India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD, RR, MDCL,VKB జిల్లాలలోని పలు ప్రాంతాల్లో కరెంట్ కోతలతో ఇబ్బంది పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. రాత్రి బంజారాహిల్స్, చందానగర్, ఎల్బీనగర్, జవహర్నగర్ తదితర చోట్ల కరెంట్ కోతలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సమస్యల పరిష్కారానికి TGSPDCL అధికారులు కంట్రోల్ రూమ్ నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. HYD, RR, MDCL ప్రజలు పై ఫొటోలోని నంబర్లు, VKB ప్రజలు 9493193177 నంబర్లో సంప్రదించండి.
SHARE IT
సికింద్రాబాద్ రైల్వే SPగా చందనాదీప్తి నల్గొండ నుంచి బదిలీపై వస్తున్న విషయం తెలిసిందే. 1983 వరంగల్లో జన్మించిన ఆమె ఏపీలో 10th, ఇంటర్ వరకు చదివారు. ఢిల్లీ IITలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. ఆమె తండ్రి సూచనలతో HYDలో కోచింగ్ తీసుకొని IPS ర్యాంకు సాధించారు. మొదట ఆమె నల్గొండ ప్రొబేషనరీ ఆఫీసర్గా, ఆ తర్వాత తాండూరు ASPగా, NZB OSDగా, మెదక్ SPగా, HYD నార్త్ జోన్ DCPగా, నల్గొండ SPగా పనిచేశారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సోమవారం రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. శంకర్పల్లి మండలం ప్రొద్దటూరులో అత్యధికంగా 73.3మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. శంకర్పల్లిలో 71మిల్లీ మీటర్లు, మొయినాబాద్ మండలం రెడ్డిపల్లిలో 61మిల్లీ మీటర్లు, మేడిపల్లి పరిధి మున్సిపల్ ఆఫీస్ వద్ద 39మిల్లీ మీటర్లు, ఘట్కేసర్ మండలం సింగపూర్ టౌన్షిప్ వద్ద 34 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
భయంకరమైన ధార్ గ్యాంగ్ ఘటనలు మరవకముందే గ్రేటర్ HYDలో మరో ముఠా కలకలం రేపుతోంది. యూపీ షామ్లి జిల్లాకు చెందిన భవారియా గ్యాంగ్ రోడ్లపై ఒంటరిగా వెళ్లేవారినే టార్గెట్ చేస్తూ దాడి చేసి చైన్ స్నాచింగ్లకు పాల్పడుతోంది. తాజాగా సిటీ పరిధిలో ఒకేరోజు 4 చైన్ స్నాచింగ్లు చేశారు. నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్లతో ఉన్న బైక్లపై వచ్చి చైన్ స్నాచింగ్లు చేస్తూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు. జర జాగ్రత్త!
శ్రీ అఖిల భారత కూచిపూడి నాట్యకళా మండలి ఆధ్వర్యంలో ప్రఖ్యాత నాట్యగురువు పెనుమర్తి మృత్యుంజయశర్మ శిష్యురాలు పవిరళ అచ్చుత్ దీపిక తనయ ప్రీతిక సవిరళ కూచిపూడి రంగప్రవేశాన్ని చేసింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కూచిపూడి శాస్త్రీయ నృత్యంపై మక్కువతో కూచిపూడి రంగప్రవేశాన్ని ఆగ్రేసర వర్తనశోభతో విరాజిల్లింపజేసి అందరి ప్రశంసలందుకుంది. HYD రవీంద్రభారతిలో ప్రముఖులు ఆమె కూచిపూడి రంగప్రవేశాన్ని కొనియాడారు.
HYD హిమాయత్నగర్లోని టీటీడీ బాలాజీ భవన్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం 19వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పుష్పయాగం వైభవంగా జరిగింది. ఉదయం నుంచి రాత్రి వరకు వేలాది మంది భక్తులు తరలివచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈనెల 12వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు సోమవారం రాత్రి 9 గంటలకు జరిగిన ధ్వజారోహణం కార్యక్రమంతో ముగిశాయి.
రెవెన్యూ శాఖలో అధికారాల వికేంద్రీకరణ జరపాలని తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ) నాయకులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. HYD నాంపల్లిలోని టీజీటీఏ కార్యాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రాములు ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం సోమవారం జరిగింది. అనంతరం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని కలిసి సమస్యలు, పదోన్నతులపై వినతిపత్రం సమర్పించారు.
తెలంగాణ ప్రభుత్వ భాషా, సాంస్కృతిక శాఖ, సిగ్మా అకాడమీ ఆఫ్ ఫొటోగ్రఫీ సంయుక్త ఆధ్వర్యంలో ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ రంగాల్లో 6 నెలల పాటు ‘ఆఫ్, ఆన్లైన్’లో ఉచితంగా డిప్లొమా కోర్సుకు శిక్షణ ఇస్తున్నామని సిగ్మా అకాడమీ ఆఫ్ ఫొటోగ్రఫీ ఛైర్మన్ ఎంసీ.శేఖర్ సోమవారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు సెల్ నంబర్లు 80080 21075, 70956 92175లో సంప్రదించి ఈ నెల 30లోపు పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.
HYD శివారు అమీన్పూర్లోని డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాల్లో మౌలిక వసతులు కరువయ్యాయని లబ్ధిదారులు వాపోతున్నారు. కొన్ని బ్లాకుల్లో లిఫ్ట్లు పని చేయడం లేదన్నారు. నిత్యావసరాలు, తదితర సామగ్రి తీసుకొని 7, 8, 9 ఫ్లోర్లు ఎక్కాలంటే వృద్ధులు అలసిపోతున్నారని చెబుతున్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని లిఫ్ట్లను బాగుచేయాలని వేడుకుంటున్నారు.
✓ఖైరతాబాద్ గణేశుడి మండపం వద్ద కర్రపూజ ✓హైదరాబాద్లో కుండపోత వర్షం
✓ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ కెమెరాలు
✓భారీగా పెరిగిన టమాట ధర.. కిలో రూ.100..!
✓HYD: త్వరలో ప్రారంభం కానున్న చర్లపల్లి రైల్వే స్టేషన్
✓HYD:JNTUలో ఆందోళనలపై నిషేధాజ్ఞలు
✓HYD: పిల్లలకు గంజాయి అలవాటు చేస్తున్నారు జర జాగ్రత్త..!
Sorry, no posts matched your criteria.