RangaReddy

News July 27, 2024

HYD: జీరో అవర్‌లో ఫిర్యాదు చేస్తే.. డబ్బు సేఫ్

image

సైబర్ నేరాన్ని గుర్తించి వెంటనే జీరో అవర్‌లో ఫిర్యాదు చేస్తే డబ్బులు సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని HYD సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ఇటీవల జీరో అవర్‌లో అందిన ఫిర్యాదుల్లో మొత్తం 5 కేసుల్లో రూ. 46 లక్షలకు పైగా వాపస్ చేశారు. 1930, సైబర్ క్రైమ్ పోర్టల్, సైబర్ PSకు ఫిర్యాదు చేస్తే వెంటనే బ్యాంకుల్లో డబ్బులు సీజ్ చేసి, తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు.

News July 27, 2024

గ్రేటర్ HYD పరిధిలో మ్యాన్ హోల్ లెక్కలు

image

గ్రేటర్ లోతైన మ్యాన్ హోల్స్ 63 వేలకు పైచిలుకు ఉన్నట్లు అధికారిక యంత్రాంగం వెల్లడించింది.HYD పరిధిలో మొత్తం సీవరేజ్ లైన్ వ్యవస్థ 5,767 కిలోమీటర్ల మేర ఉంది. నగర శివారు మున్సిపాలిటీల్లో సుమారుగా 4,200 కిలోమీటర్ల వ్యవస్థ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా మొత్తంగా 6,34,919 మాన్ హోల్స్ ఉన్నాయి.

News July 27, 2024

HYD: త్వరలో రెడ్ కేటగిరీ పరిశ్రమల PCB రిపోర్ట్!

image

రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(PCB) పరిశ్రమల్లో విడుదలయ్యే కాలుష్య ఉద్గారాలకు చెక్ పెట్టటం కోసం ప్రతినెలా రెడ్ కేటగిరీ పరిశ్రమల్లో తనిఖీలు చేస్తోంది. జులైకి సంబంధించి తనిఖీ చేయాల్సిన 26 పరిశ్రమలు రాజధాని పరిధిలోనే ఉండగా..వాటిల్లో ప్రభుత్వ పరిశ్రమలు కూడా ఉన్నాయి. మల్కాజ్గిరి-15, HYD-5, RR-6 పరిశ్రమల్లో తనిఖీ జరగనుంది. త్వరలోనే రిపోర్టు విడుదల చేయనున్నట్లుగా అధికారులు తెలిపారు.

News July 26, 2024

ఉప్పల్: రీసెర్చ్ అంశంపై నోటిఫికేషన్ జారీ..!

image

ఉప్పల్‌లోని రీసెర్చ్ అసోసియేట్ ఫెలోషిప్ సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ నోటిఫికేషన్ జారీ చేసింది. Ph.D పూర్తి చేసిన వారితో పాటు, థీసిస్ సమర్పించిన వారు వీటికి అర్హులు కాగా, ఆగస్టు 7లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మాలిక్యూలార్ మైక్రోబయాలజీ, సెల్ బయాలజీ, మాలిక్యూలార్ సిగ్నలింగ్, మమేలియన్ సెల్ సిగ్నలింగ్, జెనోమిక్ అనాలసిస్ రీసెర్చ్ అంశాలపై అవకాశం ఉందన్నారు.

News July 26, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓రాజేంద్రనగర్: MEIT కాలేజీలో ర్యాగింగ్..ఐదుగురు అరెస్ట్✓వట్టినాగులపల్లి: ఫైర్ మాన్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో సీఎం ✓మొగల్ పుర: యువతిని భయపెట్టి పరారైన యువకుడు పై కేసు ✓HYD: మహిళలకు రూ.2,500 ఇవ్వాలని బీజేపీ నిరసన✓లాల్ దర్వాజా సింహ వాహినికి దీపోత్సవం ✓కూకట్పల్లి కారులో చెలరేగిన మంటలు..తప్పిన ప్రమాదం✓HYD కోర్ సిటీ సౌత్ జోన్లో 28, 29న వైన్స్ బంద్

News July 26, 2024

RR: డిజిటల్ క్రాప్ సర్వే.. పంట వివరాలు ఆన్ లైన్లో..!

image

RR, MDCL,VKB జిల్లాల్లో డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా పంట వివరాలను ఖచ్చితంగా నమోదు చేసేందుకు కసరత్తు జరుగుతుంది. గతంలో రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు కింద 16 మండలాల్లో డిజిటల్ క్రాప్ సర్వే పూర్తి చేశారు. పంట ఫొటో, రైతు ఫొటో తీసి యాప్‌లో అప్లోడ్ చేయనున్నారు. తద్వారా ఎవరు ఏ పంట..? ఎంత విస్తీర్ణంలో..? పండించారనేది లెక్క తేలనుంది. కేంద్ర ఆదేశాలతో ఇప్పటికే రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అమలవుతోంది.

News July 26, 2024

HYD: మద్యం దుకాణాలు బంద్

image

HYD కమిషనరేట్ పరిధి సౌత్ ఈస్ట్ జోన్, సౌత్ వెస్ట్ జోన్‌లో పాతబస్తీ బోనాల సందర్భంగా ఈ నెల 28 ఉ.6 గంటల నుంచి 29 ఉ.6 గంటల వరకు వైన్స్, బార్లు, రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు మూసి ఉంటాయని HYD సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. HYD కోర్ సిటీ సౌత్ జోన్ ప్రాంతంలో మాత్రం ఈ నెల 28 ఉ.6 నుంచి 30 ఉ.6 వరకు బంద్ కొనసాగుతుందని చెప్పారు.

News July 26, 2024

HYD: ఓ వైపు కుక్కలు.. మరోవైపు కామాంధులు..!

image

గ్రేటర్ HYDలో చిన్నారుల ప్రాణాలకు భరోసా లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ వైపు కుక్కలు దాడి చేస్తుండగా మరోవైపు కామాంధులు అభంశుభం తెలియని చిన్నారులపై అత్యాచారం చేస్తున్నారు. ఇటీవల పిల్లలపై కుక్కల దాడులు, అత్యాచారాల ఘటనలు పెరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. తమ పిల్లలను బయటకు పంపాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News July 26, 2024

రంగారెడ్డి: రోడ్డు పక్కన చలించిపోయే దృశ్యం

image

వికారాబాద్ రైతుబజార్ దగ్గర ఓ రైతు పరిస్థితి కన్నీరు తెప్పిస్తోంది. కొత్తిమీర మూట తీసుకొని రోడ్డు మీద కూర్చొన్న ఆ పెద్దాయన‌.. నాలుగు రూపాయలు వస్తాయేమోనని ఆశతో వర్షంలోనే ఉండిపోయాడు. తాను పండించి, తెంపుకొచ్చిన ఆకు కూర వృథా అయితే నష్టపోతానని కష్టమైనా భరించాడు. ఓ వైపు తడుస్తూనే తన చిరు వ్యాపారం కొనసాగించాడు. సదరు రైతుకు కనీసం గొడుగు కూడా లేదు. అతడి కష్టం చూసిన స్థానికులు చలించిపోయారు.

News July 26, 2024

HYD: కుమారుడి ప్రాణం పోతుంటే తల్లడిల్లిన తల్లి!

image

HYD శంషాబాద్‌లో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. వెస్ట్ బెంగాల్‌కు చెందిన నారాయణ్, రిమి దంపతులకు 8 నెలల కుమారుడు ఉన్నాడు. అనారోగ్యంతో ఆ శిశువు బాధపడుతుండడంతో మెరుగైన వైద్యం కోసం పట్నా నుంచి బెంగళూరుకు విమానంలో వెళ్తున్నారు. శిశువు అస్వస్థతకు గురికాగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వైద్యులు పరీక్షించి, అప్పటికే చనిపోయాడని చెప్పడంతో తల్లి బోరున విలపించింది.