India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శనివారం 19వ భారత గౌరవ్ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రను 75 సంవత్సరాల వయసున్న దినేశ్ చుట్కే, 63 సంవత్సరాల వయసున్న సాధన చుట్కే ప్రారంభించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 716 మంది పర్యాటకులతో 100 శాతం ఆక్యుపెన్సీతో రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరినట్టు రైల్వే అధికారులు వెల్లడించారు.
MP ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని గతంలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీంతో HYD, ఉమ్మడి RRలో ఎవరికి మంత్రి పదవి వస్తుందనే చర్చ నడుస్తోంది. కంటోన్మెంట్ బైపోల్లో గెలిచిన శ్రీగణేశ్, ఇబ్రహీంపట్నం MLA మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి MLA రామ్మోహన్ రెడ్డి, షాద్నగర్ MLA వీర్లపల్లి శంకర్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీగణేశ్ గెలుపు, ఖైరతాబాద్ MLA దానం చేరికతో HYDలో కాంగ్రెస్ బలం 2కి చేరింది.
నేటి గ్రూప్-1 ప్రిలిమ్స్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. HYDలో 76, మేడ్చల్-105, రంగారెడ్డి-93, వికారాబాద్లో 13 సెంటర్ల చొప్పున ఏర్పాటు చేశారు. రాజధానిలో దాదాపు 1.70 లక్షల మంది పరీక్ష రాస్తున్నారు. అభ్యర్థుల కోసం కోఠి, రేతిఫైల్ బస్టాండ్లో హెల్ప్డెస్క్, రద్దీకి అనుగుణంగా సిటీ బస్సులను అందుబాటులో ఉంచినట్లు సజ్జనార్ తెలిపారు.
NOTE: 10:30AM నుంచి 1PM వరకు పరీక్ష ఉంటుంది.
ALL THE BEST
మేడ్చల్ PS పరిధిలో దారుణం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కిష్టపూర్లో ఒడిశా వాసి ఉంటున్నాడు. తన భార్య ఆరోగ్యం బాగోలేదని సహద్యోగి షేక్ మోసిన్(41)కు చెప్పుకున్నాడు. మంత్రం వేసి నయం చేస్తానని నమ్మించిన మోసిన్ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అందరూ బయటే ఉండాలి.. మంత్రం వేస్తానని చెప్పి గదిలో అత్యాచారం చేశాడు. అవమానంతో బాధితురాలు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఈ ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేశారు.
HYDలో వరుస హత్య ఘటనలు కలకలం రేపుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలాపూర్ సమీపంలోని మీర్పేట్ PS పరిధిలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద నందనవనం రౌడీ షీటర్ సల్మాన్(23) హత్యకు గురయ్యాడు. అయితే అర్ధరాత్రి అతడి సోదరి.. సల్మాన్కి కాల్ చేసి డబ్బులు ఇస్తానని అయ్యప్ప గుడి వద్దకు రమ్మని పిలిచింది. అక్కడే ఉన్న సూరి, అతడి స్నేహితులు కలిసి సల్మాన్ని గొంతు కోసి చంపేశారు. కేసు నమోదైంది.
HYDలో వరుస హత్య ఘటనలు కలకలం రేపుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలాపూర్ సమీపంలోని మీర్పేట్ PS పరిధిలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద నందనవనం రౌడీ షీటర్ సల్మాన్(23) హత్యకు గురయ్యాడు. అయితే అర్ధరాత్రి అతడి సోదరి.. సల్మాన్కి కాల్ చేసి డబ్బులు ఇస్తానని అయ్యప్ప గుడి వద్దకు రమ్మని పిలిచింది. అక్కడే ఉన్న సూరి, అతడి స్నేహితులు కలిసి సల్మాన్ని గొంతు కోసి చంపేశారు. కేసు నమోదైంది.
HYD కూకట్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బేగంపేట్లోని కుందన్ బాగ్లో నివాసం ఉంటున్న పరిణిత సంతానం కోసం ఐవీఎఫ్ చికిత్స చేయించుకునేందుకు మే 31న KPHB కాలనీలోని ప్రసాద్ ఆసుపత్రిలో చేరింది. వైద్యం వికటించి ఆమె మృతిచెందగా పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. విషయం బయట పడకుండా ఆస్పత్రి యాజమాన్యం గోప్యంగా ఉంచారు. కాగా విషయం ఈరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
HYD రామోజీ ఫిలిం సిటీలో ఈనాడు అధినేత రామోజీరావు పార్థివదేహానికి ఈరోజు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR నివాళులర్పించారు. ఈ సందర్భంగా KTR మాట్లాడుతూ.. రామోజీరావు మరణించడం చాలా బాధాకరమన్నారు. ఎంతో మందికి ఉపాధి కల్పించారని, మీడియా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తదితరులున్నారు.
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోకి కొందరు పేషంట్ సహాయకులు కల్లు, గుట్కా ప్యాకెట్లు లాంటి మత్తు పదార్థాలను తీసుకురావడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రి గేటు వద్ద సెక్యూరిటీ సిబ్బంది గాంధీ సందర్శకులను తనిఖీలు చేస్తూ నిషేధిత మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంటున్నారు. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. ఆసుపత్రిలోకి మత్తు పదార్థాలను తీసుకురావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈనాడు అధినేత రామోజీరావు మృతిచెందడం చాలా బాధాకరమని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఈరోజు HYD రామోజీ ఫిలింసిటీలో ఆయనకు హరీశ్రావు నివాళులర్పించి మాట్లాడారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. మీడియా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్రావు తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.