RangaReddy

News April 10, 2024

HYD: తాగునీటి సరఫరాకు ప్రత్యేక కార్యచరణ

image

రాజధానిలో అంతర్భాగమైన RR, మేడ్చల్ జిల్లాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం నియమించిన ప్రత్యేకాధికారి విజయేంద్రబోయి ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. ఏప్రిల్ తొలి వారం నుంచి జూన్ వరకు 2నెలల పాటు మున్సిపల్, కార్పొరేషన్ కమిషనర్లు, మండలాల ప్రత్యేకాధికారులు, మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా ఇంజినీర్లు అప్రమత్తంగా ఉండాలని, జలమండలి, మిషన్ భగీరథ అధికారులతో నిత్యం సంప్రదింపులు నిర్వహించాలన్నారు.

News April 10, 2024

HYD: అర్ధరాత్రి గుడి ముందు MURDER

image

ఫుట్‌పాత్‌పై పడుకునే విషయంలో తలెత్తిన ఘర్షణ చివరకు హత్యకు దారితీసిన ఘటన HYD పహాడీషరీఫ్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మహారాష్ట్ర వాసి కామ్ సింగ్(40), జల్‌పల్లి వాసి నవనాథ్ స్థానికంగా ఉంటూ పోచమ్మ గుడి ముందు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తుంటారు. ఈ క్రమంలో అర్ధరాత్రి వీరి మధ్య ఘర్షణ జరగగా నవనాథ్ కోపంలో రాయితో కామ్ సింగ్ తలపై మోది హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు. 

News April 10, 2024

HYD: రవీంద్ర భారతిలో ఘనంగా ఉగాది వేడుక‌లు

image

తెలుగు నూతన సంవత్సరాది శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మంత్రి జూల‌ప‌ల్లి కృష్ణారావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం HYD రవీంద్ర భారతిలో ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు మేలు కలగాలని, ప్ర‌జ‌లంద‌రి కొత్త ఆశయాలు నెర‌వేరాలన్నారు. సీఎస్ శాంతి కుమారి, షాద్‌నగర్ MLA వీర్లపల్లి శంకర్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

News April 10, 2024

HYD: నాకు టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ MIMకు మద్దతిచ్చినట్టే: ఫిరోజ్‌ఖాన్

image

HYDలో ఒవైసీని ఢీకొట్టే సత్తా తనకే ఉందని, కాంగ్రెస్ ఎంపీ టికెట్ తనకే ఇవ్వాలని కార్యకర్తలు అంటున్నారని ఆ పార్టీ రాష్ట్ర నేత ఫిరోజ్‌ఖాన్ అన్నారు. తనకు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే కార్యకర్తలు నిరుత్సాహపడతారని, కాంగ్రెస్ పరోక్షంగా MIMకు మద్దతిచ్చినట్టేనని పేర్కొన్నారు. బలహీనమైన అభ్యర్థిని నిలబెడితే జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ఏదేమైనా హైకమాండ్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. మీ కామెంట్?

News April 10, 2024

చార్మినార్‌ వద్ద ఇదీ పరిస్థితి!

image

రంజాన్ సమీపిస్తున్న వేళ ఓల్డ్ సిటీ కళకళలాడుతోంది. చార్మినార్, మదీనా, లాడ్‌బజార్‌‌కు సాయంత్రం నుంచే వేలాదిగా జనం తరలివస్తున్నారు. పండగకు మరో రెండ్రోజులే సమయం ఉండడంతో‌ పాషింగ్‌ కోసం క్యూ కట్టారు. అర్ధరాత్రి వరకు ఇక్కడ దుకాణాలు తెరిచి ఉండడంతో చార్మినార్‌ పరిసరాలు సందడిగా మారాయి. ఇందుకు సంబంధించిన ఫొటో‌లను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. PIC CRD: Anjum Alam

News April 9, 2024

UPDATE: అమెరికాలో హైదరాబాదీ మృతి.. పత్రాలు లభ్యం

image

అమెరికాలో కిడ్నాప్‌కు గురైన నాచారం వాసి మహమ్మద్ అబ్దుల్ మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. క్లేవ్ ల్యాండ్ పట్టణంలో ఒక సరస్సులో అబ్దుల్ మృతదేహం లభ్యమైందని, అతడి నడుముకి పాస్ పోర్ట్, ఫోన్, కొన్ని పత్రాలు కట్టి ఉన్నాయని తెలిపారు. పోలీసులు పరిశీలించి అబ్దుల్ మృతదేహంగా గుర్తించారని వెల్లడించారు. అబ్దుల్ మృతదేహాన్ని HYDకి తీసుకొస్తారా లేదా అక్కడే ఖననం చేసే విషయాన్ని త్వరలో తెలుపుతామన్నారు.

News April 9, 2024

హైదరాబాద్‌లో BRS లీడర్‌కు తప్పిన ప్రమాదం

image

HYDలో BRS లీడర్‌కు ప్రమాదం తప్పింది. మంగళవారం తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్‌ ఖైరతాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో తన మిత్రుడిని పరామర్శించి తిరిగి ఇంటికి వెళ్తున్నారు. మార్గమధ్యలో (కొత్తపేట క్రాస్ రోడ్డు సమీపంలో) టైరు పగిలిపోవడంతో కారు అదుపు తప్పి మెట్రో డివైడర్‌ను ఢీ కొట్టింది. ఎయిర్‌బెలూన్స్ ఓపెన్ కావడంతో పల్లె రవి, డ్రైవర్‌ ఖదీర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

News April 9, 2024

HYD: కాంగ్రెస్‌లోకి అంబర్‌పేట MLA.. క్లారిటీ

image

తాను కాంగ్రెస్ పార్టీలో చేరతానని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని అంబర్‌పేట MLA కాలేరు వెంకటేశ్ అన్నారు. ఇదంతా హస్తం పార్టీ మైండ్ గేమ్ అని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. 2 పర్యాయాలు తనను ఎమ్మెల్యేగా గెలిపించింది కారు గుర్తు అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ చలువతోనే తాను ఎమ్మెల్యే అయ్యాయని కాలేరు వెల్లడించారు.

News April 9, 2024

HYD నుంచి వరంగల్ వైపు వెళ్తున్నారా..? మీ కోసమే!

image

HYD నుంచి వరంగల్ NH-163పై వెళ్లే మార్గంలో భువనగిరి వద్ద.. పెంచిన టోల్‌గేట్ ఛార్జీల పట్టికను అధికారులు ఏర్పాటు చేశారు. కారు, జీపు, LMV వాహనాలకు ఒకవైపు ప్రయాణానికి రూ.115, 24 గంటల్లో టూ సైడ్ ట్రిప్ రూ.170 ఛార్జి వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాణిజ్య వాహనాలకు వన్ సైడ్ ట్రిప్ రూ.175.. 24 గంటల్లో టూ సైడ్ ట్రిప్ రూ.265గా ఉందని తెలిపారు.

News April 9, 2024

HYD: లీజుకు RTC బస్టాండ్లలోని దుకాణాలు..!

image

HYD నగరంలోని పలు ప్రయాణ ప్రాంగణాల్లో దుకాణాలు లీజుకు సిద్ధమంటూ ఆర్టీసీ ప్రకటించింది. ఈసీఐఎల్ బస్ స్టేషన్లో 5200 చ.అ.స్థలంలో వసతి, కోచింగ్ సెంటర్, డయాగ్నొస్టిక్ సెంటర్ పెట్టుకోవాలని సూచించింది. ఇలా.. సికింద్రాబాద్ రీజియన్లో మొత్తం 17 దుకాణాలకు, మరో 10 ప్రాంతాల్లో ఐస్క్రీమ్ పార్లర్ల నిర్వహణకు టెండర్లు పిలిచింది. HYD రీజియన్లో 35 దుకాణాల కోసం టెండర్లు పిలిచారు. దరఖాస్తుల స్వీకరణ సైతం పూర్తయింది.