RangaReddy

News June 17, 2024

HYD: కట్ట మైసమ్మ గుడిలోకి వరద నీరు

image

ఫిలింనగర్ బసవతారకనగర్‌ బస్తీలో సా. కుండపోత వర్షం కురిసింది. ఇటీవల వినాయక్‌నగర్ నుంచి బాలిరెడ్డినగర్‌ మీదుగా పారామౌంట్‌హిల్స్ ఏరియా వరకు రహదారి పనులు చేపట్టినా.. పూర్తి చేయలేదు. దీంతో రహదారి మీద నీళ్లు నిలిచాయి. పక్కనే ఉన్న కట్ట మైసమ్మ గుడిలోకి భారీగా వరద చేరడంతో ప్రహరీ కూలి ముగ్గురికి గాయాలు అయ్యాయి. గుడి సగానికి పైగా మునిగిపోయిందని.. ఇకనైనా అధికారులు చర్యలు తీసుకోవాలని బస్తీ వాసులు కోరుతున్నారు.

News June 17, 2024

HYD: ఖైరతాబాద్ గణపతి.. 70 ఏళ్లు.. 70 అడుగులు!

image

ఈ సారి ఖైరతాబాద్‌ గణేశ్ వెరీ స్పెషల్. 2023‌లో‌ వరల్డ్ టాలెస్ట్‌ విగ్రహం(63 ఫీట్లు)గా పేరుగాంచిన మహాగణపతి.. 2024‌లో ఆ రికార్డును బ్రేక్ చేయనుంది. 70వ వార్షికోత్సవం సందర్భంగా 70 అడుగుల మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. విగ్రహం ఎత్తులో ఏటా 1 లేదా 2 ఫీట్ల హెచ్చుతగ్గులు‌ ఉండేవి. కానీ, గతేడాది కంటే ఈసారి ఏకంగా 7 ఫీట్లు పెంచుతున్నారు. 1954లో ఒక ఫీట్‌తో మొదలైన గణపయ్య ఇంతింతై వటుడింతవుతూ వస్తున్నాడు.

News June 17, 2024

HYD: కేబుల్ బ్రిడ్జి మీద యువతి సూసైడ్ అటెంప్ట్

image

హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి‌ మీద సోమవారం‌ ఓ యువతి సూసైడ్ అటెంప్ట్‌ చేసింది. తీగల వంతెన రెయిలింగ్‌ ఎక్కి దుర్గంచెరువులో దూకబోయింది. ఇది గమనించిన మాదాపూర్‌ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆమెను క్షేమంగా కిందకు దించారు. కానీ, అప్పటికే యువతి నిద్రమాత్రలు మింగినట్లు‌ తెలుసుకున్న పోలీసులు పెట్రోలింగ్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. సూసైడ్ అటెంప్ట్‌కు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

News June 17, 2024

HYD: ట్రాఫిక్ నివారణకు డ్రోన్‌ కెమెరాలు

image

ట్రాఫిక్ నివారణకు డ్రోన్‌ కెమెరాలను సైబరాబాద్‌ పోలీసులు అందుబాటులోకి తెచ్చారు. పైలట్‌ ప్రాజెక్టు కింద ఐకియా, దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి,హఫీజ్‌పేట్, హైటెక్‌ సిటీ, మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి ఐటీ కారిడార్‌ ప్రాంతాల్లో ఈడ్రోన్‌ను వినియోస్తున్నారు. రోడ్లపై ట్రాఫిక్‌ జామ్‌లు,జంక్షన్ల వద్ద వాహనాల వేగం ఎలా ఉంది? ఎక్కడైనా నీరు నిలిచి ఉందా అనే విషయాలు తెలుసుకొని పోలీసులు స్పందించి పరిష్కరించనున్నారు.

News June 17, 2024

HYD: రేవంత్ రెడ్డి లాగానే ఈటలకు జరుగుతుందా?

image

మల్కాజిగిరి MP స్థానం రాష్ట్ర స్థాయి నేతలకు కీలకంగా మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌లో ఓడిన రేవంత్ రెడ్డి.. 2019లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి గెలిచి ఆ తర్వాత T కాంగ్రెస్ చీఫ్‌గా నియామకమయ్యారు. సేమ్ అలాగే 2023అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ నుంచి ఓడిన ఈటల రాజేందర్.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి గెలిచారు. ప్రస్తుతం T BJP స్టేట్ చీఫ్ నియామక రేసులో ముందు ఉన్నారు.

News June 17, 2024

HYD: ధార్ GANG చరిత్ర ఇదే..!

image

గ్రేటర్ HYDలో కలకలం సృష్టిస్తోన్న భయంకరమైన ధార్ గ్యాంగ్ గతంలోనూ చోరీలకు పాల్పడింది. MP,UPకి చెందిన ఈ గ్యాంగ్ చివరిసారిగా 2022లో సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో చోరీలు చేసింది. ధార్ ముఠాపై 2018-2022మధ్య సైబరాబాద్‌లో 138,రాచకొండలో 32చోరీ కేసులు నమోదయ్యాయి. కాగా అప్పుడు ఈముఠా నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపడంతో రెండేళ్లుగా ఇటు వైపు రాలేదు. మళ్లీ ఇప్పుడు వచ్చి వరుస చోరీలు చేస్తున్నారు.

News June 17, 2024

బక్రీద్ శుభాకాంక్షలు: రాచకొండ సీపీ తరుణ్ జోషి

image

ముస్లిం ప్రజలకు రాచకొండ సీపీ తరుణ్ జోషి సోమవారం బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో, అందరూ కలిసి పండుగ నిర్వహించుకోవాలన్నారు. కమిషనరేట్ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీస్ అధికారులకు అందరూ సహకరించాలని కోరారు. ఎటువంటి అసాంఘిక ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

News June 17, 2024

HYD: భారీగా పెరిగిన టమాట ధర..! 

image

నెల క్రితం టమాటకు ధర లేక మిగిలిపోయిన వాటిని రైతు బజార్లలో వదిలిపోయే పరిస్థితి ఎదురైంది. అప్పట్లో రూ.20లోపు ధర పలికింది. ప్రస్తుతం టమాట ధర భారీగా పెరగడంతో వినియోగదారులు బేజారెత్తిపోతున్నారు. HYD, ఉమ్మడి RRలోని పలు రైతు బజార్లలో అధికారికంగా కిలో రూ.57 పలికింది. బహిరంగ మార్కెట్‌లో మాత్రం రూ.100కు చేరువలో ఉంది. రైతు బజార్లలోనూ ఈ వారంలో రూ.100 పలికే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

News June 17, 2024

HYD: త్వరలో ప్రారంభం కానున్న చర్లపల్లి రైల్వే స్టేషన్

image

HYD చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను రూ.430 కోట్లతో నిర్మించారు. ఎన్నికల ముందు దీనిని ప్రారంభించడానికి ప్రయత్నాలు జరిగినా కోడ్ కారణంగా ప్రారంభోత్సవం వాయిదా పడింది. కేంద్రంలో మళ్లీ మోదీ ప్రధాని కావడం, రైల్వే మంత్రిగా అశ్విన్‌కే మళ్లీ బాధ్యతలు అప్పగించడం, కిషన్ రెడ్డి మరోసారి కేంద్రమంత్రి అవడంతో త్వరలో చర్లపల్లి స్టేషన్ ప్రారంభోత్సవం జరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు.

News June 17, 2024

కూకట్‌పల్లి: జేఎన్టీయూలో ఆందోళనలపై నిషేధాజ్ఞలు

image

JNTUలో విద్యార్థుల ఆందోళనలు, ధర్నాలు, ర్యాలీల కట్టడికి వర్సిటీ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రిజిస్ట్రార్ డా.వెంకటేశ్వరరావు వర్సిటీ క్యాంపస్, ఇంజినీరింగ్ కాలేజీలకు సర్కులర్ జారీ చేశారు. సాంబారులో పురుగులు ఉన్నాయంటూ మంజీరా హాస్టల్‌లో విద్యార్థులు ధర్నా చేయడం, వర్సిటీ పాలనాపరమైన కొందరి పదోన్నతులపై ధర్నా నేపథ్యంలో ఇన్‌ఛార్జ్ వీసీ వెంకటేశం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.