RangaReddy

News April 3, 2024

HYD మెట్రో ప్రయాణికులకు BIG షాక్ 

image

HYD మెట్రో సూపర్ సేవర్ హాలిడే కార్డును తీసుకొచ్చి సెలవు దినాల్లో కేవలం రూ.59 రీఛార్జ్ ద్వారా అన్ లిమిటెడ్ ప్రయాణం చేయవచ్చని తెలిపింది. అయితే ఇటీవల కొందరు కార్డు కోసం వెళ్లగా ప్రయాణికులకు మెట్రో BIG షాక్ ఇచ్చింది. మెట్రో ప్రవేశపెట్టిన సూపర్ సేవర్ హాలిడే కార్డు, సూపర్ ఆఫ్ పీక్ హవర్ కార్డు సేవలు 2024 మార్చి 31 నాటికి ముగిశాయని తెలిపింది. ఆఫర్లు వర్తించవని తేల్చి చెప్పింది.

News April 3, 2024

HYD: అద్దె కార్లు అమ్ముతున్న ముఠా అరెస్ట్

image

లాంగ్ డ్రైవ్‌లో అద్దెకు కార్లు తీసుకొని వాటిని అమ్ముతున్న ముఠాను HYD మాదాపూర్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. మాదాపూర్ ఏసీపీ మాట్లాడుతూ.. ఆదిలాబాద్‌లో ఉంటున్న హరీశ్ కుందారపు అనే వ్యక్తికి, సదరు వ్యక్తులు కార్లు ఇవ్వడంతో వీరికి కొంత కమిషన్ రూపంలో హరీశ్ అనే వ్యక్తి ఇస్తున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.కోటి విలువ చేసే 6 కార్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

News April 3, 2024

HYD: బంపర్ OFFER మీ కోసమే.. త్వరపడండి!

image

HYDతో పాటు RR, MDCL,VKB జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ప్రజలకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్నును ఏప్రిల్ 30వ తేదీలోపు చెల్లిస్తే 5 శాతం రాయితీ పొందవచ్చని తెలియజేసింది. కావున ఆయా ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలు ఈ ఆఫర్ సద్వినియోగం చేసుకోవాలని, ఈ లింక్ https://cdma.cgg.gov.in/cdma_arbs/CDMA_PG/PTMenu ద్వారా చెల్లించవచ్చని తెలిపింది. SHARE IT

News April 3, 2024

HYD: 132 కిలోల బంగారం సీజ్.. 31 మంది అరెస్ట్!

image

HYD కస్టమ్స్ అధికారులు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిపోర్టు విడుదల చేశారు. ఆర్థిక సంవత్సరంలో 132 కిలోల బంగారాన్ని సీజ్ చేసినట్లుగా పేర్కొన్నారు. చెప్పుల లోపల, శరీర భాగాలలో, లో దుస్తులలో, డబ్బాలు, ప్యాకెట్లలో వివిధ రూపాల్లో బంగారాన్ని అక్రమంగా తరలించడానికి ప్రయత్నించినట్లు గుర్తించారు. 247 కేసులు బుక్ చేయగా.. 31 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

News April 3, 2024

HYD: భారీగా నోట్ల కట్టలు పట్టివేత

image

HYDలో వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉ.6 గంటల వరకు రూ.1,72,21,300 నగదు, రూ.49,90,477 విలువ గల వస్తువులు, 91.17 లీటర్ల లిక్కర్‌ను సీజ్ చేసినట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. నగదు, ఇతర వస్తువులపై 20 ఫిర్యాదులు రాగా వాటిని పరిశీలించి పరిష్కరించినట్లు చెప్పారు. 4 కేసులు నమోదు కాగా ముగ్గురిపై ఎఫ్ఐఆర్‌ నమోదు చేసినట్లు వివరించారు.

News April 3, 2024

HYD: పార్లమెంట్‌లో తెలంగాణ గొంతును వినిపిస్తాం: MLA

image

పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతును BRS పార్టీ నేతలు వినిపిస్తారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. HYD చింతల్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల సమావేశంలో భాగంగా రంగారెడ్డి నగర్ డివిజన్ నాయకులు, కార్యకర్తలతో సమావేశం జరిగింది. కార్యకర్తలు, ప్రజలందరూ తోడుగా ఉంటే న్యాయం కోసం ఎంతవరకైనా పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు.

News April 3, 2024

‘బేగంపేట్ ఊర్వశి బార్‌లో అమ్మాయిల అశ్లీల నృత్యాలు’

image

HYD బేగంపేట్ భగవంతపూర్‌లోని ఊర్వశి బార్ & రెస్టారెంట్‌పై టాస్క్‌ఫోర్స్ అధికారులు, పోలీసులు కలిసి దాడులు నిర్వహించారు. బేగంపేట్ పోలీసులు తెలిపిన వివరాలు.. ఊర్వశి బార్‌లో అశ్లీల నృత్యాలు చేస్తున్న 33మంది అమ్మాయిలు, 75 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. బార్ మేనేజర్ శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. 297 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతులను బేగంపేట్ మహిళా పీఎస్‌కు తరలించారు.

News April 3, 2024

HYD: మంత్రి కొండా సురేఖను కలిసిన మొగులయ్య

image

పద్మశ్రీ పురస్కార గ్రహీత, కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్య బుధవారం HYDలో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిశారు. తాను ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులను మంత్రికి వివరించి చేయూతనివ్వాలని విన్నవించారు. ఆరోగ్యం సహకరించక, ఆర్థికంగా ఆదుకునేవారు లేక తాను అనుభవిస్తున్న కష్టాలను మొగులయ్య మంత్రికి వివరించారు. మొగులయ్య దుస్థితిని విన్న మంత్రి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

News April 3, 2024

HYD: మూసీపై కబ్జాకోరుల కన్ను.. అధికారుల నిఘా..!

image

HYD, RR, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలో మూసీ నది గర్భంలో 1,585, బఫర్‌ జోన్‌లో 6,890 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లుగా రెండేళ్ల కిందట అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ప్రత్యేక మాస్టర్ ప్లాన్ ద్వారా మూసీ అభివృద్ధికి ప్రభుత్వం స్వీకారం చుడతోంది. సుందరీకరణ జరగక ముందే.. కబ్జా కోరులు మూసీ పరివాహక ప్రాంతంలో అక్రమాలకు తేరలేపుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు డేగ కన్నుతో నిఘా పెట్టారు.

News April 3, 2024

హైదరాబాద్‌లో మరో మర్డర్

image

HYDలో మరో దారుణ ఘటన జరిగింది. బహదూర్‌పుర PS పరిధి నందిముస్లాయిగూడలో మహమ్మద్​ రషీద్​ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షకీల్​ అహ్మద్​ సోదరిని రషీద్ వివాహం చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. బుధవారం మరోసారి వివాదం తలెత్తింది. ఈ విషయం తెలుసుకొన్న షకీల్ హుటాహుటిన సోదరి ఇంటికి వచ్చాడు. మాటామాటాపెరగడంతో రషీద్‌‌‌ను కత్తితో పొడిచి చంపేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.