RangaReddy

News March 27, 2024

HYD: అవకాశవాద నాయకులకు బుద్ధి చెప్పాలి: సబితా

image

అవకాశవాద నాయకులకు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌, బీజేపీ చేవెళ్ల MP అభ్యర్థులను ప్రజలు నమ్మబోరని అన్నారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గ పరిధి నార్సింగిలోని ఓం కన్వెన్షన్‌లో మంగళవారం చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. MLA ప్రకాశ్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సబితా ఇంద్రారెడ్డి హాజరై మాట్లాడారు.

News March 27, 2024

HYD: రాష్ట్రంలో టెట్‌ పరీక్ష ఫీజు రద్దు చేయాలి: వాసుదేవరెడ్డి

image

రాష్ట్రంలో టెట్‌ పరీక్ష ఫీజును వెంటనే రద్దు చేయాలని బీఆర్‌ఎస్‌ నేత కే.వాసుదేవరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఫీజులు లేకుండానే పరీక్షలు నిర్వహించాలని కోరారు. HYD తెలంగాణ భవన్‌లో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం నుంచి టెట్‌ దరఖాస్తులు ప్రారంభంకానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజుల రద్దు ప్రకటన జారీ చేయాలని కోరారు.

News March 27, 2024

IPL: ఉప్పల్ వెళుతున్నారా.. ఇది మీ కోసమే..!

image

నేడు ఉప్పల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో IPL మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 4 నుంచి రాత్రి 11:30 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని రాచకొండ CP తరుణ్ జోషి తెలిపారు. లారీ, డంపర్, వాటర్ ట్యాంకర్లు, మట్టి తరలించే వాహనాలు, రెడీ మిక్స్ ట్రక్ తదితర భారీ వాహనాలను దారి మళ్లించనున్నారు. ఉప్పల్ టయోటా షోరూం, నాగోల్ మెట్రో స్టేషన్ యూటర్న్, హబ్సిగూడ క్రాస్ రోడ్ వద్ద డైవర్షన్ పాయింట్లు పెట్టారు. SHARE IT

News March 27, 2024

HYD: మహిళా కమిటీల పర్యవేక్షణలో పాఠశాలలు

image

HYD, RR, MDCL,VKB జిల్లాల్లోని పాఠశాలల్లో నిర్వహణ బాధ్యతలను మహిళా కమిటీలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ‘అమ్మ ఆదర్శ’ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయనుంది. శానిటేషన్ నుంచి విద్యార్థులకు అందించే ఉచిత దుస్తుల పంపిణీ, మధ్యాహ్నం భోజనం, భవన నిర్మాణాలు, మరమ్మతు పనులు, మౌలిక సదుపాయాలను ఇలా సమస్తం మహిళా కమిటీల పర్యవేక్షణలో జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

News March 26, 2024

హైదరాబాద్: RTC X రోడ్స్‌లో IPL టికెట్ల విక్రయం

image

హైదరాబాద్ RTC X రోడ్స్‌లో చిక్కడపల్లి పోలీసులు మంగళవారం సాయంత్రం తనిఖీలు చేపట్టారు. IPL టికెట్లు విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు రైడ్స్ చేశారు. విజయ్, ప్రణయ్, సాత్విక్‌ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకొన్నారు. రేపటి SRH VS MI మ్యాచ్ టికెట్లు‌ బ్లాక్‌లో అమ్ముతున్నట్లు గుర్తించారు. ముగ్గురిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 26, 2024

హైదరాబాద్‌లో యువకుడి దారుణహత్య..!

image

హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. జీడిమెట్ల PS పరిధి సుభాష్‌నగర్ శ్మశానవాటిక వద్ద జైలర్ (24) అనే బిహార్‌కు చెందిన యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. గుల్బర్గాకు చెందిన సలీం ఈ హత్య చేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 26, 2024

నా బాస్‌ KCR ఒక్కరే: పద్మారావు

image

సికింద్రాబాద్‌లో గెలవబోతున్నామని BRS MP అభ్యర్థి పద్మారావు జోస్యం చెప్పారు. తెలంగాణభవన్‌లో జరిగిన పార్లమెంటరీ సమావేశంలో‌ ఆయన మాట్లాడారు. ‘అప్పట్లో నా వద్ద బండి లేదు. కార్పొరేటర్‌ నుంచి పార్లమెంట్‌ స్థాయికి ఎదిగాను. నాది పొలిటికల్ ఫ్యామిలీ కాదు. నా నుంచే రాజకీయాలు మొదలయ్యాయి. నా బాస్ KCR ఒక్కరే. ఆయన వల్లే రాజకీయాల్లోకి వచ్చాను. ఈ MP ఎన్నికల్లోనూ గెలుస్తాను’ అంటూ పద్మారావు ధీమా వ్యక్తం చేశారు.

News March 26, 2024

HYD: త్వరలో 14.5MW విద్యుత్ ప్లాంట్ ప్రారంభం

image

గ్రేటర్ HYD పరిధి దుండిగల్‌లోని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ద్వారా 14.5 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయనున్నారు. దీనికోసం దాదాపుగా 1500 మెట్రిక్ టన్నుల చెత్తను ఉపయోగించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్లాంట్ ప్రారంభానికి సిద్ధమైంది. TSSPDCLతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ సైతం పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. GHMC పరిధిలో నిత్యం సుమారు 8000 మెట్రిక్ టన్నుల గార్బేజ్ విడుదలవుతోంది.

News March 26, 2024

మల్కాజిగిరిపై సీఎం SPECIAL ఫోకస్

image

మల్కాజిగిరి సీటుపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. తన సిట్టింగ్ స్థానం కావడం, మరోవైపు దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం కావడంతో ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు స్థానిక నేతలతో సీఎం సమావేశమై చర్చించారు. సునీతారెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రచారానికి సిద్ధం కావాలని సూచించారు. కాగా BRS నుంచి రాగిడి, BJP నుంచి ఈటల పోటీ చేస్తున్నారు.

News March 26, 2024

HYD: ఈనెల 29న టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం!

image

టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఈరోజు భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికలు, తాజా రాజకీయ అంశాలపై వారు చర్చించారు. ఈనెల 29న సా.5 గంటలకు HYD గాంధీభవన్‌లో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్ నాయకులు పాల్గొననున్నారు.