RangaReddy

News July 28, 2024

కిషన్ రెడ్డి HYDకు ఎన్ని నిధులు తెచ్చారు: పొన్నం

image

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు తీసుకురాని కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు కేంద్ర మంత్రులుగా కొనసాగే అర్హత ఉందా? అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. వరుసగా రెండోసారి కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి HYD అభివృద్ధికి ఇప్పటి వరకు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలన్నారు. బండి సంజయ్ తన నియోజకర్గానికి నిధులు తీసుకురావడంతో విఫలమయ్యారని ఆరోపించారు. పొన్నం వ్యాఖ్యలపై మీ కామెంట్.

News July 28, 2024

HYD: బోనాలకు పటిష్ఠ ఏర్పాట్లు: ఆమ్రపాలి

image

HYD నగరంలో నేడు జరగబోయే బోనాల ఉత్సవాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు. జడ్సీలు, డీసీలకు టెలికాన్ఫరెన్స్‌ ద్వారా ఆమె ఆదేశాలు జారీ చేశారు. పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, విద్యుత్ దీపాలు, ఇతర ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆలయాల చుట్టూ పరిశుభ్రంగా ఉండాలన్నారు.

News July 28, 2024

HYD: బోనాల పండుగకు డాన్స్ చేసేవాణ్ని : హీరో

image

HYD పాతబస్తీలో చిన్నప్పటి నుంచి లాల్ దర్వాజా బోనాలు చూస్తూ పెరిగానని హీరో ప్రియదర్శి అన్నారు. పోతరాజు వేషంలో డాన్స్ చేసేవాళ్లని చూస్తుంటే సంతోషంగా ఉంటుందన్నారు. డ్రమ్స్, మ్యూజిక్, డాన్స్ చూస్తుంటే బాడీలో ఒక వైబ్రేషన్ వస్తుందన్నారు. తన బాల్యంలో బోనాల పండుగకు డాన్స్ చేసేవాణ్ని అని చెప్పారు. HYD బోనాల పండుగను తిలకిస్తుంటే చెప్పలేని సంతోషం కలుగుతుందన్నారు.

News July 28, 2024

HYD: ఆషాఢ బోనాలు.. సీపీ కీలక ఆదేశాలు

image

బోనాల పండుగ సందర్భంగా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను రాచకొండ CP సుధీర్ బాబు ఆదేశించారు. కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సున్నితమైన ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమర్థవంతమైన సిబ్బందిని బందోబస్తులో ఉంచాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, నేరాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News July 28, 2024

పార్కుల నిర్మాణానికి HMDA గ్రీన్‌సిగ్నల్!

image

HYD శివారు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో పార్కుల ఏర్పాటుకు HMDA అర్బన్ ఫారెస్టు విభాగం ప్రణాళికలు రూపొందించింది. ప్రభుత్వ భూములు, చెరువు శిఖం భూములను పార్కులుగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడుతోంది. తొలుత శంషాబాద్‌లో 30 ఎకరాల్లో పార్కును అభివృద్ధి చేయనున్నారు. తెల్లాపూర్-20, కోకాపేట-20, గాజులరామారం-30 ఎకరాల్లో ఇలా మొత్తం దాదాపు 20 ప్రాంతాల్లో పార్కుల కోసం రూ.45 కోట్లను ఖర్చు చేయనుంది.

News July 27, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓అశోక్‌నగర్‌లో నిరుద్యోగుల భిక్షాటన
✓BRSను అలాగే వదిలేస్తే హైటెక్ సిటీని అమ్మేవారు:భట్టి
✓KCR ఒక్కరితో తెలంగాణ రాలే: రామ్మోహన్ రెడ్డి
✓పటాన్‌చెరు:5 నెలల కింద లవ్ మ్యారేజ్.. యువతి ఆత్మహత్య
✓VKB: అనంతగిరికి పెరిగిన పర్యాటకుల తాకిడి.
✓OU: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలని ఓయూలో డిమాండ్

News July 27, 2024

HYD: హైటెక్‌సిటీని అమ్మేవారు: డిప్యూటీ సీఎం

image

కాంగ్రెస్ ముందుచూపుతోనే హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందని డిప్యూటీ CM మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ECIL, NFC వంటి కేంద్ర సంస్థలు, అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో‌ను తీసుకొచ్చామన్నారు. ఇప్పుడు కూడా రూ. 10 వేల కోట్ల నిధులు కేటాయించినట్లు ఆయన గుర్తుచేశారు. BRS చేసిందేమీ లేదన్నారు. చాలా వరకు అమ్ముకున్నారని.. వదిలేస్తే హైటెక్‌సిటీని అమ్మేవారని భట్టి మండిపడ్డారు.

News July 27, 2024

HYD: మెడికల్ కాలేజీకి తల్లి మృతదేహం దానం

image

ప్రగతినగర్ మాజీ సర్పంచ్ దుబ్బాక దయాకర్ రెడ్డి తల్లి వజ్రమ్మ మృతి చెందారు. శనివారం ఆమె భౌతికదేహాన్ని కుటుంబ సభ్యులందరూ కలిసి స్వచ్ఛందంగా మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు దానం చేశారు. మరణించిన తర్వాత దహనం చేయడం, సమాధి చేయడం కన్నా మెడికల్ కాలేజీలకు ఇవ్వడం మేలు అని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని మెడికల్ కళాశాల డీన్ హరికృష్ణ, వైస్ ప్రిన్సిపల్ నవీన్ వెల్లడించారు.

News July 27, 2024

HYD: KCR ఒక్కరి వల్ల తెలంగాణ రాలేదు: MLA

image

నాటి KCR పాలనలో బానిస సంకెళ్ల నుంచి విముక్తి కల్పించి, తెలంగాణ ప్రజల్లో ధైర్యం నూరిపోసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ VKB జిల్లా చీఫ్, పరిగి MLA రామ్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. తెలంగాణ బిల్లు పాసైన రోజు పార్లమెంట్‌లో KCR లేరని, విజయశాంతి ఆల్రెడీ కాంగ్రెస్‌లో చేరిపోయారని అన్నారు. KCR ఒక్కరి వల్ల తెలంగాణ రాలేదని, కాంగ్రెస్ మిత్ర కూటములంతా కలిసి సోనియాగాంధీని ఒప్పించడంతో వచ్చిందన్నారు.

News July 27, 2024

అందుకే HYD ప్రజలు BRSను గెలిపించారు: హరీశ్‌రావు

image

BRS పాలనలో HYDలో అభివృద్ధే జరగలేదని కాంగ్రెసోళ్లు అంటున్నారని, దాని గురించి మాట్లాడాలంటే 10 పేజీలు ఉన్నాయి చెప్పమంటారా అని MLA హరీశ్ రావు ప్రశ్నించారు. ఈరోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి చేశాం కాబట్టే హైదరాబాద్ ప్రజలు నిండు మనసుతో KCRను అశీర్వదించి దాదాపు అన్ని సీట్లలో BRSను గెలిపించారని అన్నారు. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా HYDఅభివృద్ధి విషయంలో KCRను కొనియాడారని గుర్తు చేశారు.