RangaReddy

News April 7, 2024

BREAKING: నివేదితకు BRS కంటోన్మెంట్ టికెట్

image

BRS సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజవర్గ అభ్యర్థిగా లాస్య నందిత సోదరి నివేదితను KCR ప్రకటించారని ఆ పార్టీ నాయకులు ఈరోజు తెలిపారు. ఎర్రవెల్లిలో జరిగిన సమావేశంలో దివంగత నేత సాయన్న రెండో కుమార్తె నివేదితకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. ఉగాది రోజు అధికారికంగా నివేదిత పేరును KCR ప్రకటిస్తారని నాయకులు మీడియాకు తెలిపారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ MLA లాస్య మరణించిన విషయం తెలిసిందే.

News April 7, 2024

HYD: రూ.13,13,950 నగదు సీజ్: రోనాల్డ్ రాస్

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.13,13,950 నగదు, రూ.2,34,159 విలువైన వస్తువులను పట్టుకుని సీజ్ చేసినట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. ఆబ్కారీ శాఖ ద్వారా 22.44 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకుని, ఇద్దరిపై కేసులు నమోదు చేశామన్నారు. నగదు ఇతర వస్తువులపై 11 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కరించామని తెలిపారు.

News April 7, 2024

HYD: అనుమానంతో భార్యను చంపిన భర్త..!

image

భార్యను భర్త హతమార్చిన ఘటన HYD ఉప్పల్ PS పరిధి రామంతాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. రామంతాపూర్‌‌లో శివలక్ష్మి, శివమోహన్ శర్మ దంపతులు నివాసం ఉంటున్నారు. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెపై దాడి చేసి చంపేశాడు. ఈ విషయాన్ని కొడుకు సాయి గణేశ్‌కు తెలిపిన శివమోహన్ అనంతరం పరారయ్యాడు. విగత జీవిగా ఉన్న తల్లిని చూసి కుమారుడు విలపించాడు. ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 7, 2024

HYD: జేబు దొంగల్లా కాంగ్రెస్‌ దుర్మార్గపు పాలన: MLA

image

ఆరు గ్యారంటీల పేరిట కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి విమర్శించారు. HYD తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వేదికగా కాంగ్రెస్‌ నేతలు మరో మోసానికి తెరలేపారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నీటి మూటలని తేలిపోయిందన్నారు. మంత్రులకు ఐపీఎల్‌ చూడటానికి ఉన్న ప్రాధాన్యం.. రైతులపై లేదని అన్నారు. జేబు దొంగల్లా కాంగ్రెస్‌ దుర్మార్గపు పాలన ఉందన్నారు.

News April 7, 2024

HYD: కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌ను గెలిపించుకుంటాం: MLA

image

బీఆర్ఎస్ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని HYD శేరిలింగంపల్లి MLA ఆరికపూడి గాంధీ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం వివేకానంద నగర్, కూకట్‌పల్లి డివిజన్లకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు, ముఖ్య నాయకులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు కాసాని పాల్గొని మాట్లాడారు. జనం KCR వెంటే ఉన్నారన్నారు. BRS హయాంలో HYD ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.

News April 7, 2024

HYD: సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ MEETING

image

సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. HYDజూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్‌తో కలిసి మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు, నాయకులంతా కలిసి కష్టపడి భారీ మెజారిటీతో కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. పలు సూచనలు చేశారు.మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, అజహరుద్దీన్, ఫిరోజ్ ఖాన్, విజయారెడ్డి తదితరులున్నారు.

News April 7, 2024

HYD: కాంగ్రెస్ సభకు వెళ్లొస్తూ యాక్సిడెంట్

image

కాంగ్రెస్ సభకు వెళ్లొస్తూ ఓ వ్యక్తికి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. చేవెళ్ల మండలం గొల్లగూడ వాసి మహిపాల్ తుక్కుగూడలో గత రాత్రి నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభకు హాజరై తిరిగి వెళుతున్నాడు. ఈ క్రమంలో చేవెళ్ల ధర్మసాగర్ గేటు వద్ద అతడి బైక్‌ను మరో వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన అతడిని గచ్చిబౌలి కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. ఈరోజు ఎంపీ రంజిత్ రెడ్డి అతడిని పరామర్శించారు.

News April 7, 2024

HYD: ప్రజల కష్టసుఖాలు తెలిసిన ఏకైక పార్టీ కాంగ్రెస్: సునీతారెడ్డి

image

ప్రజల కష్టసుఖాలు తెలిసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఆ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీతామహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం మల్కాజిగిరి పార్లమెంట్ పరిధి నిజాంపేట్‌కు చెందిన వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి సాదరంగా ఆమె ఆహ్వానించి మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పట్టుదలతో పని చేయాలని సూచించారు.

News April 7, 2024

HYD: మాధవీలతపై ప్రధాని మోదీ ప్రశంసలు

image

బీజేపీ HYD పార్లమెంట్ అభ్యర్థి మాధవీలతపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఆమె ఇటీవల ఓ జాతీయ మీడియా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొని తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై మోదీ స్పందించారు. ”మాధవీలతా జీ.. మీ ఆప్‌ కీ అదాలత్‌ ఎపిసోడ్‌ అద్భుతంగా ఉంది. చాలా కీలక అంశాలను మీరు ఇందులో లేవనెత్తారు. అవి ఎంతో తార్కికంగా ఉన్నాయి. మీకు నా శుభాకాంక్షలు” అంటూ మోదీ ట్వీట్ చేశారు.

News April 7, 2024

HYD: పేలిన గ్యాస్ సిలిండర్.. బాలుడి మృతి

image

HYD కాప్రా మండలం జవహర్‌నగర్ PS పరిధిలో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక బీజేఆర్ నగర్ పరిధి జ్యోతిరావు కాలనీలో 4 రోజుల క్రితం ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో బాలుడు బన్సీ(7)కి తీవ్ర గాయాలు కావడంతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న బాలుడు ఈరోజు మృతిచెందాడు. కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కేసు నమోదైంది.