RangaReddy

News June 3, 2024

HYD: పాలిసెట్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు

image

పాలిసెట్ ఫలితాల్లో రాజధాని విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. HYDలో 10,095 మంది పరీక్ష రాయగా..84.40% ఎంపీసీ, 80.73% బైపీసీ, RR జిల్లాలో మొత్తం 4,103 మంది పరీక్ష రాయగా.. 86.74% ఎంపీసీ, 83.55% బైపీసీ, మేడ్చల్ జిల్లాలో మొత్తం 4,267 మంది పరీక్ష రాయగా.. 91.74% ఎంపీసీ, 84.09% బైపీసీ, VKB జిల్లాలో మొత్తం 1145 మంది పరీక్ష రాయగా..86.99% ఎంపీసీ, 85.59% బైపీసీలో ఉత్తీర్ణత సాధించినట్లుగా అధికారులు వెల్లడించారు.

News June 3, 2024

BREAKING: గోల్కొండ బోనాల జాతర తేదీల ప్రకటన

image

భాగ్యనగర్ శ్రీమహంకాళి బోనాల జాతర ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులు ఈరోజు మాట్లాడారు. ఈ ఏడాది HYD గోల్కొండలో ఆషాఢ మాసం బోనాల జాతరను జులై 7వ తేదీన ప్రారంభించనున్నామని తెలిపారు. ఇక పాతబస్తీలోని లాల్‌దర్వాజ సహా అన్ని ఆలయాల్లో జులై 19న ఉత్సవాలు ప్రారంభమవుతాయని, జులై 28న బోనాలు సమర్పిస్తామని చెప్పారు. 29వ తేదీన జాతర, సామూహిక ఘటాల ఊరేగింపు ఉంటుందని వెల్లడించారు. SHARE IT

News June 3, 2024

FLASH: HYDలో మరోసారి డ్రగ్స్ కలకలం  

image

HYDలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. ఫిలింనగర్ PS పరిధిలో ఓ డ్రగ్స్ విక్రేతను అరెస్ట్ చేశామని, 16 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. కొకైన్ అమ్ముతూ నైజీరియా దేశస్థుడు ఒకొరియో కాస్మోస్ అలియాస్ ఆండీ పట్టుబడ్డాడని తెలిపారు. అతడు నగరంలో పలువురు యువకులకు రెగ్యులర్‌గా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News June 3, 2024

HYD: రేపు మద్యం దుకాణాలు బంద్: సీపీ

image

లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మంగళవారం రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మల్కాజిగిరి, ఎల్బీనగర్ జోన్ పరిధిలో మద్యం దుకాణాలు మూసివేస్తారని సీపీ తరుణ్ జోషి తెలిపారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News June 3, 2024

HYD: కోడ్ ముగియగానే జీరో బిల్లుల జారీ..! 

image

HYD, ఉమ్మడి RRలో అర్హులైన విద్యుత్ వినియోగదారులకు ఈనెల 6 నుంచి గృహజ్యోతి పథకం అమల్లోకి రానుంది. సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగియగానే బిల్లులు జారీ చేయాలని డిస్కం నిర్ణయించింది. 200 యూనిట్లలోపు వినియోగదారులకు సున్నా బిల్లు జారీ చేయనున్నారు. మిగతా వారికి ఈనెల 1 నుంచే బిల్లింగ్ ప్రక్రియ మొదలుకాగా, పథకానికి దరఖాస్తు చేసుకున్నవారికి కోడ్ ముగియగానే సున్నా బిల్లు జారీ చేస్తామని అధికారులు తెలిపారు.

News June 3, 2024

రేపే RESULTS.. మల్కాజిగిరి ఎంపీ ఎవరు..?

image

లోక్‌సభ ఎన్నికలు ఫలితాలు రేపే వెలువడనుండడంతో మల్కాజిగిరి ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్‌రెడ్డి, BJP నుంచి ఈటల రాజేందర్ పోటీలో ఉన్నారు. కాగా BRS, BJP మధ్య పోటీ ఉంటుందని పలువురు అంటుండగా BRS, కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని మరికొందరు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు కావడంతో ఈ స్థానం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

News June 3, 2024

ఉప్పల్ శిల్పారామంలో ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు 

image

వారంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఉప్పల్‌లోని మినీ శిల్పారామంలో పేరణి ఆంధ్ర నాట్యం, కూచిపూడి కళాకారులు ప్రదర్శనలు నిర్వహించారు. వాగ్దేవి ఆర్ట్స్ అకాడమీ గురువు పవన్, సంధ్య ఆధ్వర్యంలో పేరణి, ఆంధ్ర నాట్య అంశాలను కళాకారులు ప్రదర్శించారు. వినాయక కౌతం, మెలప్రాప్తి, శబ్దపల్లవి, శృంగనర్తనం, కుంభ హారతి, జయజయోస్తు తెలంగాణ, తిల్లాన, మామవతు, శ్రీ సరస్వతి, హారతి అంశాలను కళాకారులు ప్రదర్శించారు.

News June 3, 2024

HYD: పోలీసుల భారీ బందోబస్తు

image

లోక్‌‌సభ ఎన్నికల ఫలితాలు రేపు వెలువనుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాలు మోహరించి చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ కౌంటింగ్ సెంటర్లను 24/7 నిఘా నేత్రాలతో పర్యవేక్షణ చేస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర, రాష్ట్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.

News June 3, 2024

HYD: విశేషంగా ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు

image

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం మాదాపూర్ శిల్పారామంలో ఏర్పాటు చేసిన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ ప్రదర్శనలు కళా ప్రియులను అలరించాయి. నాట్య గురువుల విద్యారావు, స్మితా మాధవ్, అర్చన మిశ్రా, సౌందర్యకౌశిక్ శిష్య బృందాలు చక్కటి హావ భావాలతో లయాత్మకంగా నృత్యం చేసిన తీరు నయనానందకరంగా సాగింది.

News June 3, 2024

శేరిలింగంపల్లిలో అత్యధికంగా 23 రౌండ్ల లెక్కింపు

image

చేవెళ్ల లోక్‌సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వీటి పరిధిలో మొత్తం 29,38,370 మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా చేవెళ్లలో 71.83% పోలింగ్ నమోదు కాగా… అతి తక్కువ శేరిలింగంపల్లిలో 43.91 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 23 రౌండ్ల చొప్పున ఓట్ల లెక్కింపు ఉంటుందని కలెక్టర్ శశాంక తెలిపారు.