India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన HYD బల్కంపేట్ ఎల్లమ్మ బోనాల జాతర తేదీలను నిర్వాహకులు ఈరోజు ప్రకటించారు. జులై 8 నుంచి 10వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. 9వ తేదీన అమ్మవారి కళ్యాణం ఘనంగా నిర్వహించనున్నామని చెప్పారు. లక్షలాదిగా భక్తులు రానుండడంతో ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. SHARE IT
నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి టీజీపీఎస్సీని 20 లక్షల మందితో త్వరలో ముట్టడిద్దామని నిరుద్యోగ ఐకాస నాయకుడు మోతీలాల్ నాయక్ పిలుపునిచ్చారు. మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వడంతో ప్రభుత్వం దిగిరాదని స్పష్టం చేశారు. గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష విరమించిన అనంతరం చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయానికి వచ్చారు. నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తే ప్రభుత్వం నుంచి ఎవరూ రాలేదని వాపోయారు.
ఆషాఢ మాస బోనాల జాతర ఉత్సవాలకు సంబంధించి వివిధ శాఖల అధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లు పూర్తి కానున్నాయని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. బోనాల పండగ నేపథ్యంలో ఆలయాలకు ఇవ్వాల్సిన చెక్కులు పంపిణీకి సిద్ధమయ్యాయని వెల్లడించారు. ఒకట్రెండు రోజుల్లో వాటిని పంపిణీ చేస్తామన్నారు. ఈనెల 7న జగదాంబ మహంకాళి గోల్కొండ, లంగర్ హౌస్ నుంచి తొట్టెల ఊరేగింపును మంత్రులు ప్రారంభిస్తారని చెప్పారు.
మనీ లాండరింగ్, డ్రగ్స్ వచ్చాయని కాల్స్ రాగానే కంగారు పడొద్దని టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో టెలీకాలర్స్ డీఎస్సీ కేవీఎం.ప్రసాద్ సూచించారు. వీడియో కాల్లో అటు వైపు కనిపించే కేంద్ర దర్యాప్తు సంస్థల లోగోలన్నీ నకిలీవే అని, ముఖం కనిపించకుండా పోలీసు, సీబీఐ అధికారిగా మాట్లాడేది మోసగాళ్లని గ్రహించాలన్నారు. మోసపోయినట్టు గుర్తించగానే గంటలోపు(గోల్డెన్ అవర్) పోలీసులకు/1930 నంబర్లో ఫిర్యాదు చేయాలన్నారు.
ట్రేడింగ్లో పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.16.45 లక్షల టోకరా వేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYDకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి తన ఫేస్బుక్ ఖాతాలో ‘ట్రేడింగ్’ గురించి ప్రకటన కంట పడింది. ముందుగా ట్రేడింగ్ గురించి అవగాహన కల్పించారు. నిజమేనని నమ్మిన బాధితుడు రూ.16.45 లక్షలు పెట్టుబడి పెట్టేశాడు. ఆ తర్వాత అవతల వ్యక్తుల ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నీట్ సమస్యపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని AISF నాయకులు ఆరోపించారు. AISF హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్ మండలాల నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈనెల 4న విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన పోస్టర్ను వారు ఆవిష్కరించారు. నాయకులు వంశీ, అరుణ్, వెంకటేశ్, ఉపేందర్, బన్నీ, భాను, వరుణ్ ఉన్నారు.
ఓ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న యువతిపై హాస్టల్ నిర్వాహకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన HYD ఘట్కేసర్ సమీపంలోని మేడిపల్లి PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఖమ్మం జిల్లాకు చెందిన యువతి(20) పీర్జాదిగూడ బుద్ధానగర్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ స్థానికంగా ఉన్న పీజీ కాలేజీలో ఎంసీఏ చదువుతోంది. రాత్రి హాస్టల్ నిర్వాహకుడు యువతిపై లైంగిక దాడికి పాల్పడడంతో ఆమె బంధువులు PSలో ఫిర్యాదు చేశారు.
HYD బేగంపేట్లోని జ్యోతిబా ఫులే ప్రజాభవన్లో ప్రజావాణికి ప్రతి మంగళ, శుక్ర వారాల్లో అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో బాధితులు తరలివస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికోసం హరేకృష్ణ మూమెంట్ సహకారంతో ప్రజాభవన్ వద్ద భోజనశాల ఏర్పాటు చేశారు. దాదాపు 400మందికి సరిపడేలా భోజనం ఏర్పాటు చేయగా, మధ్యాహ్నంలోగానే పూర్తయ్యింది.
రాష్ట్రంలో అత్యధిక నష్టాల్లో ఉన్న హైదరాబాద్ సౌత్ సర్కిల్లో ఏటా నష్టాలు పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 42.23 శాతం నష్టాలొచ్చాయి. 1013 మిలియన్ యూనిట్లు ‘లాస్ యూనిట్లు’గా టీజీఎస్పీడీసీఎల్ పేర్కొంది. 101 కోట్ల యూనిట్లు బిల్లింగ్లోకి రాలేదు. సగటు యూనిట్ ఖర్చు రూ.7 కాగా ఒక్క ఏడాదిలో రూ.707 కోట్లు ఖజానాకు గండిపడింది. దీంతో ఈ సర్కిల్ను ప్రైవేటుకు అప్పగించేందుకు సర్కారు సన్నద్ధం అవుతోంది.
HYDకోఠిలోని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో పార్ట్ టైం అధ్యాపక ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అభ్యర్థులు తెలుగు,ఉర్దూ, ఇంగ్లిష్, కామర్స్, జంతుశాస్త్రం, ఫుడ్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, బీబీఏ, ఫుడ్ అండ్ న్యూట్రీషియన్, జనటిక్స్, కెమిస్ట్రీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ సబ్జెక్టులను బోధించేందుకు ఈనెల 8వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సర్టిఫికెట్లను నేరుగా అకాడమిక్ డైరెక్టర్ ఆఫీస్లో ఇవ్వాలన్నారు.
Sorry, no posts matched your criteria.