India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD శివారు అమీన్పూర్లోని డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాల్లో మౌలిక వసతులు కరువయ్యాయని లబ్ధిదారులు వాపోతున్నారు. కొన్ని బ్లాకుల్లో లిఫ్ట్లు పని చేయడం లేదన్నారు. నిత్యావసరాలు, తదితర సామగ్రి తీసుకొని 7, 8, 9 ఫ్లోర్లు ఎక్కాలంటే వృద్ధులు అలసిపోతున్నారని చెబుతున్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని లిఫ్ట్లను బాగుచేయాలని వేడుకుంటున్నారు.
✓ఖైరతాబాద్ గణేశుడి మండపం వద్ద కర్రపూజ ✓హైదరాబాద్లో కుండపోత వర్షం
✓ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ కెమెరాలు
✓భారీగా పెరిగిన టమాట ధర.. కిలో రూ.100..!
✓HYD: త్వరలో ప్రారంభం కానున్న చర్లపల్లి రైల్వే స్టేషన్
✓HYD:JNTUలో ఆందోళనలపై నిషేధాజ్ఞలు
✓HYD: పిల్లలకు గంజాయి అలవాటు చేస్తున్నారు జర జాగ్రత్త..!
ఫిలింనగర్ బసవతారకనగర్ బస్తీలో సా. కుండపోత వర్షం కురిసింది. ఇటీవల వినాయక్నగర్ నుంచి బాలిరెడ్డినగర్ మీదుగా పారామౌంట్హిల్స్ ఏరియా వరకు రహదారి పనులు చేపట్టినా.. పూర్తి చేయలేదు. దీంతో రహదారి మీద నీళ్లు నిలిచాయి. పక్కనే ఉన్న కట్ట మైసమ్మ గుడిలోకి భారీగా వరద చేరడంతో ప్రహరీ కూలి ముగ్గురికి గాయాలు అయ్యాయి. గుడి సగానికి పైగా మునిగిపోయిందని.. ఇకనైనా అధికారులు చర్యలు తీసుకోవాలని బస్తీ వాసులు కోరుతున్నారు.
ఈ సారి ఖైరతాబాద్ గణేశ్ వెరీ స్పెషల్. 2023లో వరల్డ్ టాలెస్ట్ విగ్రహం(63 ఫీట్లు)గా పేరుగాంచిన మహాగణపతి.. 2024లో ఆ రికార్డును బ్రేక్ చేయనుంది. 70వ వార్షికోత్సవం సందర్భంగా 70 అడుగుల మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. విగ్రహం ఎత్తులో ఏటా 1 లేదా 2 ఫీట్ల హెచ్చుతగ్గులు ఉండేవి. కానీ, గతేడాది కంటే ఈసారి ఏకంగా 7 ఫీట్లు పెంచుతున్నారు. 1954లో ఒక ఫీట్తో మొదలైన గణపయ్య ఇంతింతై వటుడింతవుతూ వస్తున్నాడు.
హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జి మీద సోమవారం ఓ యువతి సూసైడ్ అటెంప్ట్ చేసింది. తీగల వంతెన రెయిలింగ్ ఎక్కి దుర్గంచెరువులో దూకబోయింది. ఇది గమనించిన మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆమెను క్షేమంగా కిందకు దించారు. కానీ, అప్పటికే యువతి నిద్రమాత్రలు మింగినట్లు తెలుసుకున్న పోలీసులు పెట్రోలింగ్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. సూసైడ్ అటెంప్ట్కు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
ట్రాఫిక్ నివారణకు డ్రోన్ కెమెరాలను సైబరాబాద్ పోలీసులు అందుబాటులోకి తెచ్చారు. పైలట్ ప్రాజెక్టు కింద ఐకియా, దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి,హఫీజ్పేట్, హైటెక్ సిటీ, మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి ఐటీ కారిడార్ ప్రాంతాల్లో ఈడ్రోన్ను వినియోస్తున్నారు. రోడ్లపై ట్రాఫిక్ జామ్లు,జంక్షన్ల వద్ద వాహనాల వేగం ఎలా ఉంది? ఎక్కడైనా నీరు నిలిచి ఉందా అనే విషయాలు తెలుసుకొని పోలీసులు స్పందించి పరిష్కరించనున్నారు.
మల్కాజిగిరి MP స్థానం రాష్ట్ర స్థాయి నేతలకు కీలకంగా మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్లో ఓడిన రేవంత్ రెడ్డి.. 2019లోక్సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి గెలిచి ఆ తర్వాత T కాంగ్రెస్ చీఫ్గా నియామకమయ్యారు. సేమ్ అలాగే 2023అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ నుంచి ఓడిన ఈటల రాజేందర్.. 2024 లోక్సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి గెలిచారు. ప్రస్తుతం T BJP స్టేట్ చీఫ్ నియామక రేసులో ముందు ఉన్నారు.
గ్రేటర్ HYDలో కలకలం సృష్టిస్తోన్న భయంకరమైన ధార్ గ్యాంగ్ గతంలోనూ చోరీలకు పాల్పడింది. MP,UPకి చెందిన ఈ గ్యాంగ్ చివరిసారిగా 2022లో సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో చోరీలు చేసింది. ధార్ ముఠాపై 2018-2022మధ్య సైబరాబాద్లో 138,రాచకొండలో 32చోరీ కేసులు నమోదయ్యాయి. కాగా అప్పుడు ఈముఠా నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపడంతో రెండేళ్లుగా ఇటు వైపు రాలేదు. మళ్లీ ఇప్పుడు వచ్చి వరుస చోరీలు చేస్తున్నారు.
ముస్లిం ప్రజలకు రాచకొండ సీపీ తరుణ్ జోషి సోమవారం బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో, అందరూ కలిసి పండుగ నిర్వహించుకోవాలన్నారు. కమిషనరేట్ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీస్ అధికారులకు అందరూ సహకరించాలని కోరారు. ఎటువంటి అసాంఘిక ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
నెల క్రితం టమాటకు ధర లేక మిగిలిపోయిన వాటిని రైతు బజార్లలో వదిలిపోయే పరిస్థితి ఎదురైంది. అప్పట్లో రూ.20లోపు ధర పలికింది. ప్రస్తుతం టమాట ధర భారీగా పెరగడంతో వినియోగదారులు బేజారెత్తిపోతున్నారు. HYD, ఉమ్మడి RRలోని పలు రైతు బజార్లలో అధికారికంగా కిలో రూ.57 పలికింది. బహిరంగ మార్కెట్లో మాత్రం రూ.100కు చేరువలో ఉంది. రైతు బజార్లలోనూ ఈ వారంలో రూ.100 పలికే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.