RangaReddy

News April 5, 2024

ఉప్పల్లో నేడు IPL మ్యాచ్.. స్పెషల్ బస్సులు

image

HYD ఉప్పల్లో నేడు SRH VS CSK మధ్య IPL మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు ఆర్టీసీ సా.6 గంటల నుంచి రా.11:30 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపింది. మేడ్చల్, మియాపూర్, జేబీఎస్, ఘట్‌కేసర్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, కొండాపూర్, ఎల్బీనగర్, చంద్రాయణగుట్ట, జీడిమెట్ల, KPHB తదితర ప్రాంతాల నుంచి బస్ సర్వీసులుంటాయని, ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేడు మెట్రో‌ టైమింగ్స్‌ కూడా పొడిగిస్తారు. SHARE IT

News April 5, 2024

HYD: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల పునః ప్రారంభం?

image

HYD నగరంలో వాటర్‌కు డిమాండ్ పెరగడంతో ఉస్మాన్‌సాగర్ లైన్ నుంచి వచ్చే నీటిని శుద్ధి చేయడం కోసం 2 మాడ్యులర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను పునః ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 2 MLD, 3 MLD సామర్థ్యంతో ఈ ట్రీట్మెంట్ ప్లాంట్లను రూపొందించారు. వీటిని పునః ప్రారంభించడం ద్వారా డిమాండ్‌కు తగ్గట్లుగా నీటిని అందించే అవకాశం అందని అధికారుల అంచనా.

News April 5, 2024

RR: వరి ధాన్యం కొనుగోలు కై కసరత్తు..!

image

RR, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లకై అధికారులు కసరత్తు ప్రారంభించారు. రంగారెడ్డిలో 41,660, మేడ్చల్ జిల్లాలో 26,037, వికారాబాద్ జిల్లాలో 1,24,303 టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌరసరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. వరి ధాన్యాన్ని ఎప్పటిలాగే ఏ గ్రేడ్ రకానికి రూ.2,203 పెట్టి ప్రభుత్వం కొనుగోలు చేయనుంది.

News April 5, 2024

HYD: గ్రేటర్‌లో RTA ఆదాయం ఫుల్!

image

2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా RTAకు రూ.6,999 కోట్ల ఆదాయం రాగా.. ఇందులో గ్రేటర్ HYD పరిధి HYD, RR, మేడ్చల్ జిల్లాల ఆర్టీఏ ద్వారా రూ.4,449 కోట్ల సమకూరినట్లు అధికారులు తెలిపారు. రంగారెడ్డిలో రూ.1688 కోట్లు, మేడ్చల్ జిల్లాలో రూ.1298 కోట్లు, HYD జిల్లాలో రూ.1462 కోట్లు వచ్చినట్లుగా పేర్కొన్నారు. గతంతో పోలిస్తే రాజధానిలో దాదాపుగా రూ.500 కోట్ల ఆదాయం అధికంగా వచ్చింది.

News April 4, 2024

HYD: అంబులెన్స్ వాహనాల సంఖ్య పెంచాలని డిమాండ్

image

HYD జిల్లాలో 36, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 29 అంబులెన్స్‌లు ఉన్నాయి. 108కి కాల్ చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ చెబితే గాని ఒక్కోసారి రావడం లేదని, HYD నగర శివారు మారుమూల ప్రాంతాలకు ఆలస్యమవుతుందని పలువురు ఆరోపించారు. మరోవైపు కొందరి నుంచి రాంగ్ కాల్స్ వస్తున్నట్లుగా 108 సిబ్బంది తెలియజేశారు. అత్యవసర సేవలను మరింత మెరుగుపరిచేందుకు అంబులెన్స్ వాహనాల సంఖ్య పెంచాలని పలువురు కోరారు.

News April 4, 2024

HYD: తండ్రిని హత్య చేసిన కొడుకు

image

డ్రగ్స్‌కు బానిసగా మారిన కొడుకు.. తనను మందలించినందుకు కన్న తండ్రినే హత్య చేశాడు. ఈ ఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధి తుర్కయంజాల్‌లో జరిగింది. ఆరెంజ్ అవెన్యూలో ఓ ఇంట్లో ఉంటున్న తిరుపతి రవీందర్(65)ను పెట్రోల్ పోసి అతడి కుమారుడు నిప్పంటించాడు. మంటలను తట్టుకోలేక అక్కడికక్కడే రవీందర్ మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కొడుకు కోసం గాలిస్తున్నారు.

News April 4, 2024

HYD: IICT లో ఉద్యోగాలు.. రేపే ఇంటర్వ్యూ..!

image

HYD నగరం తార్నాకలోని IICT లో వివిధ ప్రాజెక్టులకు రీసర్చ్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్-1, ప్రొజెక్టర్ అసోసియేట్-2 పోస్టుల భర్తీకి ఏప్రిల్ 5, 8వ తేదీలలో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పీహెచ్డీ సైన్సెస్, ఎమ్మెస్సీ సైన్స్, బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసినవారు అర్హులని,ఈ లింక్ https://iict.res.in/CAREERS అన్ని మిగతా వివరాలు పొందండి.

News April 4, 2024

HYD: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష!

image

HYD నగరానికి చెందిన అఖిలేశ్వర్ 2018 సంవత్సరంలో కాచిగూడలో ఓ బాలికను అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ పోక్సో కోర్టు తీర్పును వెలువరించింది. తీర్పు వెంటనే అమలులోకి వస్తుందని తెలియజేసింది. ఈ కేసులో HYD పోలీసులు సమగ్రంగా విచారణ జరిపి, పూర్తి సమాచారంతో కోర్టులో ప్రవేశపెట్టడంతో ఈ తీర్పును వెలువరించింది.

News April 4, 2024

HYD: లక్క గాజులకు GI ట్యాగ్.. సర్టిఫికెట్ అందజేత

image

HYD నగరంలో తయారు చేసే లక్క గాజులకు GI ట్యాగ్ లభించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గురువారం రాష్ట్ర ఐటీ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ చేతుల మీదుగా క్రీసెంట్ హ్యాండీక్రాఫ్ట్స్ ఆర్టీషియన్ అసోసియేషన్ సభ్యులకు సర్టిఫికెట్ అందజేశారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు లక్క గాజులను అధికారికి బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా జయేష్ రంజన్ సంతోషం వ్యక్తం చేశారు.

News April 4, 2024

ఎవిస్ హాస్పిట‌ల్స్ కొత్త శాఖ‌ల‌తో సేవ‌ల విస్త‌ర‌ణ

image

వాస్క్యుల‌ర్ రంగంలో దేశంలో నం.1 ఎవిస్ హాస్పిట‌ల్స్ త‌మ సేవ‌ల‌ను మ‌రింత విస్త‌రిస్తోంది. గురువారం కూక‌ట్‌ప‌ల్లిలో ఎవిస్ హాస్పిట‌ల్స్ నూత‌న శాఖ ప్రారంభించారు. MD, ప్ర‌ముఖ ఇంట‌ర్వెన్ష‌న‌ల్ రేడియోల‌జిస్ట్ డా.రాజా వి కొప్పాల పూజాదికాల‌తో కొత్త ఆసుప‌త్రికి అంకురార్ప‌ణ చేశారు. కార్యక్రమంలో డైరెక్ట‌ర్లు శ్రీ‌నివాస్, భ‌ర‌త్‌, వైభ‌వ్, డాక్ట‌ర్లు సంప‌త్, మ‌ల్లీశ్వ‌రి, బిందు, అధికారులు పాల్గొన్నారు.