India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD మహానగరాభివృద్ధి సంస్థను బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం HMDA పరిధిలోని 7 జిల్లాల్లో 7228 చ.కి.మీ.ల వరకు ఉంది. దీన్ని ప్రాంతీయ వలయ రహదారి వరకు విస్తరించనున్నారు. మరికొన్ని ప్రాంతాలను HMDA పరిధిలోకి తీసుకురావడమే కాకుండా.. జోన్ల సంఖ్యను ఆరు లేదా ఎనిమిది చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. HMDAలో కీలకమైన ప్రణాళిక విభాగాన్ని బలోపేతం చేయనున్నారు. SHARE IT
HYD నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈరోజు ఉదయం నుంచి చేప మందు పంపిణీ కొనసాగుతోంది. ఈ క్రమంలో వివిధ రాష్టాల నుంచి భారీ ఎత్తున ప్రజలు చేప ప్రసాదం తీసుకునేందుకు తరలిరావడంతో గ్రౌండ్లో ఫుల్ రద్దీ నెలకొంది. వేలాది మంది తరలి రావడంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మీ తెలిపారు.
సైబర్ నేరగాళ్లు వాట్సాప్లో కాల్ చేసి బెదిరిస్తూ డబ్బులు కాజేస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.తాజాగా సికింద్రాబాద్కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి టెలికాం శాఖ నుంచి మాట్లాడుతున్నామంటూ ఓ వాట్సాప్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి మాట్లాడుతూ..మనీలాండరింగ్ కేసులో మీ పై కేసు నమోదైందని, మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి రూ.10లక్షలు ఇవ్వాలని బెదిరించగా డబ్బు పంపి బాధితుడు మోసపోయాడు.
HYD పటాన్చెరు పరిధి <<13398885>>అమీన్పూర్ లేక్లో పడి<<>> మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే. సాయిరాం హిల్స్లో ఉంటున్న జయశ్రీ(25), రవిజేత దంపతులు.. గొడవల కారణంగా JANలో విడాకులకు అప్లై చేశారు. దీంతో ఆమె పిఠాపురంలోని పుట్టింటికి వెళ్లింది. గత నెల 26న రవి తండ్రి మృతిచెందడంతో ఆమె తిరిగొచ్చింది. శుక్రవారం భర్త, కూతురి(4)తో కలిసి వెళ్లిన ఆమె చెరువులో పడి చనిపోయింది. మిస్టరీ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మరణంపై టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ ఛైర్మన్, HYD ఎల్బీనగర్ నియోజకవర్గ నేత మధుయాష్కి గౌడ్ తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. పత్రికా, మీడియా రంగంలో రామోజీరావు చెరగని ముద్ర వేశారని, జర్నలిజంలో నూతన ఒరవడికి బాటలు వేసి.. అందరూ అనుసరించేలా మార్గదర్శి అయ్యారని తెలిపారు. ఆయన మరణం మీడియా రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు.
ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు మృతిపై HYD ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు రాష్ట్రాల్లో తీరని లోటు అని పేర్కొన్నారు. అతి సామాన్య కుటుంబంలో పుట్టి పత్రిక, మీడియా, టెలివిజన్ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగి తెలుగు జాతికి రామోజీరావు గర్వకారణంగా నిలిచారని గుర్తు చేశారు. రామోజీ రావు జీవితం అత్యంత నిబద్ధత, క్రమశిక్షణ పట్టుదలతో బతికిన వ్యక్తి అని అన్నారు.
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు నిర్వహించేందుకు ఉత్తర్వులు ఇస్తూ గత సంవత్సరం మల్టీ జోన్-1లో బదిలీ పొంది పలువురు ఉపాధ్యాయులు రిలీవ్ కాలేదు. వారిని రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని HYD సెక్రటేరియట్లో PRTU తెలంగాణ అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయుల ఆర్థికపరమైన పెండింగ్ సమస్యలు కూడా త్వరగా పరిష్కారమయ్యేలా చొరవ చూపాలని కోరారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆరో స్నాతకోత్సవం జూన్ 10న జరగనుంది. రాజేంద్రనగర్లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు ఇది జరుగుతుందని వ్యవసాయ శాఖ కార్యదర్శి, APC, PJTSAU ఇన్ఛార్జి ఉపకులపతి ఎం.రఘునందన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్, పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, విశ్వవిద్యాలయ కులపతి C.P రాధాకృష్ణన్ అధ్యక్షతన ఈస్నాతకోత్సవం జరుగుతుందని తెలిపారు.
పోలీసులు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ పతకాలు సాధించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి సూచించారు. కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తూ ఉత్తమ ప్రతిభ చూపిన సిబ్బందికి శుక్రవారం కమిషనరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో సీపీ పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ.. సేవా పతకాలను అందుకున్న సిబ్బందిని అభినందించారు. 75 మంది పోలీస్ సిబ్బందికి పతకాలు అందజేసినట్టు తెలిపారు.
తెలంగాణలో వరి సాగు గణనీయంగా పెరుగుతోందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ సోనా రకం బహుళ ప్రాచుర్యం పొందిందని తెలిపారు. శుక్రవారం HYDలోని తాజ్కృష్ణ హోటల్లో ప్రపంచ వరి సదస్సు-2024ను తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సదస్సులో 30 దేశాల నుంచి 150 మంది ఎగుమతిదారులు , దిగుమతిదారులు , శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.