RangaReddy

News March 7, 2025

జీహెచ్ఎంసీలోని ఇంజినీరింగ్ విభాగంలో నిర్లక్ష్యం

image

జీహెచ్ఎంసీలోని ఇంజినీరింగ్ విభాగంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రూ.5,942 కోట్లతో 23 పథకాలను చేపట్టాలని ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీచేసి 3 నెలలు పూరైనా ఇంజినీరింగ్ విభాగం మాత్రం ఒక్క పథకానికి కార్యరూపంలోకి దాల్చలేదని పలువురు కార్పోరేటర్లు విమర్శిస్తున్నారు. సీఎం రూ.5,827 కోట్ల పనులను డిసెంబర్ ప్రారంభించిన టెండర్లను పిలవడంలో ఇంజనీరింగ్ విభాగం ఎలాంటి చర్యలకు పూనుకోలేదు.

News March 7, 2025

HYD: నగర విస్తరణకు మంత్రివర్గం ఆమోదం

image

HYD విస్తరణకు మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 7 జిల్లాలు, 7,257 చదరపు కిలోమీటర్లు ఉన్న HMDA పరిధి తాజా నిర్ణయంతో సుమారు 11 చదరపు కిలోమీటర్ల నుంచి 12 వేల చదరపు కిలోమీటర్ల వరకు పెరగనుంది. కొత్తగా RRR వరకు విస్తరించడంతో మరో 4 జిల్లాల పరిధిలోని 32 మండలాలు చేరనున్నాయి. దీంతో 11 జిల్లాలు, 16 మండలాలు సుమారు 1,400 పైగా గ్రామాలతో HMDA పరిధి భారీగా పెరగనుంది.

News March 7, 2025

HYD: సన్‌రైజర్స్ అభిమానులకు శుభవార్త

image

ఈనెల 23న రాజస్థాన్ రాయల్స్, 27న లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ జట్టు తలపడనుంది. ఈ 2 మ్యాచ్‌లు ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో జరిగే రెండు మ్యాచ్‌ల టికెట్లు డిస్ట్రిక్ట్ యాప్‌లో అందుబాటులో ఉంటాయని సన్‌రైజర్స్ ప్రకటించింది. కాగా.. ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ల విక్రయం ఉ.11 నుంచి ప్రారంభంకానున్నాయి.

News March 6, 2025

RR: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష రాసింది ఎందరంటే.?

image

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రెండవ రోజు ఇంటర్మీడియట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 185 సెంటర్లలో 71,684 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా..70,431 మంది విద్యార్థులే హాజరయ్యారని అధికారులు తెలిపారు. 1,253 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. పరీక్షలు పూర్తైన అనంతరం ఆన్సర్ పేపర్లను స్ట్రాంగ్ రూమ్స్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. 

News March 6, 2025

మన హైదరాబాద్ కల్చర్ వేరు!

image

తెలుగు రాష్ట్రాల్లో మన హైదరాబాద్ కల్చర్ వేరు. ఊర్లో 10 ఎకరాలు ఉంటే గొప్ప. ఇక్కడ 100 గజాల్లో సొంతిళ్లు ఉన్నా గొప్పే. ఉన్నదాంట్లో సంతోషంగా ఉండేది హైదరాబాదీలే అనిపిస్తది. పండుగలు, పబ్బాలకు బలగం ఏకమవుతుంది. కుల, మత భేదం లేకుండా దోస్తానా కోసం జాన్ ఇస్తరు. మాస్‌కు కేరాఫ్ ధూల్‌పేట గల్లీలైతే, క్లాస్‌కు కేరాఫ్‌గా IT కారిడార్. ఏకంగా లక్షల మందికి మన HYD ఉపాధినివ్వడం విశేషం.
We Proud to Be A Hyderabadi

News March 6, 2025

సికింద్రాబాద్: స్నేహితుడి దారుణ హత్య

image

HYDలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. స్థానికుల వివరాలు.. సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తరుణి సూపర్ మార్కెట్ వెనకాల రాత్రి ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో స్నేహితుడు నగేశ్‌ను నర్సింగ్‌ అనే వ్యక్తి కర్రతో కొట్టి చంపేశాడు. ఈ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని గాంధీకి తరలించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 6, 2025

HYD: మార్చి 8న వాటర్ బంద్

image

BHEL జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మిస్తున్న కారణంగా ఈనెల 8న నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని HMWSSB అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎర్రగడ్డ, SRనగర్, HBకాలనీ, మూసాపేట, జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి, అశోక్‌నగర్, RCపురం, లింగంపల్లి, చందానగ, మదీనాగూడ, మియాపూర్, గంగారం, జ్యోతినగర్, బీరంగూడ, శ్రీనగర్, అమీన్‌పూర్, నిజాంపేట్‌‌లో అంతరాయం ఉంటుందన్నారు.

News March 5, 2025

రంగారెడ్డి జిల్లాలో పరీక్ష రాసింది ఎందరంటే?

image

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు ఇంటర్మీడియట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 185 పరీక్ష కేంద్రాలలో జనరల్‌తో పాటు ఒకేషనల్ విద్యార్థులతో కలిపి 83,829 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని అధికారులు తెలిపారు. 1,863 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారన్నారు. పరీక్షలు పూర్తైన అనంతరం ఆన్సర్ పేపర్లను స్ట్రాంగ్ రూమ్స్‌కు తరలించినట్లు తెలిపారు.

News March 5, 2025

HYDలో బీర్లపై పాత ధరలు.. ఇదేంటి?

image

HYDలో బీర్ సీసాలపై పాత ధరలే దర్శనమిస్తున్నాయని ఓ కస్టమర్ తెలిపారు. నాగోల్‌లోని వైన్ షాపులో బుధవారం బీఎస్ పాటిల్ అనే వ్యక్తి 2 బీర్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. MRP మాత్రం రూ.210గా ఉంది. ఇటీవల పెంచిన ధరల ప్రకారం రూ.250కి అమ్మినట్లు పేర్కొన్నారు. లేబుల్స్‌పై పాత ధరలు ఉండటం ఏంటని నిలదీస్తే వైన్స్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని వాపోయారు. మీప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి.

News March 5, 2025

రంగారెడ్డి జిల్లాలో ఎండ తీవ్రత ఇలా

image

రంగారెడ్డి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. మొయినాబాద్ మండలంలో మంగళవారం అత్యధికంగా 39.2℃ ఉష్ణోగ్రత నమోదైంది. అటు కేశంపేట, ఫరూక్‌నగర్ 39.1, ఇబ్రాహింపట్నం, శంకర్‌పల్లి 39, యాచారం 38.9, తలకొండపల్లి 38.8, బాలాపూర్ 38.7, షాబాద్ 38.6, మహేశ్వరం 38.3, చేవెళ్ల 38.1, అబ్దుల్లాపూర్‌మెట్ 38.1, షంషాబాద్ 37.9, కందుకూర్ 37.5, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, సరూర్‌నగర్, హయత్‌నగర్, కడ్తాల్, మాద్గుల్లో 37℃గా నమోదయ్యాయి.