RangaReddy

News August 9, 2024

16న శంకర్‌పల్లికి సీఎం రేవంత్ రెడ్డి

image

ఈ నెల 16న శంకర్‌పల్లికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. మున్సిపాలిటీలో కేంద్ర పథకం అమృత్ 2.0 కింద రూ. 32 కోట్లతో నిర్మించే వాటర్ ట్యాంకు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. టీయూఎఫ్ ఐడీసీ నిధులు రూ.21 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులను సీఎం ప్రారంభిస్తారని కమిషనర్ శ్రీనివాస్ వెల్లడించారు.

News August 9, 2024

HYD: ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు కొత్త ప్రయోగం

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు పోలీసులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సంయుక్త ఆధ్వర్యంలో ఐటీ కంపెనీల భవనాలకు హై రేంజ్‌ కెమెరాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 70 ప్రాంతాల్లో కెమెరాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. వీటి ద్వారా ట్రాఫిక్ జామ్‌ను గుర్తించి క్లియర్ చేయనున్నారు.

News August 9, 2024

నిమ్స్‌లో BSc నర్సింగ్ కోర్సులకు దరఖాస్తులు

image

నిమ్స్‌లో 2024 విద్యా సంవత్సరానికి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, అనుబంధ హెల్త్ సైన్సెస్‌లో బీఎస్సీ డిగ్రీ కోర్సులో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ తెలిపింది. బీపీటీలో 50, బీఎస్సీ నర్సింగ్‌లో 100, బీఎస్సీ డిగ్రీ‌లో 100 సీట్లు ఉన్నట్లు తెలిపింది. ఈ నెల23 లోపు అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని నిమ్స్ డీన్ రాజశేఖర్ గురువారం వివరించారు.

News August 9, 2024

HYD: SPF చేతుల్లోకి సచివాలయ భద్రత!

image

సచివాలయ భద్రత మళ్లీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) చేతుల్లోకి వెళ్లనుంది. ప్రస్తుతం తెలంగాణ ప్రత్యేక పోలీసు పటాలం(టీజీఎస్సీ) సిబ్బంది ఈ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా వీరి స్థానంలో ఎస్పీఎఫ్ మోహరించే అవకాశం కనిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వచ్చే నెల 1వ తేదీ నుంచి ఈ మార్పు అమలులోకి వచ్చే రానుంది.

News August 9, 2024

HYD: నాగులపంచమి: ‘పాములను హింసించవద్దు’

image

నాగులపంచమి రోజున పూజల పేరుతో పాములను పట్టుకుని హింసించవద్దని భారతీయ ప్రాణి మిత్ర సంఘ్‌ అధ్యక్షుడు జస్‌రాజ్‌శ్రీ శ్రీమల్, ప్రధాన కార్యదర్శి మహేశ్‌ అగర్వాల్ విజ్ఞప్తి చేశారు. కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. పాములను హింసించే వారి సమాచారాన్ని టోల్‌ఫ్రీ నంబర్‌ 18004255364కు తెలియజేస్తే బహుమతి ఇస్తామని ప్రకటించారు.

News August 9, 2024

HYD: GREAT.. 4 GOVT JOBS సాధించింది!

image

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పాతదొనబండ తండా వాసి భూక్యా మౌనిక ఏకంగా 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. పేద కుటుంబానికి చెందిన ఆమె HYD దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటూ స్థానికంగా ఉండే పిల్లలకు హోమ్ ట్యూషన్లు చెబుతూ ఆమె చదువుకుంది. ఎలాంటి కోచింగ్ లేకుండానే గ్రూప్-4 ఆరో ర్యాంకు, TGPSC ఫలితాల్లో పంచాయతీరాజ్ AEE, 2023లో రైల్వేలో క్యారేజ్ అండ్ వ్యాగన్, లెవల్-3లో కమర్షియల్ కం టికెట్ క్లర్క్ జాబ్స్ సాధించింది.

News August 9, 2024

HYD శివారులో మరకత లింగం.. పూజిస్తే రోగాలు నయం

image

శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివలింగం శంకర్‌పల్లి మం. చందిప్ప గ్రామంలో ఉంది. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ మరకత సోమేశ్వర లింగాన్ని పూజిస్తే వ్యాధులు పోతాయని, సకల ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. శ్రావణమాస శుక్రవారం సందర్భంగా స్వామికి నేడు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ క్షేత్రం HYDకు 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. మెహదీపట్నం నుంచి శంకర్‌పల్లికి 505 నం. బస్సులో వెళ్లొచ్చు. అక్కడి నుంచి చందిప్పకు ఆటోలు ఉంటాయి.

News August 9, 2024

హైదరాబాద్: సెలవు ఇవ్వాలని డిమాండ్

image

ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్‌కు రెండవ శనివారం తప్పక సెలవు ఇవ్వాలని TPTLF(తెలంగాణ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ ఫెడరేషన్) డిమాండ్ చేస్తోంది. నాంపల్లిలో విద్యాశాఖ అడిషనల్ డెరైక్టర్ లింగయ్యకి మెమోరాండం అందజేశారు. రోజు‌కు 8 నుంచి 10 గంటలు పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో DYFI రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్, SFI రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేశ్ జునుగారి, నాయకులు సాయి కిరణ్ ఉన్నారు.

News August 9, 2024

హైదరాబాద్: HMDAలో కొత్త జోన్లు

image

HMDAలో కొత్తగా 2 జోన్లు పెంచారు. ఇప్పటివరకు ఘట్‌కేసర్, మేడ్చల్, శంషాబాద్, శంకర్‌పల్లి‌ HMDA పరిధిలో ఉండేవి. ఇకమీదట ఘట్‌కేసర్, శంషాబాద్‌తో పాటు మేడ్చల్-1, మేడ్చల్-2, శంకర్‌పల్లి-1, శంకర్‌పల్లి-2 అని రెండు జోన్లుగా విభజించారు. శంకర్‌పల్లి జోన్-1కు ప్రసాద్ రావు, శంకర్‌పల్లి-2కు మల్లికార్జునరావుకు బాధ్యతలు అప్పగించారు. మేడ్చల్-1కు గోపిక రమ్య, మేడ్చల్-2కు శాలినికి ప్లానింగ్ అధికారిగా నియమించారు.

News August 9, 2024

పరిశ్రమలకు హైదరాబాద్ స్వర్గధామం: డిప్యూటీ సీఎం

image

హైదరాబాదులో పరిశ్రమలు స్థాపనకు ప్రభుత్వ తరఫున సంపూర్ణ మద్దతు అందిస్తామని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్రానెట్ విన్ ఓవెన్‌‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎంతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ, అర్బన్, స్కిల్ డెవలప్మెంట్ అంశాలు చర్చించారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. పరిశ్రమలకు హైదరాబాద్ స్వర్గధామం అని అన్నారు.