India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYDలో తాగు, మురుగు నీటి అక్రమ కనెక్షన్లకు చెక్ పెట్టేందుకు జలమండలి సిద్ధమైంది. ఇప్పటికే కూకట్పల్లి, మాదాపూర్, గచ్చిబౌలిలో నూతన యాప్ ద్వారా ఇన్స్పెక్షన్ మొదలుపెట్టారు. ఆయా ప్రాంతానికి వెళ్లి యాప్లో చెక్ చేస్తే అనుమతి పొందిన కనెక్షన్ల వివరాలు చూపిస్తుంది. యాప్లో చూపించని కనెక్షన్లు అక్రమం అని తేలిపోనుంది. అక్రమ కనెక్షన్ల ద్వారా జలమండలికి తీవ్ర నష్టం జరుగుతోందని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
HYD ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కోటా కింద జులై 8 నుంచి సెప్టెంబరు 8వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్లు రక్షణ పౌర సంబంధాల అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఈస్ట్ మారేడుపల్లిలోని ఏఓసీ సెంటర్ హెడ్ క్వార్టర్స్, tuskercrc-202 @gov.in, www.joinindianarmy@nic.in వెబ్సైట్ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
HYD శివారులో రూ.96 కోట్లతో లేఅవుట్ అభివృద్ధి చేసేందుకు HMDA కసరత్తు మొదలుపెట్టింది. ఘట్కేసర్ మండల పరిధి ప్రతాపసింగారం గ్రామంలో ఒకే చోట 132 ఎకరాలను భూ యజమానులు HMDAకు అప్పగించారు. భూమిని స్వాధీనం చేసుకున్న HMDA అధికారులు సర్వే పూర్తి చేసి లేఅవుట్ అభివృద్ధి చేసేందుకు అవసరమైన పనులు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ శివారులో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. దుండిగల్ PS పరిధిలో బైక్పై వెళుతున్న దంపతులను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
HYD ఆరాంఘర్ 1z నంబర్ బస్లో ప్రసవించిన శ్వేతను GHMC అధికారులు శనివారం కలిశారు. డెలివరీ అయిన ఏరియాకు సంబంధించిన అధికారులను అప్రమత్తం చేసి బర్త్ సర్టిఫికెట్ను జారీ చేయించారు. భవిష్యత్తులో జనన ధృవీకరణ పత్రం కోసం ఎటువంటి ఇబ్బందులు రాకుండా GHMC అధికారులు చొరవ చూపి స్వయంగా ఆమెకు అందజేయడం విశేషం.
ఫిలింనగర్లోని బసవతారకనగర్ బస్తీలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదలకు అమ్మవారి ఆలయ ప్రహరీ కూలిపోయింది. వరదలకు నిర్మాణంలో ఉన్న రోడ్లు మరింత అధ్వానంగా తయారయ్యాయి. కనీసం మరమ్మతులు కూడా చేయలేదని స్థానికులు వాపోతున్నారు. రేపటి నుంచి నగరంలో బోనాలు మొదలుకానున్నాయి. ఇలా అయితే పండుగ ఎలా జరుపుకోవాలని బస్తీ వాసులు నిలదీస్తున్నారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
గ్రేటర్ HYD, మేడ్చల్ జిల్లా పరిధి BRS ఎమ్మెల్యేలు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుని శనివారం కలిశారు. పలు సమస్యలపై వినతి పత్రం అందించారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ MLA కేపీ వివేకానంద, ఉప్పల్ MLA లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ MLA సుధీర్ రెడ్డి, మల్కాజిగిరి MLA రాజశేఖర్ రెడ్డి, కూకట్పల్లి MLA కృష్ణారావు, శేరిలింగంపల్లి MLA అరికెపూడి గాంధీ మంత్రి సమావేశం అయ్యారు.
నగరంలో రాత్రి సమయంలోనూ ఆర్టీసీ బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. JBS, MGBS, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద రాత్రి వేళల్లో ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో వందల కొద్ది రూపాయలు ఖర్చు చేసి వెళ్లాల్సి వస్తోంది. దీంతో సికింద్రాబాద్ నుంచి బోరబండ, కొండాపూర్, కోఠి, ఉప్పల్, కూకట్పల్లి ప్రాంతాలకు నైట్ RTC సర్వీసులు నడపాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.
ఆరాంఘర్ 1z నంబర్ బస్లో ప్రసవించిన మహిళ శ్వేతను ఆర్టీసీ అధికారులు శనివారం కలిశారు. డెలివరీ అయిన ఏరియా సంబంధిత అధికారులతో మాట్లాడారు బర్త్ సర్టిఫికేట్ను జారీ చేసి ఆమెకు అందజేశారు. కాగా, పురిటి నొప్పులతో బస్సులో బాధపడుతున్న మహిళకు మహిళా కండక్టర్, ప్రయాణికుల సహాయంతో డెలివరీ చేశారు. పండంటి ఆడబిడ్డ పుట్టింది.
HYD జిల్లాలోని షెడ్యూల్ కులాలకు చెందిన న్యాయ పట్టభద్రులకు మూడేళ్లపాటు ఉచిత నైపుణ్య శిక్షణ అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ యాదయ్య తెలిపారు. శిక్షణ పొందేవారికి నెలకు రూ.3 వేల స్టైఫండ్, రూ.50 వేల డిజిటల్ బుక్స్, ఫర్నిచర్, కంప్యూటర్, డ్రెస్ ఇస్తామని తెలిపారు. దరఖాస్తుకు నేడే లాస్ట్ కాగా.. ఈ వెబ్ సైట్ https://tsepass.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.