India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన 18 ఏళ్లు నిండిన యువతీయువకులకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధికారులు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఓటు ప్రాధాన్యతను తెలియజేసేలా అవగాహన నిర్వహించి చైతన్యం తేవాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేపట్టామన్నారు. పోలింగ్ శాతం పెంచడానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు స్వీప్ నోడల్ అధికారి తెలిపారు.
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో పోస్టర్లు ప్రత్యక్షమై కలకలం రేపుతున్నాయి. పోస్టర్లలో నాన్ లోకల్ వర్సెస్ లోకల్ అంటూ ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి ఈటలను కలవాలంటే 166 కిలోమీటర్లు ప్రయాణం చేసి హుజూరాబాద్ వెళ్లాలని.. కాంగ్రెస్ అభ్యర్థి సునీతామహేందర్ రెడ్డిని కలవాలంటే 59 కిలోమీటర్లు ప్రయాణం చేసి చేవెళ్ల వెళ్లాలని.. కానీ BRS అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి లోకల్ అని ఇక్కడే మనతోనే ఉంటారని పోస్టర్లలో రాశారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికారులు కీలక ప్రకటన చేశారు. పోస్టల్ బ్యాలెట్ కోసం ఏప్రిల్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఉద్యోగులకు సూచించారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు ఫారం-12డీ నింపి సంబంధిత నోడల్ అధికారుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ ద్వారా చాలా మంది వ్యక్తుల ప్రైవేటు సంభాషణ విన్న నీచ చరిత్ర కల్వకుంట్ల కుటుంబానికి దక్కుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యవహారంలో కేటీఆర్ పాత్ర కీలకంగా ఉందని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం తప్పు చేయకుంటే గుమ్మడికాయ దొంగల్లా ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. ఎవరు తప్పు చేసినా తమ ప్రభుత్వం వదలిపెట్టదని హెచ్చరించారు.
దేశ ముఖచిత్రాన్ని మార్చేసే కీలకమైన లోక్సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డ మీద నుంచి 10 లక్షల మందితో జంగ్ సైరన్ ఇవ్వనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. తుక్కుగూడలో ‘జన జాతర’ పేరిట రేపు నిర్వహించే భారీ బహిరంగ సభలో మేనిఫెస్టోతో పాటు తాము అధికారంలోకి వస్తే అమలు చేయనున్న 5 గ్యారంటీలను కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ప్రకటించనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి ఈరోజు పరిశీలించారు.
సన్రైజర్స్ హైదరాబాద్ VS చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ దృష్ట్యా ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11:30 వరకు ఉప్పల్ పరిధి ట్రాఫిక్ మళ్లించనున్నామని పోలీసులు తెలిపారు. మ్యాచ్ జరిగే సమయంలో వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు కోరారు. లారీ, డంపర్, ఎర్త్ మూవర్స్, వాటర్ ట్యాంకర్లు, RMC ట్రక్, అన్ని ఇతర రకాల ట్రక్కులు, భారీ వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈరోజు HYD కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, గుజ్జ కృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జూన్లో పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టే పార్టీకే మద్దతు ఉంటుందన్నారు.
✓రోజుకి కనీసం 4 లీటర్ల నీళ్లు తాగండి.
✓ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలో తిరగవద్దు.
✓వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించండి.
✓షుగర్,బీపీ పేషెంట్లు మరింత జాగ్రత్తగా ఉండాలి.
✓వాంతులు, విరోచనాలు జరిగితే వెంటనే డాక్టరును సంప్రదించాలి.
✓సొంత వైద్యం ఏ మాత్రం మంచిది కాదు.
✓వేసవిలో మద్యం శరీరానికి మరింత ముప్పు చేస్తుంది.
•HYD గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు.
ఎన్నికల నియమావళి అమల్లో భాగంగా గ్రేటర్ వ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్ విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.5.31 కోట్ల నగదు సీజ్ చేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. గడిచిన 24 గంటల్లో రూ.27.12 లక్షల నగదు, రూ.8.23 లక్షల విలువజేసే ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అటు నగదు, ఇతర వస్తువులపై 12 ఫిర్యాదులు రాగా.. వాటిని పరిశీలించామన్నారు.
బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్లో వెలుగుచూసింది. హబీబ్నగర్ పోలీసుల వివరాల ప్రకారం.. మీర్చౌక్ హెడ్ క్వార్టర్స్లో గోపి కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. సీతారాంబాగ్లో నివాసం ఉండే ఇతడు మార్చి 30న తమ కూతురిపై అత్యాచారం చేసినట్లు బాలిక తల్లిదండ్రులు హబీబ్నగర్ PSలో ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు గోపిని రిమాండ్కు తరలించారు.
Sorry, no posts matched your criteria.