India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రంగారెడ్డి జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతోంది. బుధవారం మోయినాబాద్లో 39.7℃, మొగల్గిద్ద, కేతిరెడ్డిపల్లె, మంగళపల్లె 39.5, ప్రొద్దుటూరు 39.3, రెడ్డిపల్లె 39.2, షాబాద్, కాసులాబాద్ 39.1, చుక్కాపూర్ 39, మహేశ్వరం, నాగోల్ 38.6, హస్తినాపురం 38.5, మామిడిపల్లె, తుర్కయంజాల్, తొమ్మిదిరేకుల 38.5, కోతూర్, హఫీజ్పేట్ 38.4, చంపాపేట్ 38.3, శంకర్పల్లి 38.3, ఖాజాగూడ, మహంకాళ్, అలకాపురి 38.2℃ ఉష్ణోగ్రత నమోదైంది.
డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీ సెమిస్టర్-1 హాల్ టికెట్లు బుధవారం విడుదల అయ్యాయి. అయితే దీనికి సంబంధించి హాల్ టికెట్లు విద్యార్థులు www.braouonline.in అఫీషియల్ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఇప్పటికే అభ్యర్థుల ఫోన్లకు మేసేజ్లు పంపినట్లు తెలిపారు.
హోలీ నేపథ్యంలో HYDలో ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఉదయం 6 గం. నుంచి శనివారం ఉదయం 6 గం. వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. వైన్సులతో సహా.. గ్రేటర్ పరిధిలో ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాలపై ఆంక్షలుంటాయని ఆదేశించారు. రోడ్లపై వెళ్లే వారిపై అకారణంగా రంగులు చల్లితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయన్నారు.
యువతిపై ఫిలింనగర్ PSలో అట్రాసిటీ కేసు నమోదైంది. టోలిచౌకిలో ఒకే రూమ్లో ఉంటున్న తనను మరో యువతి మానసిక వేదనకు గురిచేస్తోందని, ప్రశ్నిస్తే యువకులను తీసుకొచ్చి ఇబ్బందులకు గురి చేయసాగిందని బాధితురాలు తెలిపింది. ఇటీవల ఓ యువకుడికి తన ఫోన్తో మెసేజ్ చేసిందని, నిలదీస్తే ‘నిన్ను రేప్ చేయించి.. మర్డర్ చేయిస్తా’అంటూ బెదిరించిందని ఆమె వాపోయింది. ఈ మేరకు బాధితురాలు PSలో ఫిర్యాదు చేసింది.
హోలీ పండుగను పురస్కరించుకొని ఈనెల 14వ తేదీ ఉ.6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి గుంపులు గుంపులుగా తిరుగుతూ.. హంగామా చేస్తే చర్యలు తప్పవని హెచ్చారించారు.
నగర శివారులో భూగర్భజలాలు తగ్గడంతో వాటర్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. ఇటువంటి సమయంలో శంకర్పల్లి, జన్వాడ, పూర్ణనంద ఆశ్రమం రోడ్, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో బోర్లువేసి కొందరు నీటిని తోడేస్తున్నారు. దీనివలన ఆయా ప్రాంతాల్లో లో ప్రెషర్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే, వట్టినాగులపల్లి, ఖానాపూర్ గ్రామాల్లో ఏకంగా 25 బోర్లను అధికారులు సీజ్ చేశారు.
HYDలోని రవీంద్రభారతిలో ఉద్యోగ నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యకు ప్రాధాన్యమిచ్చే విద్యాశాఖకు రూ.21,650 కోట్లు కేటాయించామని, గతంలో విద్యాశాఖ నిర్లక్ష్యానికి గురైందన్నారు. విద్యాశాఖలో చివరి నుంచి పోటీపడే పరిస్థితికి తెలంగాణ దిగజారిందని, విద్యాశాఖ దిగజారడం ఆందోళనకరం, అవమానకరమన్నారు.
హెచ్సీయూ, ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ సంయుక్త ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ విశిష్ట ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రేపు మ.3 గంటలకు HCU క్యాంపస్లోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఆడిటోరియంలో ఈ ఉపన్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. HCU వీసీ ప్రొ.బీజేరావు అధ్యక్షతన జరిగే సమావేశంలో ముఖ్యవక్తగా డెన్మార్క్లోని ఆర్హస్ యూని వర్సిటీ ప్రొ. సురేశ్ పాల్గొని ప్రసంగిస్తారన్నారు.
ఓయూ కేటగిరి-2 పీహెచ్డీ ఎంట్రెన్స్ టెస్ట్కు దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించినట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. ఈనెల 11తో గడువు ముగియగా.. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు తేదీని రూ.2,000 లేట్ ఫీజుతో ఈనెల 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రొ.పాండురంగారెడ్డి పేర్కొన్నారు.
హబ్సిగూడలో ఆత్మహత్య చేసుకున్న దంపతుల సూసైడ్ నోట్ కన్నీరు పెట్టిస్తోంది. ‘అమ్మా.. నాన్న.. మీకు భారంగా ఉండలేక చనిపోతున్నాం. మీరు బాధపడకండి. అన్నా వదిన మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు. నా వల్ల ఎప్పుడు మీకు బాధలే. ఏడవకు అమ్మ, నేను నిన్ను వదిలి వెళ్లిపోయా. ఈ బాధ కొద్ది రోజులే, నాకు జీవించాలని అనిపించడం లేదు. నా వరకు ఈ నిర్ణయం కరెక్టే’ అంటూ చంద్రశేఖర్ రెడ్డి తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.
Sorry, no posts matched your criteria.