RangaReddy

News June 28, 2024

HYD: విషాదం.. కుక్కల దాడిలో బాలుడి మృతి

image

HYD శివారులో విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాలు.. పటాన్‌చెరు పరిధి ఇస్నాపూర్‌‌లోని మహీధర వెంచర్‌లో విశాల్(8) అనే బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే పటాన్‌చెరు పరిధి ముత్తంగిలో 7 నెలల చిన్నారిని కుక్కలు కరిచి తీవ్రంగా గాయపరిచాయి. బాలుడి మృతదేహంతో పాటు గాయపడిన 7 నెలల చిన్నారిని పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News June 28, 2024

HYD: ఇందులో మీ వాహనం ఉందా..?

image

రాచకొండ కమిషనరేట్‌లోని వివిధ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో చాలాకాలంగా వదిలేసిన వాహనాలను అధికారులు‌ స్వాధీనం చేసుకున్నారు. ఏకంగా 160 వాహనాలు తమ ఆధీనంలో ఉన్నట్లు‌ అధికారులు వెల్లడించారు. వీధుల్లో వదిలేసిన‌ బైక్‌లను అంబర్‌పేటలోని హెడ్‌ క్వార్టర్స్‌లో భద్రపరిచారు. వాహనాల యజమానులు సరైన పత్రాలు చూయించి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. లేదంటే రూల్స్ ప్రకారం వేలం వేస్తామని‌ స్పష్టం చేశారు. SHARE IT

News June 28, 2024

HYD: కొత్తగా 29 ఉద్యానాలు!

image

మహానగరంలో వాయుకాలుష్యం పెరుగుతున్న దృష్ట్యా మరింత పచ్చదనం పెంపునకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. HMDA పరిధిలో కొత్తగా మరో 29 ఉద్యానాల నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. రూ. 46 కోట్లు వెచ్చించడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రస్తుతం గ్లోబల్ ర్యాంకింగ్‌లో హైదరాబాద్ 12.9% పచ్చదనంతో ఉంది. దీనిని 33 శాతానికి పెంచాలని HMDA లక్ష్యంగా పెట్టుకొంది.

News June 28, 2024

హైదరాబాద్‌లో తగ్గిన చికెన్ ధరలు

image

హైదరాబాద్‌లో చికెన్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత వారం కిలో రూ. 250కి పైగా విక్రయించారు. శుక్రవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఫాంరేటు రూ. 110, రిటైల్‌ రూ. 132, విత్‌ స్కిన్ కిలో రూ. 191, స్కిన్‌లెస్‌ రూ. 218‌ నుంచి రూ. 230 మధ్య అమ్ముతున్నారు. ధరలు తగ్గడంతో‌ మాంసం విక్రయాలు‌ పెరిగే అవకాశం ఉందని HYD‌ పార్శిగుట్టలోని ఓ వ్యాపారి తెలిపాడు. బోనాల సీజన్‌ కావడంతో‌ ఈ ఆదివారం నుంచే‌ గిరాకీ‌ ఉంటుందన్నారు.

News June 27, 2024

ఉప్పల్‌‌లో యాక్సిడెంట్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

image

ఉప్పల్‌లో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. రామంతాపూర్‌ పరిధి శ్రీనివాసపురం వాసి దినేశ్‌ కుమార్(36) మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. విధులు ముగించుకొని గురువారం యాక్టివాపై ఇంటికి బయల్దేరాడు. Genpact వద్ద లారీని బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదైంది.

News June 27, 2024

HYD: విద్యుత్ సమస్యలా.. ఫోన్ చేయండి..!

image

వానాకాలం దృష్ట్యా ఫిర్యాదులు స్వీకరించే కాల్ సెంటర్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా రోజువారీగా 10 వేల కాల్స్‌ను సిబ్బంది స్వీకరిస్తుంటారని.. గాలివానతో అంతరాయాలు తలెత్తితే ఇది 95 వేల వరకు వెళ్తుందని తెలిపారు. విద్యుత్తు అంతరాయాలు తలెత్తినప్పుడు 1912కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఎర్రగడ్డలోని స్కాడా కార్యాలయం నుంచి ఈ కేంద్రం పనిచేస్తుంది.

News June 27, 2024

HYD: మాన్‌సూన్ టీమ్స్ రెడీ..

image

గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షాకాలంలో వరద నీరు సాఫీగా వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో పలు ప్రాంతాల్లో నిల్వ నీటితో రోడ్లు చెరువులు అవుతున్నాయి. కాలనీలు నీట మునుగుతున్నాయి. ఇలా నీటి నిల్వల ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ ఏటా వర్షాకాలంలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తుంది.ఈ సంవత్సరం కూడా వివిధ ప్రాంతాల్లో మాన్‌సూన్ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.

News June 27, 2024

HYD: న్యాయవాదుల సహకార సంఘం నూతన డైరెక్టర్ల ఎన్నికలు

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతోపాటు జంట నగరాల్లోని అన్ని కోర్టుల్లో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. తెలంగాణ న్యాయవాదుల పరస్పర సహాయక సహకార సంఘం నూతన డైరెక్టర్ల ఎన్నికలు జులై 21న జరగనున్నాయి. ఈనెల 28 నుంచి జులై 4 వరకు నామపత్రాల స్వీకరణ, 6న పరిశీలన, 9న ఉపసంహరణ, 11న పోటీలో మిగిలిన తుది అభ్యర్థుల జాబితా విడుదల, 21న (ఆదివారం) పోలింగ్ ఉంటుంది. 

News June 27, 2024

HYD: ఎదుగుతున్నాడని ఓర్వ లేక చంపేశాడు..!

image

HYD అల్వాల్ పరిధి కానాజిగూడ ఇందిరానగర్‌లో ఇటీవల హత్యకు గురైన క్యాటరింగ్ వ్యాపారి అన్వర్(45) కేసును పోలీసులు ఛేదించారు. ACPరాములు తెలిపిన వివరాలు.. మధ్యప్రదేశ్ వాసి అన్వర్, ఉత్తరాఖండ్ వాసి మనోజ్(33) కుటుంబాలతో కలిసి HYD వలస వచ్చారు. అయితే తన కళ్ల ముందే అన్వర్ ధనవంతుడు కావడం చూసిన మనోజ్ ఓర్వలేకపోయాడు. ఇటీవల అన్వర్‌కు మద్యం తాగించి తలను గోడకేసి కొట్టి చంపేశాడు. పోలీసులు మనోజ్‌ను అరెస్ట్ చేశారు.

News June 27, 2024

HYD: EVDM కమిషనర్‌గా రంగనాథ్ బాధ్యతల స్వీకరణ

image

GHMC ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఈవీడీఎం) కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు HYD బుద్ధభవన్‌లోని కమిషనర్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది నూతన కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన ఉద్యోగ బాధ్యతలను కూడా ఎప్పటిలాగానే విజయవంతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు.