RangaReddy

News July 9, 2024

కార్పొరేషన్ ఛైర్మన్ల జాబితాలో ఉమ్మడి జిల్లాలో ఐదుగురికి చోటు

image

ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్రస్థాయి కార్పొరేషన్ ఛైర్మన్ల జాబితాలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఐదుగురికి చోటు దక్కింది. ఇందులో ఇద్దరు వికారాబాద్ జిల్లాకు చెందిన వారు కాగా.. ముగ్గురు రంగారెడ్డి జిల్లా వారున్నారు. మేడ్చల్ జిల్లా నుంచి ఒక్కరికి కూడా ప్రాతినిధ్యం లభించలేదు. తొలి విడతలో పదవులు దక్కని వారంతా రెండో జాబితాలోనైనా తన పేరు వస్తుందని ఆశతో ఉన్నారు.

News July 9, 2024

HYD: గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు ఇవే..!

image

✓గర్భాశయ క్యాన్సర్ వచ్చిన వారికి నెలసరి సమయంలో అధిక రక్తస్రావం అవుతుంది.
✓పొత్తి కడుపులో నొప్పి.. తరచూ కడుపు ఉబ్బరం
✓పదే పదే మూత్ర విసర్జనకు వెళ్తారు.ఆ సమయంలో మంట, నొప్పిగా అనిపిస్తుంది
✓శృంగారంలో పాల్గొన్నప్పుడు, ఆ తర్వాత యోని దగ్గర నొప్పి, మంటగా ఉంటుంది
✓దుర్వాసనతో కూడిన వైట్ డిశ్చార్జ్ అవుతుంది
✓అలసట, నీరసం, బరువు తగ్గడం, రక్తహీనత కనిపిస్తాయి
•పై లక్షణాలు ఉంటాయని HYD MNJ డా. నాగశ్రీ తెలిపారు.

News July 9, 2024

HYD: మొయినాబాద్‌లో ముజ్రా పార్టీ

image

HYD శివారు మొయినాబాద్‌లో గల ఓ ఫామ్ హౌస్‌లో నలుగురు యువతులు, ఏడుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. సురంగల్ గ్రామ పరిధిలోని ఫామ్ హౌస్‌లో అర్ధరాత్రి ముజ్రా పార్టీ పేరుతో అసభ్య కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి నలుగురు అమ్మాయిలను తీసుకువచ్చినట్లు సమాచారం.

News July 9, 2024

HYD: 30.81 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం

image

GHMC పరిధిలో ఈ సంవత్సరం వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా 30.81 లక్షల మొక్కలు నాటాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది వరకు హరితహారం పేరిట జరిగిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాని పేరును వనమహోత్సవంగా మార్చింది. అయితే బెల్టోపారం, గుల్మోహార్ వంటి వాటితో పాటు ఈసారి కానుగ, వేప, రావి వంటివి సైతం నాటనున్నారు.

News July 9, 2024

సికింద్రాబాద్: తల్లి డబ్బులు ఇవ్వలేదని యువకుడి ఆత్మహత్య

image

వ్యాపారం కోసం తల్లిని డబ్బులు అడగగా.. తన వద్ద లేవని చెప్పడంతో మనస్తాపానికి గురైన కొడుకు తన ఫోన్‌‌ స్టేటస్‌లో ‘ఇది నా చివరి రోజు’ అని పెట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. మిర్జాలగూడలో నివాసముండే లలిత కుమార్ వాసు(25) టిఫిన్‌ బండి పెట్టుకోవడానికి రూ.5 లక్షలు కావాలని తల్లిని అడిగాడు. ఇవ్వక పోవడంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

News July 9, 2024

HYD: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

image

HYD నాగోల్ పరిధి సాయి నగర్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. పోలీసుల వివరాలు.. నల్గొండ జిల్లాకు చెందిన నరేశ్ (35) కొంతకాలంగా హైబీపీతో ఇబ్బంది పడుతున్నాడు. ఆదివారం అతడు ఉండే గది నుంచి దుర్వాసన వస్తుండడంతో ఇంటి యజమాని డయల్ 100కు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు డోర్ తెరిచి చూడగా.. నరేశ్ మృతి చెంది ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

News July 9, 2024

నేడే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం

image

సుప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం నేడు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 3 రోజుల పాటు జరిగే కళ్యాణోత్సవాల్లో భాగంగా మొదటి రోజు సోమవారం సాయంత్రం అమ్మవారిని పెళ్లికూతురుగా ఆలయ అర్చకులు ముస్తాబు చేశారు. పుట్టమన్ను తీసుకొచ్చి ఎస్ఆర్ నగర్ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి ఎల్లమ్మ దేవస్థానానికి పెద్ద ఎత్తున ఒగ్గు కళాకారులు ఊరేగింపుతో ఎదుర్కోళ్ల ఉత్సవం నిర్వహించారు.

News July 8, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓రామంతపూర్:వన మహోత్సవం ప్రారంభించిన మంత్రులు
✓మేడ్చల్: డ్రగ్స్ తీసుకున్న 12 మంది పై కేసు నమోదు
✓కంటోన్మెంట్ GHMCలో కలిస్తే నష్టమే:రామకృష్ణ
✓గచ్చిబౌలి: స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు రంగం సిద్ధం
✓HYD: 7 నెలల్లో పింఛన్ అందింది రెండుసార్లే!: బిక్షపతి
✓HYD: నిరుద్యోగుల కన్నెర్ర.. చీకట్లోనూ నిరసనలు
✓గోల్కొండ: రెండవ రోజు కొనసాగిన బోనాలు

News July 8, 2024

HYD: డ్రగ్స్ సేవించిన 12 మందిపై కేసు 

image

డ్రగ్స్ తీసుకున్న 12 మందిని మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ పట్టణానికి చెందిన కొందరు వ్యాపారస్తులు రాజస్థాన్ నుంచి డ్రగ్స్‌ను కొనుగోలు చేసి సేవిస్తున్నారని పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. డ్రగ్స్ కొనడం సేవించడం నేరమని ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన పోలీసులు చర్యలుంటాయన్నారు.

News July 8, 2024

గచ్చిబౌలి: స్కిల్ డెవలప్ మెంట్ సమావేశంలో పాల్గొన్న సీఎం

image

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాప్ కాలేజీలో స్కిల్ డెవలప్‌మెంట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. కాలేజీలో నిర్మాణమవుతున్న కన్వెన్షన్ సెంటర్‌ను ఆయన పరిశీలించారు.