RangaReddy

News March 26, 2024

28న ఓయూ వార్షిక బడ్జెట్.. 

image

HYD ఓయూ వార్షిక బడ్జెట్-2024 ఈనెల 28న సెనేట్ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. ఆదాయం తగ్గి.. వ్యయం పెరిగిన తరుణంలో నిధుల కోసం ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తోందని వర్సిటీ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించినప్పటికీ వేతనాలు పెన్షన్‌కు సరిపోవడం లేదన్నారు. ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News March 26, 2024

HYD: ఔటర్‌ రింగు రోడ్డుపై అద్దెకు సైకిళ్లు

image

సైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు గ్రేటర్‌ HYD చుట్టూ ఉన్న ఔటర్‌ రింగు రోడ్డు వెంబడి 24 కి.మీ మేర అంతర్జాతీయ ప్రమాణాలతో సోలార్‌ రూప్‌ టాప్‌ సైకిల్‌ ట్రాక్‌ను నిర్మించారు. సొంత సైకిళ్లు లేని వారి కోసం అద్దెకు సైకిల్‌ స్టేషన్‌‌ను నార్సింగి హబ్‌లో ఏర్పాటు చేసి సుమారు 200 సైకిళ్లను అందుబాటులో ఉంచారు. అద్దెకు ఇచ్చే సైకిల్‌కు గంటలకు రూ.50 చొప్పున వసూలు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

News March 26, 2024

హైదరాబాద్‌లోనే TB కేసులు అధికం

image

TB కేసులు గ్రేటర్‌ HYDలో పెరుగుతూనే ఉన్నాయి. 2023‌లో TGలో 73,212 మంది వ్యాధిగ్రస్థులను గుర్తించారు. ఇందులో 20 శాతం కేసులు HYDలోనే నమోదు కావడం ఆందోళనకరం. తర్వాతి స్థానంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కేసులు అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బాధితుల్లో 15 నుంచి 44 ఏళ్ల‌ మధ్య ఉన్నవారే ఎక్కువని వెల్లడించారు. దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, రక్తంతో కూడిన దగ్గు వీటి లక్షణాలు. SHARE IT

News March 26, 2024

HYD నగరంలో ఏప్రిల్ నుంచి రూ.29 కిలో భారత్ రైస్..!

image

HYD నగరంలోని అత్తాపూర్ సహా పలుకాలనీల్లో కిలో భారత్ అట్టా(గోధుమపిండి) రూ.27.5, కిలో భారత్ దాల్ (శనగపప్పు) రూ.60ను మొబైల్ వ్యాన్ల ద్వారా విక్రయిస్తున్నట్లు కేంద్రీయ బండార్ సమితి తెలిపింది. కోఠిలోని భారత్ బండార్‌లో సైతం విక్రయిస్తున్నట్లు తెలిపారు. FCI నుంచి 2000 టన్నుల బియ్యం కేటాయింపులు జరిగాయని, నగరంలో ఏప్రిల్ నుంచి కిలో భారత్ రైస్ రూ.29 విక్రయాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

News March 26, 2024

HYD: BHELలో ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

image

HYD నగరంలోని BHEL సంస్థలో ఇంజనీరింగ్ పోస్టుల రిక్రూట్‌మెంట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 31 వరకు edn.bhel.com వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. సీనియర్ ఇంజనీర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తం 33 ఖాళీలు ఉండగా.. పవర్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్ సిస్టం, పవర్ మాడ్యూల్ నావెల్ బ్యాటరీ ప్యాకింగ్ విభాగాల్లో అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

News March 26, 2024

HYD: ITI చేసిన వారికి ECILలో ఉద్యోగాలు..!

image

హైదరాబాద్ ECIL గ్రేడ్-2 పోస్టులకు సంబంధించి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రిషన్, మెకానిస్ట్, ఫిట్టర్ విభాగంలో 30 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్‌లో అధికారులు స్పష్టం చేశారు. టెన్త్, ITI చేసినవారు అర్హులు. మిగతా వివరాలను www.ecil.co.in వెబ్‌సైట్‌ను సంప్రదించి దరఖాస్తు చేసుకోండి. ఏప్రిల్ 13 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది.SHARE IT

News March 25, 2024

HYD: అందుకే ప్రణీత్‌ను చంపాడు..!

image

HYD బాలానగర్ PS పరిధిలో నిన్న <<12919309>>యువకుడు ప్రణీత్ తేజ(20)ను<<>> అతడి స్నేహితుడు చంపిన విషయం తెలిసిందే. సీఐ నవీన్ తెలిపిన వివరాలు.. ప్రణీత్, సమీర్(20) చిన్న నాటి స్నేహితులు. వీరిద్దరూ కలిసి చిల్లర దొంగతనాలు చేస్తూ జులాయిగా తిరుగుతూ గంజాయి, మద్యానికి బానిసలయ్యారు. ఈక్రమంలో తన తల్లిని ప్రణీత్ బూతులు తిట్టాడని కోపం పెంచుకున్న సమీర్.. స్థానికంగా పార్కింగ్ చేసిన బస్సులోకి ప్రణీత్‌ను తీసుకెళ్లి దారుణంగా చంపాడు.

News March 25, 2024

HYD: హోలీ పండుగ రోజే విషాదం..!

image

హోలీ పండుగ రోజు HYD శివారులో విషాదం నెలకొంది. చెరువులో మునిగి ఇద్దరు యువకులు చనిపోయారు. మహేశ్వరం మం. నందిపల్లిలో రంగులు చల్లుకున్న అనంతరం యువత పక్కనే ఉన్న పెద్దచెరువు వైపు వెళ్లారు. ఈత కోసం నీటిలోకి దిగిన సంఘం జగన్ (29), కొమ్ము సురేందర్ (30) ప్రమాదవశాత్తు మునిగిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News March 25, 2024

HYD: ఆ రోజు సెలవు.. జీతం కూడా..!

image

MP ఎన్నికలు, కంటోన్మెంట్ ఉపఎన్నిక సందర్భంగా ఉద్యోగులు, కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు మే 13(సోమవారం)న వేతనంతో కూడిన సెలవును కార్మికశాఖ ప్రకటించిందని మేడ్చల్ జిల్లా అధికారులు గుర్తు చేశారు. సోమవారం నాచారంలో కార్మిక ఓటర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, తెలంగాణ కర్మాగారాలు, దుకాణాలు, సముదాయాల చట్టాల కింద సెలవు ఇచ్చారన్నారు. భవిష్యత్తు కోసం ఓటేయాలని పిలుపునిచ్చారు.

News March 25, 2024

RR: హోలీ రోజు దారుణం.. BRS నేతపై కత్తితో దాడి..!

image

వికారాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం దారుణం చోటుచేసుకుంది. BRS వికారాబాద్ మండల అధ్యక్షుడు కమలాకర్ రెడ్డిపై కొంతమంది వ్యక్తులు కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో గాయపడిన ఆయణ్ని జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. చికిత్స పొందుతున్న కమలాకర్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పరామర్శించారు.