India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తనిఖీలు చేపడుతున్న పోలీసుల వద్ద నుంచి ఓ వాహనదారుడు బ్రీత్ అనలైజర్ ఎత్తుకెళ్లిన ఘటన సికింద్రాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. బోయిన్పల్లి పరిధిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపడుతున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ బ్రీత్ అనలైజర్ పట్టుకుని వేగంగా పారిపోయాడు. పోలీసులు విచారణ జరిపి నిందితుడి ఆచూకీ కోసం, చోరీకి గురైన సామగ్రిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
KPHB పరిధిలోని వివిధ ప్రాంతాల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా క్షయ వ్యాధి నిర్మూలన అధికారుల బృందం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. డాక్టర్ సంధ్య మాట్లాడుతూ.. రెండు వారాలకు మించి దగ్గు వస్తే వెంటనే స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి టెస్ట్ చేయించుకోవడం ఉత్తమమని సూచించారు. హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో టీబీ టెస్ట్ అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.
యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ పోస్టుల నియామకాల్లో బీసీలకు 50శాతం పోస్టులు ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన శనివారం కాచిగూడలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జేఎన్ టియూ, పాలమూరు, ఉస్మానియా, శాతవాహన యూనివర్సిటీలలో పోస్టును బీసీలకు కేటాయించాలన్నారు.
✏జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం
✏VKBD:213 ఎకరాల్లో పర్యాటక అభివృద్ధి: స్పీకర్
✏నాటు సారా విక్రయించిన, సరఫరా చేసిన కేసులు నమోదు:తాండూర్ ఎక్సైజ్ సీఐ
✏మల్లికార్జున్ ఖర్గేను కలిసిన తాండూర్ ఎమ్మెల్యే
✏మద్దూర్: చిరుత దాడితో లేగ దూడ మృతి
✏దోమ:కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన పరిగి ఎమ్మెల్యే
✏VKBD:DS మృతి.. జిల్లా నేతల సంతాపం
✏జిల్లాలో పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం
పర్యావరణ పర్యాటక అభివృద్ధిలో భాగంగా పేదలకు ఉపాధి అవకాశాలు కలిగేలా ఉండాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శనివారం వికారాబాద్ కలెక్టరేట్లో అనంతగిరి పర్యాటక అభివృద్ధిపై చేపట్టాల్సిన పనులపై అటవీ దేవాదాయ మిషన్ భగీరథ భూగర్భ జలాల మున్సిపల్ విభాగాల అధికారులతో స్పీకర్ ప్రసాద్ కుమార్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రూ.110 కోట్లు మంజూరైనట్లు తెలిపారు.
ఏపీ మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి.శ్రీనివాస్ అకాల మరణం కాంగ్రెస్కు తీరని లోటు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తెలుగు రాష్ట్రాల్లో విస్తరింపజేసిన కీలక నేతల్లో డి.శ్రీనివాస్ ఒకరు అని స్మరించుకున్నారు. రాజకీయ దురందుడు, ఉన్నత విద్యావంతుడు, బడుగుల సంక్షేమం కోసం ఆయన కృషి చేశారని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు, ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు.
HYD మహానగరాన్ని శిఖరాగ్రాన నిలిపేందుకు నాడు ఔటర్ రింగ్ రోడ్డు(ORR) అయినా.. నేడు రీజినల్ రింగ్ రోడ్డు(RRR) అయినా చేసింది కాంగ్రెస్, చేసేది కాంగ్రెస్.. అని తెలంగాణ కాంగ్రెస్ X వేదికగా మ్యాప్ విడుదల చేసింది. ఇదిలా ఉండగా.. RRR పనులను సెప్టెంబర్ నాటికి ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నామని ఇటీవల రోడ్స్ అండ్ బిల్డింగ్స్ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపిన సంగతి తెలిసిందే.
గ్రేటర్ HYD పరిధిలో గత 22 రోజుల్లోనే 1108 కేసులు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో ఎక్కువగా మద్యం సేవించి ప్రమాదాలకు కారకులైన వారు ఉన్నారని తెలిపారు. వారిపై కేసులు నమోదు చేసి లైసెన్సులు రద్దు చేశామన్నారు. కొందరి దగ్గర నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేకపోవడం, ధ్రువపత్రాలు, హెల్మెట్లు, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా రాంగ్ రూట్లో వెళ్లడం లాంటి కేసులు కూడా ఉన్నాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
HYD నగరం హస్తినాపురంలో తెలంగాణ ఉద్యమ గాయకుడు, మాజీ వేర్హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ వేద సాయిచంద్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని, పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఒక కుటుంబ మనిషిలా ఉండేవాడని హరీష్ రావు, తన ఆట, పాట మరువలేమని KTR అన్నారు.
HYDలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా నార్సింగిలో ఓ ఇంజినీర్ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYDకు చెందిన ఇంజినీర్ ఇజాయత్ అలీ దుబాయ్ నుంచి 20 రోజుల క్రితం నగరానికి వచ్చాడు. ఈ క్రమంలో ఈరోజు నిర్మానుష్య ప్రాంతంలో అతడి గొంతుకోసి దుండగులు చంపేశారు. క్వాలిస్ వాహనంలో వచ్చిన ఇద్దరు యువకులు, ఓ యువతి అతడిని చంపినట్లు ఆధారాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదైంది.
Sorry, no posts matched your criteria.