India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయగా.. పోలీసులు కాపాడారు. పర్వత్ నగర్లో నివాసం ఉండే సాయికిరణ్(23) క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. కాగా ఆర్థిక ఇబ్బందులు తాళలేక దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడే ఉన్న మాదాపూర్ పోలీసులు గమనించి సాయి కిరణ్ను కాపాడి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు.
RR:శంషాబాద్ లో చిరుత సంచారం.
√VKB:మర్పల్లి ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన స్పీకర్.
√RR:జుడాల సమ్మె ప్రారంభం వైద్యులకు సెలవులు రద్దు.
√RR:ORR లోపల ఐటీ కంపెనీలకు ప్రాధాన్యం: మంత్రి శ్రీధర్ బాబు.
√ ఆమనగల్లులో ఉప ముఖ్యమంత్రికి ఘన సన్మానం.
√RR: కేంద్ర బడ్జెట్లో బీసీ సంక్షేమానికి రెండు లక్షల కేటాయించాలి:ఆర్. కృష్ణయ్య.
√RR: ఓయూలో గ్రూప్-1,2 పోస్టులు పెంచి, మెగా డీఎస్సీ ప్రకటించాలని ఆందోళన
రాష్ట్రాభివృద్ధిలో మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర ఎంతో కీలకమని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. హైదరాబాద్లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు – సమ్మిళిత అభివృద్ధి’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. మహిళలకు వ్యాపారాల్లో తోడ్పాటునందిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రాన్ని 3జోన్లుగా ఏర్పాటు చేస్తామన్నారు. ORR లోపల IT కంపెనీలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు
తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ను ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన స్థానంలో గత 2 వారాలుగా GHMCకి ఇన్ఛార్జి కమిషనర్గా వ్యవహరించిన ఆమ్రపాలిని నూతన కమిషనర్గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రోనాల్డ్ రాస్ను విద్యుత్ శాఖ సెక్రటరీగా నియమించారు.
SHARE IT
హైదరాబాద్ శివారులో మాజీ MPTC హత్యకు గురయ్యారు. ఘట్కేసర్ PS పరిధిలో ఉండే మహేశ్ (40) ఈ నెల 17న బయటకువెళ్లి తిరిగిరాలేదని ఆయన సోదరుడు విఠల్ PSలో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా NFCనగర్ డంపింగ్ యార్డు వద్ద మహేశ్ మృతదేహం గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న సిగ్నల్ ఫ్రీ లెఫ్ట్ వద్ద ఓ బోర్డు పెట్టారు. ‘వాహనం నడిపేటప్పుడు సెల్ఫోన్ మోగితే దయచేసి ఎత్తకండి. బహుశా అది యముని పిలుపు కావొచ్చు’ అంటూ హెచ్చరించారు. ఇటీవల సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఫాలో ట్రాఫిక్ రూల్స్.
ప్రేమిస్తున్నాను అంటూ ఇంటర్ విద్యార్థినికి మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిన యువకుడి పై నారాయణగూడ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. సైఫాబాద్ ప్రాంతానికి చెందిన ఖలీల్ నారాయణగూడలో ఇంటర్ చదువుతున్న విద్యార్థినికి ప్రేమిస్తున్నానని చెప్పి అత్యాచారం చేశాడు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఖలీల్ను రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ శంకర్ తెలిపారు.
వాహన యజమానులూ తస్మాత్ జాగ్రత్త.. ఇకపై వాహనాలు నడుపుతూ మైనర్లు రోడ్ల మీదకు వస్తే బైక్ యజమానులపై కేసులు తప్పవని సిటీ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు చిక్కితే ఆ వాహన యజమానికి 3 నెలల జైలు శిక్షతోపాటు, రూ.5వేల జరిమానా విధించనున్నట్లు సిటీ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ తెలిపారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఇవాళ జనసంఘ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బలిదాన్ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, విజయ రామారావు తదితరులు శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.
తెలంగాణ ఆదర్శ పాఠశాలలో గంటల ప్రతిపాదికన విధులు నిర్వహిస్తున్న బోధన సిబ్బంది పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. పాఠశాల పని దినాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని పీరియడ్కు రూ.182చొప్పున వేతనాలు అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల పని దినాలకు సంబంధించి ప్రతినెల 130 పీరియడ్లు బోధిస్తున్నప్పటికీ కేవలం 100పీరియడ్లకు మాత్రమే వేతనాలు అందుతున్నాయని, శ్రమ దోపిడీకి గురవుతున్నామని వాపోతున్నారు.
Sorry, no posts matched your criteria.