India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గాంధీ ఆసుపత్రి జిరియాట్రిక్ వైద్య విభాగానికి నాలుగు పీజీ సీట్లు మంజూరు చేస్తూ నేషనల్ మెడికల్ కౌన్సిల్(NMC) ఉత్తర్వులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ర్టంలో ఇప్పటికే నిమ్స్, ఉస్మానియా ఆసుపత్రుల్లో జిరియాట్రిక్ వార్డులుండగా, ఇటీవల గాంధీ ఆసుపత్రిలో వయో వృద్ధులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడానికి గాంధీ మెయిన్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఈ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు.
HYD నగరం సహా రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. HYD టీమ్స్ ఆసుపత్రులను 14 అంతస్తులకే పరిమితం చేస్తామని, ఉస్మానియా, గాంధీ వైద్య కళాశాల హాస్టల్స్ భవనాలను రెండేళ్లలోపే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక ప్రణాళికతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు.
సీఎం ఆదేశాల మేరకు హెల్త్ టూరిజం హబ్ నిర్మించడం కోసం RR జిల్లాలోని షాబాద్, శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని ప్రభుత్వ భూములను అధికారులు పరిశీలిస్తున్నారు. దాదాపు 500 నుంచి 1000 ఎకరాలు ఉంటే బాగుంటుందని ప్లాన్ చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో నెలకొల్పనున్న పరిశ్రమలు, ఐటి, ఫార్మా విలేజెస్ అంశాలను సైతం అధికారులు పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు.
వాతావరణంలోని మార్పుల కారణంగా భాగ్యనగర ప్రజలు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఈక్రమంలోనే సాధారణంగా HYD ఫీవర్ ఆస్పత్రిలో 100-200 ఓపీ కేసులు నమోదవుతాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 300 నుంచి 600కు చేరింది. జులై నెల మొదటి 19 రోజుల్లోనే 7089 ఓపీలు, 54 డెంగ్యూ కేసులు, 108 డిఫ్తీరియా కేసులు నమోదైనట్లు రిపోర్ట్ విడుదల చేశారు. 4 రోజులకు మించి జ్వరం ఉంటే అశ్రద్ధ చేయొద్దని వైద్యులు చెబుతున్నారు.
అసెంబ్లీ వేదికగా CM రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. లండన్లో ఉన్న ‘లండన్ ఐ’ లాంటి టవర్ను HYDలోని మీర్ఆలం చెరువులో ‘హైదరాబాద్ ఐ’ పేరుతో నిర్మించనున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి చూస్తే నగరంలోని అందాలన్నీ కనిపించేలా టవర్ను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. 2.6కి.మీ. పొడవుతో ప్రపంచంలోనే ది బెస్ట్ బ్రిడ్జుల్లోనే ఒకటిగా సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మించనున్నారని, నెలరోజుల్లో దీని డీటెయిల్స్ ఇస్తామన్నారు.
ఈనెల 5 నుంచి 9 వరకు నిర్వహించనున్న ‘స్వచ్ఛదనం- పచ్చదనం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బల్దియా కమిషనర్ ఆమ్రపాలి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పారిశుధ్యం, పచ్చదనాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణపై కమిషనర్ శుక్రవారం జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.
GHMCలో పలు ప్రాంతాలు విలీనం కానున్నాయి. వీటిలో జన్వాడ, గోల్కొండ కుర్దు, గోల్కొండ కలాన్, హమిదుల్లానగర్, బొంరాస్పేట, మంచిరేవుల, పూడూరు, గౌడవెల్లి, తిమ్మాయిపల్లి, యాద్గార్ పల్లి, మాంకాల్, రాంపల్లి, కీసర, గోధుమకుంట, చీర్యాల, తారామతిపేట, గౌరెల్లి, కుత్బుల్లాపూర్, బాచారం, ప్రతాపసింగారం , పీర్జాదిగూడ, కొర్రెముల, కాచవాణి సింగారం సహా.. పలు గ్రామాలు, SCB కంటోన్మెంట్, 61 ఇండస్ట్రియల్ ప్రాంతాలు ఉన్నాయి.
HYD హైటెక్స్ వద్ద క్రేడాయ్ ప్రాపర్టీ షో-2024 కొనసాగుతోంది. ఆగస్టు 4వ తేదీ వరకు ఈ ప్రాపర్టీ షో జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థల ప్రతినిధులు, దేశీ విదేశీ కంపెనీల యజమానులు పాల్గొన్నారు. బడ్జెట్లో HYD నగర అభివృద్ధి కోసం రూ.10,000 కోట్లు కేటాయించడంపై పలువురు సంతోషం వ్యక్తం చేశారు. బడ్జెట్ కేటాయింపులు నగర అభివృద్ధి పై ప్రభావం చూపుతాయన్నారు.
GHMCలో <<13752316>>విలీనం కానున్న<<>> మున్సిపల్ కార్పొరేషన్ల లిస్ట్ డ్రాఫ్ట్ బిల్లులో అధికారులు పొందుపరిచారు. ఇందులో RR జిల్లాలోని బడంగ్పేట్, బండ్లగూడ జాగీర్, మీర్పేట్.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని జవహర్నగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, నిజాంపేట్ కార్పొరేషన్లు ఉన్నాయి. డ్రాఫ్ట్ బిల్ ఆమోదం తెలిపితే ఈ ప్రాంతాలు GHMCలో విలీనం కానున్నాయి. ఈ మేరకు పూర్తి వివరాలతో అధికారులు డ్రాఫ్ట్ బిల్లు సిద్ధం చేశారు. SHARE IT
ప్రమాదవశాత్తూ బాలిక మృతి చెందిన ఘటన పేట్బషీరాబాద్ PS పరిధిలో జరిగింది. పోలీసుల ప్రకారం.. గోవన్ కుమార్తె రియా(13), కొడుకు అపార్ట్మెంట్లో 7వ అంతస్తులో ట్యూషన్కు వెళ్లి వచ్చారు. రియా పెన్ను మర్చిపోయానని వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతకగా 7వ అంతస్తు నుంచి కింద రక్తం మడుగులో పడి ఉన్న కుమార్తెను గుర్తించారు. ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Sorry, no posts matched your criteria.