RangaReddy

News April 14, 2024

హైదరాబాద్‌లో SUMMER CRICKET

image

క్రికెట్‌ ప్లేయర్లకు HCA శుభవార్త చెప్పింది. ఈనెల 20న HYDలో సమ్మర్ క్యాంప్‌ మొదలుపెడుతామని సంస్థ ప్రెసిడెంట్ జగన్‌ మోహన్‌‌ రావు తెలిపారు. ఉచితంగా‌నే ఈ క్యాంప్‌ కొనసాగిస్తామన్నారు. ఏప్రిల్ 15 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. కేంద్రాల వివ‌రాలు: హైద‌రాబాద్‌: జింఖానా: 90301 30346 ఫ‌ల‌క్‌నుమా: 98852 95387 అంబ‌ర్‌పేట్: 98665 82836 లాలాపేట్: 99664 62667 మాదాపూర్‌: 80195 35679 SHARE IT

News April 14, 2024

BREAKING: HYDలో యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

image

HYD రాజేంద్రనగర్ ORRపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు ORRపై వేగంగా వెళ్తున్న కారు హిమాయత్‌సాగర్ వద్దకు రాగానే డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులోని ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. 

News April 14, 2024

HYD: సమ్మర్ టూర్ వెళ్లాలనుకుంటున్నారా ..?

image

HYD నగరం నుంచి సమ్మర్ టూర్ వెళ్లాలనుకునే వారికి టూరిజం అధికారులు శుభవార్త తెలిపారు. 5 రోజుల టూర్లో భాగంగా అరకు ప్యాకేజీలో కైలాసగిరి, సింహాచలం, రుషికొండ, సబ్ మెరైన్ మ్యూజియం, వైజాగ్ బీచ్ చూపించనున్నట్లుగా తెలిపారు. ఈ టూర్ వెళ్లేందుకు పెద్దలకు రూ.6,999, పిల్లలకు రూ.5,599 టికెట్ ధర ఉందని పేర్కొన్నారు. 

News April 14, 2024

HYD: ఊటికి వెళ్లొద్దామా..?

image

HYD నగరంలో ఎండలు బగ్గుమంటున్న వేళ ప్రజలు విహారయాత్రలకు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో బెంగళూరు,ఊటీ, మైసూర్ ప్యాకేజీని ప్రతీ సోమవారం నిర్వహిస్తున్నారు. ఆరు రోజుల నిడివితో కూడిన ఈ టూర్లో టికెట్ ధర పెద్దలకు రూ.11,999, పిల్లలకు రూ.9,599 ఉందని, హోటల్ గదిలో ఒక్కరే ఉంటే టికెట్ ధరకు అదనంగా రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

News April 14, 2024

HYD: శ్రీరాముడి శోభాయాత్రకు భారీ బందోబస్తు

image

శ్రీరామనవమిని పురస్కరించుకొని ఈ నెల 17న హైదరాబాద్‌లో నిర్వహించే శ్రీరామ శోభాయాత్రకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నగర పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శనివారం శోభాయాత్ర నిర్వహించే వివిధ ప్రాంతాలను ఆయన ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నిర్వాహకులకు ఆయన పలు సూచనలు చేశారు. ఏటా ఈ శోభాయాత్రలో వేలాది మంది పాల్గొంటారు.

News April 13, 2024

HYDలో దారుణం.. కొడుకుని చంపిన తల్లి

image

హైదరాబాద్‌లో దారుణఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఉప్పల్‌ PS పరిధి రామంతాపూర్‌లో చిన్న కొడుకుతో కలిసి పెద్దకొడుకుని తల్లి హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామాక్షిపురానికి చెందిన మురళి మద్యానికి బానిసయ్యాడు. ఇంట్లో వారిని వేధిస్తున్నాడు. అతడి వేధింపులు తాళలేక తల్లి శోభ, తమ్ముడు మనోహర్ చీరతో గొంతు బిగించి చంపేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఉప్పల్ పోలీసులు వెల్లడించారు.

News April 13, 2024

ఏపీలో ఎన్నికలు.. HYDలో TDP ప్రచారం!

image

టీడీపీ LBనగర్ నియోజకవర్గ ఆత్మీయ సమావేశాన్ని BNరెడ్డినగర్ డివిజన్ ఇన్‌ఛార్జి గద్దె విజయ్ నేత ఆధ్వర్యంలో జరిపారు. ఉదయగిరి MLA అభ్యర్థి సురేశ్, TTDP అధికార ప్రతినిధి జోష్న హాజరయ్యారు. BNరెడ్డిలోని ఉదయగిరికి చెందిన TDP, NTR అభిమానులు సురేశ్‌కు ఓటు వేయాలని విజయ్ కోరారు. ఆయన గెలుపునకు కృషి చేయాలన్నారు. హర్షత్ నాయుడు, నాగేశ్వరరావు, డివిజన్ తెలుగు యువత అధ్యక్షుడు కార్పెంటర్ శీను పాల్గొన్నారు.

News April 13, 2024

HYD: వచ్చే నెలాఖరు కల్లా 5 ట్రీట్మెంట్ ప్లాంట్లు..!

image

HYD శివారు గండిపేట కండ్యూట్ లైనుపై మొదటగా 3 ప్లాంట్లను అందుబాటులోకి తేవాలని అనుకున్నప్పటికీ.. రోజురోజుకి నీటి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే నెలాఖరు నాటికల్లా 5 ట్రీట్మెంట్ ప్లాంట్లను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఇప్పటికే కోకాపేటలో వాటర్ బోర్డు 3 MLD ప్లాంట్ ప్రారంభించగా.. తర్వాత మణికొండ, ఉప్పలగూడలో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు.

News April 13, 2024

HYD: ప్రైవేట్ టీచర్ ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేట్ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన HYD పేట్ బషీరాబాద్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. భాగ్యలక్ష్మి కాలనీలో ఉంటున్న మహిపాల్(39) ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పని చేసేవాడు. వారం రోజుల క్రితం బైకుపై వెళ్తూ బాలుడిని ఢీకొనగా గాయాలయ్యాయి. వైద్య ఖర్చు చెల్లిస్తానని నిర్ణయానికి వచ్చాడు. కాగా ఆన్లైన్ బెట్టింగ్‌లకు అలవాటు ఉండటంతో అప్పుల్లో కూరుకుపోయి ఉరేసుకున్నాడు.

News April 13, 2024

హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయంగా ‘పైగా ప్యాలెస్‌’

image

చారిత్రాత్మక వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన బేగంపేట పైగా ప్యాలెస్‌ను హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయంగా మార్చే ప్రక్రియ మొదలైంది. హెచ్‌ఎండీఏ కార్యకలాపాలన్నీ ఒకే చోట నుంచి జరిగేలా చేయాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జీవోను జారీ చేసింది. ప్రస్తుతం హెచ్‌ఎండీఏకు సంబంధించిన కార్యకలాపాలు అమీర్‌పేట, నానక్‌రాంగూడ, హుస్సేన్‌సాగర్‌, లుంబినీ పార్కు ప్రాంతాల నుంచి జరుగుతున్నాయి.