India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇటీవల పదోన్నతులు పొందిన 25 వేల మంది టీచర్లతో సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహిస్తున్న సందర్భంగా శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు అదనపు సీపీ (ట్రాఫిక్) పి.విశ్వప్రసాద్ తెలిపారు. ఎల్బీ స్టేడియం పరిసరాల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ ఆంక్షలుంటాయని అన్నారు. రద్దీని బట్టి ఆయా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నిలిపివేయడం లేదా మళ్లిస్తామన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని GHMC కమిషనర్ ఆమ్రపాలి కాట హెచ్చరించారు. నగరంలోని పలు మాల్స్, మల్టీప్లెక్స్, సినిమా థియేటర్లలో నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయమై తనిఖీలు చేయుటకు ప్రత్యేకంగా టీమ్స్ వేశారు. అక్రమాలు చేసిన ఆయా మాల్స్కు, మల్టీప్లెక్స్లకు నోటీసులు జారీ చేశారు.
యువతిని మోసం చేసి ఆస్ట్రేలియా పారిపోయేందుకు యత్నించిన నిందితుడి ఆట కట్టించిన మహంకాళి పోలీసులను CP శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. CI పరశురామ్ టీమ్కు క్యాష్ రివార్డ్ అందజేశారు. ఛత్తీస్గఢ్కు చెందిన <<1374121>>అమ్మాయితో స్వామికి FB<<>>లో పరిచయమైంది. ఆమెను HYDకి రప్పించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడు. ఆస్ట్రేలియా పారిపోయేందుకు యత్నించగా నిందితుడిని ఎయిర్పోర్టులోనే అరెస్టు చేసి, న్యాయం చేశారు.
GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి మానవత్వం చాటుకున్నారు. గురువారం సా. KBR పార్క్కు ఆమె వాకింగ్కు వెళ్లారు. పార్క్ వద్ద నిస్సహాయస్థితిలో ఉన్న ఓ వృద్ధుడిని గమనించారు. స్వయంగా అతడి వద్దకు వెళ్లి సమస్యను తెలుసుకున్నారు. గత రెండు రోజులుగా ఏమీ తినలేదని, ఒక కాలు కూడా లేదని సదరు వృద్ధుడు తెలిపాడు. చలించిపోయిన ఆమె వెంటనే DRF సిబ్బందిని పిలిపించారు. పోలీసుల సహాయంతో బేగంపేటలోని షెల్టర్ హోంకు తరలించారు.
HYD శివారు ప్రాంతాలు GHMCలో విలీనం కానున్నాయి. రంగారెడ్డి పెద్దఅంబర్పేట్, IBP, జల్పల్లి, శంషాబాద్, తుర్కయంజాల, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, తుక్కుగూడ ఈ జాబితాలో ఉన్నాయి. అలాగే మేడ్చల్ మల్కాజిగిరిలోని దమ్మాయిగూడ, నాగారం, ఘట్కేసర్, గుండ్ల పోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్ పోచారం.. సంగారెడ్డిలోని బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్ ఉన్నాయి. డ్రాఫ్ట్ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందాల్సి ఉంది.
శాఖాహార వంటల ఆర్డర్లలో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచిందని స్విగ్గీ ప్రకటించింది. మసాలా దోశ, ఇడ్లీలను హైదరాబాదీలు ఎక్కువమంది ఇష్టపడుతున్నారని తెలిపింది. దేశంలో అత్యధికంగా ఆర్డర్ అవుతున్న 10 వంటకాల్లో 6 శాఖాహారం వంటకాలు ఉన్నాయని పేర్కొంది. తొలి రెండు స్థానాల్లో బెంగళూరు, ముంబై నగరాలు నిలిచాయి.
ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ సులభతరం చేసేందుకు ప్రభుత్వం GHMC ప్రజాపాలన సేవాకేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇక నుంచి సమాచారం, అప్లికేషన్ స్టేటస్ కోసం 6 జోన్లలోని 30 సర్కిళ్లలో 150 వార్డుల్లో కేంద్రాల్లో సంప్రదించేలా వీటిని తీసుకొచ్చింది. అంతేకాకుండా ఇటీవల సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని, సందేహాలకు నగర ప్రజలు ఏ సేవాకేంద్రంలో అయినా సంప్రదించవచ్చని తెలిపింది.
వనస్థలిపురంలోని ఓ హోటల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్పై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు యువకుల్లో గౌతమ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో యువకుడు శివాజీ రెడ్డి పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
నగరంలోని పంజాగుట్ట సర్కిల్ ప్రాంతంలో ACB అధికారులు రైడ్స్ చేశారు. పంజాగుట్ట సర్కిల్ వన్ డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ప్రైవేట్ వ్యక్తుల నుంచి రూ.2,00,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఫైనల్ ఆడిట్ క్లియర్ చేసేందుకు డబ్బులు అడిగినట్లు ఫిర్యాదు రావడంతో రైడ్స్ చేసినట్లు వెల్లడించారు.
మహేశ్వరం MLA, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి బతుకు బస్టాండ్ అంటూ అసెంబ్లీలో అగౌరవపరిచేలా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని BRS సీనియర్ నేత, ఆ పార్టీ మీర్పేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేశ్ గౌడ్ డిమాండ్ చేశారు. సీఎం మాటలకు నిరసనగా రేపు పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని ఆయన నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి భవిష్యత్తు మరిచి మాట్లాడటం సరికాదన్నారు.
Sorry, no posts matched your criteria.