD: పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్ రీషెడ్యూల్

image

ఇంజినీరింగ్ కళాశాలల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను రీషెడ్యూల్ చేశారు. కొత్త షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 2 నుంచి ఈ ప్రక్రియ మొదలుకానున్నాయి. టీజీపీజీఈసీ/టీజీపీజీఈసెట్-2024 ప్రవేశాల రీషెడ్యూల్ ప్రకారం ఈ నెల 24 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. అనంతరం 25న అర్హుల జాబితా ప్రకటిస్తారు. 29న వెబ్ ఆప్షన్ల సవరణ, సెప్టెంబర్ 1న తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.