RangaReddy

News April 16, 2024

HYD: నాగోల్‌లో బాలికను బెదిరించి అత్యాచారం

image

బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన నాగోల్‌లో వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. నాగోల్ PS పరిధికి చెందిన రాకేశ్ (29) ప్రైవేటు ఉద్యోగి. కొంతకాలంగా ఓ బాలిక(13)తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇటీవల ఆమెను బెదిరించి అత్యాచారం చేశాడు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. సోమవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

News April 16, 2024

హైదరాబాద్‌: మధ్యాహ్నం RTC బస్సులకు REST

image

ఎండలు దంచికొడుతున్న వేళ TSRTC కీలక నిర్ణయం తీసుకొంది. మధ్యాహ్నం HYDలో బస్సు సర్వీసుల సంఖ్యను తగ్గిస్తున్నట్లు RTC గ్రేటర్ జోన్ ED వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఎండల ప్రభావానికి ప్రయాణికులు రోడ్డెక్కడం లేదని గుర్తించామన్నారు. ఈ సమయంలో ట్రిప్పులను తగ్గించనున్నట్లు స్పష్టం చేశారు. ఉదయం 5 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సర్వీసులు ఉంటాయని.. 12PM నుంచి 4PM మధ్యలో పరిమితంగా బస్సులను నడపనున్నారు.
SHARE IT

News April 16, 2024

HYD: రూ. 5కే కూల్ వాటర్

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ వెళ్లే ప్రయాణికులకు గుడ్‌న్యూస్. వేసవి వేళ మంచినీటి వసతిని SCR అధికారులు మెరుగుపరిచారు. సాధారణ తాగునీటితో పాటుగా, కూల్‌ వాటర్‌ను రూ.5కే అందిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కూలర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 170 స్టేషన్లలో 468 వాటర్ కూలర్లను అందబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు తెలియజేశారు.

News April 15, 2024

కూకట్‌పల్లిలో డెలివరీ బాయ్ సూసైడ్

image

కూకట్‌పల్లి PS పరిధి ప్రకాశ్‌నగర్‌లో విషాదం నెలకొంది. సోమవారం రమేశ్ (20) అనే డెలివరీ బాయ్ ఆత్మహత్య చేసుకొన్నాడు. SI రామకృష్ణ వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా సీతారాంనగర్‌కి చెందిన రమేశ్ ప్రకాశ్‌నగర్‌లో నివాసం ఉంటూ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఇంట్లో పరిస్థితులు, వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

News April 15, 2024

HYD: వివాహేతర సంబంధం.. DSP ఇంటి ముందు ఆందోళన

image

ఆదిభట్ల PS పరిధి తుర్కయంజాల్ శ్రీ సాయిపంచవతి హోమ్స్‌‌లోని DSP రంగా నాయక్ ఇంటి ముందు ఆయన భార్య ఆందోళనకు దిగారు. వేరే అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను పట్టించుకోవడం లేదని జ్యోతి ఆరోపిస్తున్నారు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేస్తున్నారు. కాగా, రంగా నాయక్ ప్రస్తుతం మెదక్ ఏఆర్ డీఎస్పీగా పని చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

News April 15, 2024

HYD: అసలే ఎండాకాలం.. దొంగలతో జాగ్రత్త!

image

ఎండాకాలం వచ్చేసింది. HYD నగరంలో ఇంటిల్లిపాది విహారయాత్రలు, సొంతూళ్లకు వెళ్తుంటారు. ఏటా HYD, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో కలిపి 3 వేలకు పైగా చోరీలు జరుగుతుంటే అందులో అధిక శాతం ఈ వేసవి మూడు నెలల వ్యవధిలోనివేనని అధికారులు తెలిపారు. అంతర రాష్ట్ర ముఠా సైతం వేసవిని ఆసరాగా చేసుకుంటున్నారు. అందుకే వేసవి వేళ, నగర ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

News April 15, 2024

HYD: టూర్ ప్యాకేజీల పేరుతో ముందే వసూళ్లు.. జాగ్రత్త!

image

గ్రేటర్ పరిధిలో HYD,RR జిల్లాల వినియోగదారుల కమిషన్లున్నాయి. ఇందులో ప్రతినెలా 100కి పైగా కొత్త కేసులు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత ఈ 3 నెలల్లోనే 30-40 శాతం కేసులు నమోదయ్యాయని, విహారయాత్రలకు వెళ్లే వారి నుంచి టూర్ ప్యాకేజీలు, టిక్కెట్ బుకింగ్స్ పేరుతో ముందే డబ్బులు వసూలు చేస్తున్న కొన్ని సంస్థలు మోసం చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. అలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.

News April 15, 2024

HYD: 21 రోజుల్లో నిర్మాణాలకు ఆమోదం

image

గ్రేటర్ HYD పరిధిలో నిర్మాణ అనుమతుల దరఖాస్తులు 21 రోజుల్లో ఆమోదం పొందాలని, లేనిపక్షంలో చర్యలుంటాయని GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ అధికారులను హెచ్చరించారు. ఉద్దేశపూర్వకంగా దరఖాస్తులను తొక్కిపెట్టే వారిని సహించేది లేదన్నారు. ప్రణాళిక విభాగం కార్యకలాపాల పై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచుతారని తెలిపారు.

News April 15, 2024

HYD: నకిలీ టికెట్‌తో విమానం ఎక్కిన వ్యక్తి అరెస్ట్

image

నకిలీ టికెట్‌తో విమానం ఎక్కిన ఓ వ్యక్తి శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ అయ్యాడు. APలోని NTR జిల్లాకు చెందిన వ్యక్తి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులో గోవా వెళ్లడానికి టికెట్‌ను తీసుకొని గోవా విమానంలో కూర్చున్నాడు. ఆయన బంధువు కోటేశ్వర్ రావు అదే నంబర్‌తో టికెట్, వెబ్ బోర్డింగ్ పాస్ సృష్టించి గోవా విమానంలో కూర్చోగా.. చెక్ చేసి నకిలీ టికెట్‌గా గుర్తించారు. దీంతో భద్రతాధికారులు అరెస్ట్ చేశారు.

News April 15, 2024

HYD: కూతురు కళ్లేదుటే తండ్రి దుర్మరణం

image

రోడ్డు ప్రమాదంలో కూతురు కళ్లేదుటే తండ్రి మృతిచెందాడు. మేడ్చల్ పోలీసుల సమాచారం.. మెదక్‌ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్‌కు చెందిన రామ్ మురాట్(29) తన కుమార్తె(6)తో కలిసి ఆదివారం రాత్రి బైక్‌పై మేడ్చల్ నుంచి వస్తుండగా హైవేపై ఐసీఐసీఐ బ్యాంక్ సమీపంలో లారీ తగిలింది. దీంతో కిందపడ్డ రామ్ పైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయాడు. చిన్నారి స్వల్పగాయాలతో బయటపడింది. ఘటనపై కేసు నమోదు చేశారు.