India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మీ సోమవారం ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. దైవభక్తి, త్యాగ నిరతికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారని అన్నారు. అల్లా అనుగ్రహం తెలంగాణ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆమె ఈ సందర్భంగా ఆకాంక్షించారు. భిన్న సంస్కృతులకు నిలయమే మన హైదరాబాద్ అని కొనియాడారు.
బక్రీద్ సందర్భంగా సెలవు కావడంతో నేడు (సోమవారం) ప్రజావాణి ఉండదని జీహెచ్ఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆమె కోరారు. అలాగే HYDలోని ప్రసిద్ధ సాలార్జంగ్ మ్యూజియానికి కూడా సెలవు ఉంటుందని పరిపాలన అధికారి నాగేశ్వరరావు తెలిపారు.
లయబద్ధమైన నాట్యాంశాలకు వైవిధ్యభరితంగా నర్తించిన కవల కళాకారులు పావులూరి రవీనా, రిషిత ఆహుతులను రంజింపజేశారు. ఆదివారం HYD తెలుగు వర్సిటీలోని ఆడిటోరియంలో ప్రముఖ నాట్య గురువు పసుమర్తి రామలింగ శాస్త్రి శిష్యులు రవీన, రిషిత భరతనాట్యంలో అరంగేట్రం చేశారు. పుష్పాంజలి, గణేష పంచరత్నం, జతిస్వరం, శబ్దం, పాదవర్ణం, కీర్తనం, తిల్లాన, మంగళం తదితర అంశాల్లో నర్తించి ఆకట్టుకున్నారు.
గ్రేటర్ HYDలో భయంకరమైన ధార్ గ్యాంగ్ వరుస చోరీలకు పాల్పడుతోంది. తాజాగా హయత్నగర్లో ఒకేసారి 5 ఇళ్లల్లో చోరీలకు పాల్పడింది. దివ్యాంగులు, భిక్షగాళ్లు, పని మనుషుల్లా నటిస్తూ వస్తారని, రెక్కీ నిర్వహించి రాత్రవగానే ఇళ్లలోకి చొరబడతారని పోలీసులు తెలిపారు. అడ్డొచ్చిన వారిని చంపేసేందుకు సైతం వెనకాడరని హెచ్చరించారు. కాలనీల్లో భద్రతా సిబ్బంది నియామకం, సీసీ కెమెరాల ఏర్పాటు వంటివి చేసుకోవాలన్నారు. SHARE IT
గ్రేటర్లో 9,103 కిలోమీటర్ల మేర రహదారులున్నాయి. 1,302 కిలోమీటర్ల మేర వరద ప్రవాహ వ్యవస్థ ఉంది. అభివృద్ధి చెందిన నగరాల్లో రహదారులకు ఇరువైపులా వరద నీటి ప్రవాహ వ్యవస్థ ఉంటుంది. కానీ, HYD నగరంలో ఆ పరిస్థితి లేదు. ఇటీవలే గంటసేపు కురిసిన వానకు వర్షపు నీరు రోడ్ల పై నిలిచింది. వరద ఏరులై పారుతోందని, ఇబ్బందులు తప్పడం లేదన్న వివిధ కారణాలతో దాదాపుగా 158 ఫిర్యాదులు అందాయి.
హైదరాబాద్ CCSలో భారీగా బదిలీలు జరిగాయి. ఏకంగా 12 మంది ఇన్స్పెక్టర్లను మల్టీ జోన్-2కు బదిలీ చేస్తూ CP శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే రిపోర్ట్ చేయాలని అందులో పేర్కొన్నారు. బదిలీ అయిన ఇన్స్పెక్టర్ల వివరాలు: శివ శంకర్, రఘుబాబు, అప్పలనాయుడు, భూక్య రాజేశ్, సీత రాములు, హుస్సేన్ ధీరావత్, సత్యం, నాగేశ్వర్ రెడ్డి, ధీరావత్ కృష్ణ, కొత్త సత్యనారాయణ, SA ఇమన్యూల్, బిట్టు క్రాంతికుమార్.
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం డీఈఈసెట్-2024కు ఈనెల 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. HYD, RR, MDCL జిల్లాల్లోనూ జూలై 10న ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తు చేసే విద్యార్థుల వయస్సు సెప్టెంబర్ 1 నాటికి 17 ఏండ్లు పూర్తై ఉండాలన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం పర్మినెంట్, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది మొత్తం కలిపి 26 నుంచి 28 వేల మంది ఉన్నారు. 18,500 శానిటేషన్ వర్కర్లు, 950 సూపర్ వైజర్లు, 500 నుంచి 800 మంది ఆపరేటర్లు, 500 మంది జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, 400 మంది సూపరింటెండెంట్లు, సుమారు 100 మంది అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు, 20 మంది జాయింట్ కమిషనర్లు, 20 మంది మెడికల్ ఆఫీసర్లు, 30 మంది డిప్యూటీ కమిషనర్లు ఉన్నారు.
గ్రేటర్ జోన్లో UPSC పరీక్ష రాస్తున్న అభ్యర్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని గ్రేటర్ ఆర్టీసీ జోన్ ED వేంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం ఉదయం, మధ్యాహ్నం పరీక్ష రాసే అభ్యర్థులు సమయానికి పరీక్ష సెంటర్లకు వెళ్లేందుకు పూర్తిస్థాయిలో బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. బస్సుల సమాచారం, ఇతర వివరాల కోసం కోఠి 9959226160, రేతిఫైల్ బస్ స్టేషన్9959226154 సెంటర్లలో సంపద్రించవచ్చన్నారు .
SBI ఏటీఎంలోకి పాము చొరబడిన ఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పరిధిలో జరిగింది. స్థానికుల వివరాలు.. హయత్ నగర్ బొమ్మల గుడి ఎస్బీఐ ఏటీఎంలోకి పాము చొరబడింది. దీంతో ఏటీఎం సెంటర్లోకి డబ్బులను డ్రా చేసుకునేందుకు వచ్చిన కస్టమర్లు పామును చూసి భయాందోళన చెందారు. వెంటనే సిబ్బందికి తెలిపి అనంతరం స్నేక్ స్నాచర్కు సమాచారం అందించారు.
Sorry, no posts matched your criteria.