RangaReddy

News July 21, 2024

HYD: నిండుకుండలా హుస్సేన్ సాగర్

image

నగరంలో కురుస్తోన్న ఎడతెరిపిలేని వానతో హుస్సేన్ సాగర్‌కు అన్ని వైపుల నుంచి శనివారం వరద పెరిగింది. 1,517 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవగా, మత్తడి నుంచి 998 క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తున్నట్లు GHMC తెలిపింది. భారీగా దిగువకు దూకుతున్న నీటిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 514.75 మీ కాగా, సాయంత్రం 6 గంటల సమయానికి 513.23 మీ నీటిమట్టం నమోదైందని అధికారులు తెలిపారు.

News July 21, 2024

HYD: భార్య, కుమార్తెను చంపి సూసైడ్

image

సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో దారుణం వెలుగు చూసింది. భార్య స్వప్నతో పాటు 10 నెలల కుమార్తెను గణేశ్ అనే వ్యక్తి హతమార్చాడు. అనంతరం అల్వాల్‌లోని రైల్వే ట్రాక్ వద్ద పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి చెప్పి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాలను గాంధీ మార్చురికీ పోలీసులు తరలించారు. మృతులు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. కాగా భార్యపై అనుమానంతోనే గణేశ్ ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.

News July 21, 2024

HYD: ఉజ్జయిని మహంకాళి అరుదైన ఫొటో

image

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి‌ అమ్మవారి ఆషాఢమాస బోనాలు‌ అంగరంగ వైభవంగా‌ జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము‌ నుంచే మహిళలు‌ బోనాలతో‌ ఆలయానికి చేరుకుంటున్నారు. తల్లి దర్శనం కోసం సాధారణ భక్తులు క్యూ కట్టారు. మోండా మార్కెట్‌ నుంచి‌ మహంకాళి‌ టెంపుల్‌ వరకు అంతా సందడి‌గా మారింది. ఇటువంటి పర్వదినం రోజున 1850 నాటి అమ్మవారి అరుదైన ఫొటో‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు.

News July 20, 2024

HYD: అర్ధాంగి లేదనే బాధతో మృతిచెందిన భర్త

image

ఆలు మగలవి ఒక జీవితానికి చాలని ప్రేమలని ఓ కవి అన్నారు. అర్ధాంగిని కోల్పోయిన బాధను జీర్ణించుకోలేని ఓ భర్త మనోవేదనతో తనువు చాలించిన విషాద ఘటన ఇది. సికింద్రాబాద్‌లోని పద్మారావు‌నగర్, స్కందగిరి‌లో కొంతకాలంగా జిల్లా లక్ష్మణ్(80) నీలవేణి (70) కుటుంబ సభ్యులతో కలసి ఉంటున్నారు. గత నెల 22న అనారోగ్యంతో నీలవేణి చనిపోయారు. దీంతో మనోవేదనకు గురైన భర్త శనివారం తనువు చాలించారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

News July 20, 2024

RR:ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓హైటెక్ సిటీ: రూ.7కోట్ల డ్రగ్స్ సీజ్
✓జూలై 21,22న ఉజ్జయిని మహంకాళి బోనాలు
✓పటాన్ చెరు: బుల్లెట్ తలలోకి దూసుకెళ్లి CISF కానిస్టేబుల్ మృతి
✓శేరిలింగంపల్లి: గోపన్ పల్లి వంతెన ప్రారంభించిన సీఎం
✓హుస్సేన్ సాగర్ ఫుల్..2 గేట్లు ఎత్తివేత
✓మణికొండలో కారు పై కూలిన చెట్టు
✓త్వరలో అందుబాటులోకి రానున్న చర్లపల్లి రైల్వే స్టేషన్

News July 20, 2024

సికింద్రాబాద్‌లో ఆమ్రపాలి కాట ఇన్‌స్పెక్షన్

image

రేపు జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా శనివారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట ఏర్పాట్లను పరిశీలించారు. ఉజ్జయిని మహంకాళి ఆలయంతో పాటు పలు దేవాలయాలకు సంబంధించిన రూట్‌లపై ఆరా తీశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. శానిటేషన్, మొబైల్ టాయిలెట్స్, తదితర అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఎప్పటికప్పుడు ఫీల్డ్‌లో అందుబాటులో ఉండాలన్నారు.

News July 20, 2024

HYD: అర్ధాంగి లేదనే బాధతో మృతిచెందిన భర్త

image

ఆలు మగలవి ఒక జీవితానికి చాలని ప్రేమలని ఓ కవి అన్నారు. అర్ధాంగిని కోల్పోయిన బాధను జీర్ణించుకోలేని ఓ భర్త మనోవేదనతో తనువు చాలించిన విషాద ఘటన ఇది. సికింద్రాబాద్‌లోని పద్మారావు‌నగర్, స్కందగిరి‌లో కొంతకాలంగా జిల్లా లక్ష్మణ్(80) నీలవేణి (70) కుటుంబ సభ్యులతో కలసి ఉంటున్నారు. గత నెల 22న అనారోగ్యంతో నీలవేణి చనిపోయారు. దీంతో మనోవేదనకు గురైన భర్త శనివారం తనువు చాలించారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

News July 20, 2024

HYD: త్వరలో చర్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి

image

సికింద్రాబాద్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సీఎస్ శాంతి కుమారితో జరిగిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రైల్వే డెవలప్మెంట్ సంబంధించి చర్చ జరిగిందని, రాబోయే కొద్ది నెలల్లోనే పలు అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ సైతం త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు.

News July 20, 2024

తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో నూతన వసతులు ప్రారంభించిన మంత్రి

image

తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఆధునిక వైద్య పరీక్షా కేంద్రాలతో పాటు ఫిజియోథెరఫీ యూనిట్, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, ఫార్మసీని శనివారం నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన ఆర్టీసీ ఆస్పత్రిని సందర్శించి చికిత్స కోసం వచ్చిన ఆర్టీసీ సిబ్బందితో ఆయన మాట్లాడారు.

News July 20, 2024

సికింద్రాబాద్ మహంకాళికి బోనం సమర్పించిన దీపాదాస్ మున్షీ

image

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, యూఎస్ కన్సులేట్ జనరల్ జెన్నిఫర్ ఎ.లార్సన్, మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు. పార్టీ సనత్‌నగర్ ఇన్‌ఛార్జ్ కోట నీలిమ, నాయకులు పాల్గొన్నారు.