India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD రవీంద్రభారతిలో ఆదివారం మైత్రి నాట్యాలయ స్కూల్ ఆఫ్ భరతనాట్యం అండ్ కూచిపూడి ఆధ్వర్యంలో ప్రముఖ నాట్య గురువు శిరిణికాంత్ శిష్యురాలైన వైష్ణవి కూచిపూడి నాట్యంలో రంగప్రవేశం చేసింది. ఈ సందర్భంగా జావళి, తిల్లాన, శ్రీఘననాథం, ఓంకార, తరంగం తదితర అంశాల్లో నర్తించి ఆహుతులను మైమరిపించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ హాజరై వైష్ణవిని సత్కరించి అభినందించారు.
ఎల్బీనగర్ ఎస్ఓటి, నాగోల్ పోలీసులు సంయుక్తంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. నాగోల్ చౌరస్తాలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వస్తున్న కారుని అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ ప్రాంతానికి చెందిన బోయినపల్లి సురేష్ తన కారులోని సీఎన్జీ గ్యాస్ కిట్లో గంజాయి అమర్చుకొని తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్తో పాటు.. పలు పీఎస్లలో సురేష్పై గంజాయి పాత కేసులు ఉన్నట్లు గుర్తించారు.
HYD నగరంలో బాలికపై జరిగిన అత్యాచారం కలకలం రేపుతోంది. ఓ బాలికకు కూల్ డ్రింకులో గంజాయి కలిపి తాగించి, కిడ్నాప్ చేసిన ఘటన కాచిగూడలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితులు సామూహిక అత్యాచారం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి నరేష్, విజయ్తో పాటు.. దాదాపు 8 మందిని అరెస్టు చేశారు.
✏జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం
✏T20WC ఛాంపియన్గా ఇండియా.. జిల్లాలో సంబరాలు
✏VKBD: రేపు ప్రజావాణి
✏జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
✏గండీడ్, మహమ్మదాబాద్: ప్రజాపాలన దరఖాస్తుల గడువు పొడిగించండి
✏వికారాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ
✏పరిగి: రోజురోజుకు పెరుగుతున్న చోరీలు.. ప్రత్యేక ఫోకస్ పెట్టిన పోలీసులు
✏మహమ్మదాబాద్: నూతన జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం
HYDలోని రాజ్ భవన్ వద్ద మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు లైఫ్ జర్నీపై ప్రధాని మోదీ వర్చువల్ పద్ధతిలో పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాజ్ భవన్ వద్ద ఈ కార్యక్రమం జరగగా.. ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాజీ ఉపరాష్ట్రపతికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
మనస్తాపంతో ఉరేసుకొని 7వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అడ్మిన్ ఎస్సై డి.సుబాష్ వివరాల ప్రకారం.. లింగంపల్లిలో కారు డ్రైవర్గా పనిచేస్తున్న గణేశ్ కూతురు రుకిత(12) ఏడో తరగతి చదువుతోంది. కామారెడ్డిలో బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి తీసుకువెళ్తామని చెప్పి తీసుకెళ్లలేదు. దీంతో మనస్తాపానికి గురైన రుకిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఉత్తరఖాండ్ నుంచి సిటీకి తీసుకు వస్తున్న లక్షన్నర విలువ గల హషిష్ అనే డ్రగ్స్ను సినిమా పక్కిలో చేజింగ్ చేసి ఎక్సైజ్ ఎస్టీఎఫ్ టీమ్ పట్టుకున్నారు. కీసర రాంపల్లికి చెందిన రిత్విక్.. ఉత్తరాఖాండ్ కు వెళ్లి అక్కడ కొంత కాలం ఉన్నారు. తిరిగి అక్కడి నుంచి వస్తూ 80 గ్రాముల హషిష్ అనే డ్రగ్స్ ని తీసుకు వచ్చాడు. అధికారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి చేజ్ చేసి అదుపులోకి తీసుకున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో ముగ్గురు కస్టమ్స్ అధికారులపై కేసు నమోదయింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో అధికారులు శ్రీనివాసులు, పంకజ్ గౌతమ్, చక్రపాణిపై సీబీఐ కేసు నమోదుచేసింది. వీరి ఇళ్లు, ఆఫీసుల్లో సీబీఐ సోదాలు చేసి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. కాగా, విదేశీ కరెన్సీ అక్రమ రవాణాకు సహకరించారని ముగ్గురిపై ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది.
HYD నగరంలో రూ.10 కోసం జరిగిన గొడవలో ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. ఫలక్నుమా ప్రాంతానికి చెందిన మహమ్మద్ అన్వర్ (37) ఆటోలో.. ఓ బాలుడు (16) ప్రయాణించాడు. ఆటోడ్రైవర్ ఛార్జీ రూ.20 అడగగా, బాలుడు రూ.10 మాత్రమే ఇచ్చాడు. మిగతా పైసలు ఇవ్వడానికి నిరాకరించిన బాలుడు డ్రైవర్ను నెట్టేశాడు. కిందపడిన డ్రైవర్ తలకు గాయమైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. T20 ప్రపంచ కప్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్ గొప్పగా అనిపించింది అన్నారు. బౌలర్స్ అందరూ అద్భుతంగా బౌలింగ్ చేసి అదరగొట్టారు మరియు కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన కెప్టెన్సీ చేసి వందల కోట్ల మంది హృదయాలను సంతోషపెట్టారని X లో రాసుకొచ్చారు.
Sorry, no posts matched your criteria.