India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD నగరంలోని అశోక్ నగర్ ప్రాంతంలో నిరుద్యోగులు రోడ్ల పై నిరసన ధర్నాలు చేపట్టడం పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అందించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నిరుద్యోగ మోసగాళ్లు, మోసపు వాగ్దానాలు చేసి KCR ప్రభుత్వంపై రెచ్చగొట్టారన్నారు. ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా ఒక్క నోటిఫికేషన్, ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదన్నారు. మీరు ఇస్తానన్న రెండు లక్షల ఉద్యోగులు ఎక్కడ..? అని X వేదికగా ప్రశ్నించారు.
నిజాం రాష్ట్ర ప్రజల కోసం 1932లో HYD నిజాం నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ NSR-RTD పేరిట మొదటిసారిగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ప్రారంభించినట్లు TSIC తెలిపింది. అప్పట్లో 27 బస్సులు, 166 ఉద్యోగులతో మొదలైన రవాణా వ్యవస్థ.. TGSRTC గా నేడు ఏకంగా 9,000 పైగా బస్సులతో, 44 వేల మందికి పైగా ఉద్యోగులతో సుమారు 55 లక్షల మంది ప్రయాణికులను రోజు గమ్య స్థానాలకు చేరుస్తున్నట్లు తెలిపింది.
దేవాదాయ, ధర్మాదాయ శాఖలో బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. ఉమ్మడి రంగారెడ్డి పరిధిలో 630 దేవాలయాలు ఉండగా, 250 మంది వరకు ఉద్యోగులు, అర్చకులు పని చేస్తున్నారు. దేవాలయాల్లో 6ఏ విభాగంలో 19 ఉండగా, 6బీ కింద 41, 6సిలో 570 దేవాలయాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ దేవాలయాల్లో ధూపదీప నైవేద్య పథకం కింద ఎంపిక చేసిన ఆలయాలు కూడా కొన్ని ఉన్నాయి.
HYD నగరంలో వీధి కుక్కల దాడుల్లో చిన్నారులు చనిపోతున్న ఘటనలపై హైకోర్టు ఇటీవలే ఆందోళన వ్యక్తం చేసింది. వరుస ఘటనలు జరుగుతున్నా.. ప్రభుత్వానికి ఓ విధానం లేకపోవడం ఏంటి..? అని ప్రశ్నించింది. కేవలం పరిహారం చెల్లించి, చేతులు దులుపుకుంటామంటే కుదరదని, భవిష్యత్తులో ఘటనలు జరగకుండా చూడాలంది. ఈ మేరకు ప్రభుత్వం GHMC, పోలీసు, ఇతర శాఖలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది.
HYD, RR, MDCL,VKB జిల్లాల్లో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు చేయూతనిచ్చేందుకు వారికి ఉచితంగా ఎలక్ట్రిక్ ఆటో రిక్షా డ్రైవింగ్లో శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఎండీ కాంతి వెస్లే వెల్లడించారు. 100 మంది మహిళలకు అవకాశం కల్పిస్తామని, డ్రైవింగ్ లైసెన్స్, సొంత ఎలక్ట్రిక్ వాహనం మైక్రో లోన్ అందిస్తామన్నారు. కూకట్పల్లిలోని మోనో ప్రాంగణంలో ట్రైనింగ్ అందిస్తామన్నారు.
✓ జులై 15,16వ తేదీల్లో గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి అంగన్వాడీల్లో చేర్చాలని కోరుతారు. ✓18న ఇంటింటికి వెళ్లి రెండున్నర ఏళ్ల చిన్నారులను గుర్తిస్తారు. ✓19న స్వచ్ఛ అంగన్వాడీ పేరిట కేంద్రాలను శుభ్రం చేసి, మొక్కలు నాటుతారు. ✓20న ఎర్లీ చైల్డ్ హుడ్ డెవలప్మెంట్, సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో ఇక ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంగన్వాడి కేంద్రాల్లోనే జరగనుంది. జూలై 15 నుంచి 20 వరకు ‘అమ్మ మాట అంగన్వాడి బాట’ పేరిట ప్రత్యేక ప్రోగ్రాం జరగనుంది. ప్రస్తుతం రెండున్నర ఏళ్ల పిల్లలు పాఠశాలల్లో చేరే నాటికి అక్షరాలు, అంకెలు, ఆట పాటలతో కూడిన విద్య అందించడమే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ లక్ష్యంగా జిల్లాల అధికారులు తెలిపారు.
హెచ్ఎండీఏకు జవసత్వాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రణాళిక విభాగంలో పూర్తి స్థాయిలో అధికారులు, సిబ్బందిని నియమించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చురుకుగా పనిచేసే కొందరు పీవోలు, ఏపీవోలు, జేపీవోలు, మిగతా సిబ్బందిని గుర్తించి వారికి హెచ్ఎండీఏలోని వివిధ జోన్లలో బాధ్యతలు కేటాయించనుంది. త్వరలో చేపట్టనున్న బదిలీల్లో ఈ నిర్ణయం తీసుకోనుంది.
మున్నూరుకాపు మహాసభ ఆధ్వర్యంలో మున్నూరుకాపు యువతీయువకుల కోసం వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మున్నూరుకాపు మహాసభ అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల14వ తేదీ ఆదివారం మ్యాడం అంజయ్య హాల్లో వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరిచయ వేదికను తెలంగాణలోని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ లష్కర్గూడలో ఆదివారం జరిగే సీఎం రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే రంగారెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. గీత కార్మికుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు. అందులో భాగంగానే రేపు కాటమయ్య రక్షణ కవచం కిట్లను పంపిణీ చేయనున్నారు.
Sorry, no posts matched your criteria.