India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ యువతులను ఆకర్షించి, విటుల వద్దకు పంపుతున్న నాగమణి అనే మహిళను హ్యూమన్ ట్రాఫికింగ్, సరూర్నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. డెకాయ్ ఆపరేషన్ ద్వారా ఆమెను దిల్సుఖ్నగర్లోని కమలానగర్ వద్ద రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. యువతుల ఫొటోలను వాట్సాప్ ద్వారా కస్టమర్లకు పంపి సినిమా పేరుతో వ్యభిచార రొంపిలోకి దింపుతున్నట్లు గుర్తించారు.
HYDలో Co-Living కల్చర్ పెరుగుతోంది. ఒకే హాస్టల్, ఒకే గదిలో అమ్మాయిలు, అబ్బాయిలు ఉండొచ్చు. IT కారిడార్, హైటెక్స్, మాదాపూర్, KPHB తదితర ప్రాంతాల్లో ఇటువంటి PG హాస్టల్స్ వెలిశాయి. పైగా సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ మరీ ఆకర్షిస్తున్నారు. వాస్తవానికి ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన యువత ఎక్కువగా హాస్టళ్లలోనే ఉంటారు. ఇందులో కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే హాస్టళ్లలో ఉండేందుకు మొగ్గుచూపడం విశేషం.
ప్రజావాణి ఆర్జీలను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ప్రజావాణిలో ఫిర్యాదుదారులు అందజేసిన ఆర్జీలను జిల్లా రెవెన్యూ అధికారి సంగీతతో కలసి స్వీకరించారు. అధికారులు తక్షణమే స్పందిస్తూ వెంటనే పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. రెవెన్యూ 40, ఇతర శాఖల్లో 32, మొత్తం 72 ఫిర్యాదులు స్వీకరించారు.
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ 1st ఇయర్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 185 సెంటర్లలో 87,313 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 84,599 మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. 2,714 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారన్నారు. జిల్లావ్యాప్తంగా ఒక్క మాల్ ప్రాక్టీస్ కేసు కూడా నమోదు కాలేదన్నారు.
అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా వాసులు చనిపోయారు. కొందుర్గు మండలంలోని టేకులపల్లికి చెందిన BRS నాయకుడు, మాజీ MPTC, మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు ప్రగతిరెడ్డి(35), మనవడు హార్వీన్ (6), సునీత (56) మృతి చెందారు. ప్రగతి అత్త సునీత సిద్దిపేట జిల్లా బక్రీ చప్రియాల్ గ్రామం. అయితే, అంత్యక్రియలు అక్కడే చేస్తున్నట్లు సమాచారం.
రాజేంద్రనగర్లోని NIRDPRలో కాంట్రాక్ట్ బేసిస్ కింద 33 పోస్టులను భర్తీ చేస్తున్నారు. బీటెక్, PG, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగాల్లో అనుభవం ఉన్నవారు మాత్రమే అర్హులు. వయస్సు 60 ఏళ్లకు మించకూడదు. జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్కు రూ. 1,00,000, ప్రాజెక్ట్ ఆఫీసర్కు రూ. 1,40,000, ప్రోగ్రాం ఆఫీసర్రు రూ. 1,90,000 జీతం చెల్లిస్తారు. అప్లై చేసేందుకు మార్చి 19 చివరి తేదీ.
SHARE IT
‘ఛావా’ చూసిన అందరికీ ఔరంగ జేబు క్రూరత్వం తెలిసే ఉంటుంది. 17వ శతాబ్దంలో ఆయన HYD వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. గోల్కొండ కోట ఆక్రమించుకుని హిందూ దేవాలయాలు ధ్వంసం చేయాలని HYD వచ్చాడు. ఇక్కడ ధ్యానాంజనేయ ఆలయంలో ఓ శబ్దం విన్నాడు. ‘హే రాజన్ మందిర్ తోడ్నా హైతో పెహ్లే తుమ్ కరో మన ఘట్’ అనే రామదూత స్వరం విని వెనక్కి తగ్గాడని, అప్పటినుంచి ఈ ప్రాంతాన్ని కర్మన్ఘాట్గా పిలుస్తున్నారని స్థల పురాణం చెబుతోంది.
ఓయూలో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలకు ఇక మీదట అనుమతి లేదని తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇది నియంతృత్వ పోకడ అంటూ ABVP మండిపడుతోంది. అధికారుల తీరుకు వ్యతిరేకంగా నేడు ఉస్మానియా యూనివర్సిటీ బంద్కు నాయకులు పిలుపునిచ్చారు. రిక్రూట్మెంట్, నిధుల కొరత, ఆహార నాణ్యత అంశాలపై విద్యార్థులు ప్రశ్నిస్తున్నారనే నెపంతో ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు శనివారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 315 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 233 ద్విచక్ర వాహనాలు, 5 త్రిచక్ర వాహనాలు, 71 నాలుగు చక్రాల వాహనాలు, 6 హెవీ వెహికిల్ వాహనాలు పట్టుబడ్డాయన్నారు. పట్టుబడ్డ వారందరినీ కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవన్నారు.
BRS నాయకులు దళిత ప్రజా ప్రతినిధుల పట్ల అవమానకరంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు DCC అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి తెలిపారు. RR జిల్లా వ్యాప్తంగా KTR, జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేసి, BRS దళిత వ్యతిరేక వైఖరికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నిరసనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Sorry, no posts matched your criteria.