RangaReddy

News June 1, 2024

కంటోన్మెంట్ ఉప ఎన్నిక.. 17 రౌండ్లలో లెక్కింపు

image

కంటోన్మెంట్ ఉపఎన్నిక‌ కౌంటింగ్‌ కోసం అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గం ఉండడంతో ఈవీఎంలను కూడా మేడ్చల్ జిల్లా పరిధి లెక్కింపు కేంద్రానికి తరలించారు. ఉప ఎన్నిక కౌంటింగ్‌లో భాగంగా మొత్తం 17 రౌండ్ల‌లో లెక్కింపు ఉంటుందని రొనాల్డ్ రాస్ శనివారం తెలిపారు. ఈ ఫలితాన్ని కంటోన్మెంట్ బోర్డు CEO పర్యవేక్షించనున్నారు.

News June 1, 2024

ప్రమాదంలో చిలకలగూడ పోలీస్ స్టేషన్

image

చిలకలగూడ పోలీస్ స్టేషన్​ భవనం శిథిలావస్థకు చేరుకుంది. సెల్లార్‌తో పాటు పిల్లర్లు, స్లాబ్​, కిటికీల పెచ్చులు ఊడి కింద పడుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. PS భవనం ఎప్పుడు కుప్ప కూలుతుందోనని అటు పోలీస్​ సిబ్బంది, ఇటు సందర్శకులు బిక్కు, బిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. భవనం ఖాళీ చేయాలని GHMC పలుమార్లు నోటీసులిచ్చినా ఉన్నతాధికారులు స్పందించకపోవడం గమనార్హం.

News June 1, 2024

రంగారెడ్డి: కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం

image

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని బండారి శ్రీనివాస్ కాలేజీలో కౌంటింగ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి శశాంక.. వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతితో కలిసి పరిశీలించారు. అనంతరం కౌంటింగ్ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కౌంటింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

News June 1, 2024

SURVEY RESULTS: హైదరాబాద్‌ MIMదే..!

image

హైదరాబాద్ పార్లమెంట్ స్థానం MIMదే అని సర్వేలన్నీ తేల్చి చెప్పాయి. ఇక్కడ MIM నుంచి అసదుద్దీన్ ఒవైసీ పోటీ చేశారు. BJP నుంచి మాధవీలత, BRS నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి మహమ్మద్ సమీర్ పోటీలో ఉన్నారు. కాగా తొలుత MIM, BJPకి పోటాపోటీ ఉంటుందని చర్చ నడవగా తాజాగా విడుదలైన అన్ని సర్వేల్లో MIMదే విజయమని అంచనా వేశాయి. దీనిపై మీ కామెంట్?

News June 1, 2024

AARA SURVEY: సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి BJPవే..!

image

సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాలు BJPవే అని ఆరా మస్తాన్ సర్వే తేల్చి చెప్పింది. చేవెళ్లలో BRS నుంచి కాసాని, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, BJP నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేశారు. మల్కాజిగిరిలో BRSనుంచి రాగిడి, కాంగ్రెస్ నుంచి సునీత, BJPనుంచి ఈటల పోటీలో ఉన్నారు. సికింద్రాబాద్‌లో BRS నుంచి పద్మారావు, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, BJPనుంచి కిషన్ రెడ్డి పోటీలో ఉన్నారు.

News June 1, 2024

HYD: ‘తెలంగాణ పునర్నిర్మాణానికి మనందరం కృషి చేయాలి’

image

తెలంగాణ పునర్నిర్మాణానికి మనందరం కృషి చేయాలని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత అధ్యాపకుడు, ప్రొఫెసర్ జి.హరగోపాల్ ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులకి పిలుపునిచ్చారు. రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో ఈరోజు నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

News June 1, 2024

ఉప్పల్ శిల్పారామంలో ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు

image

ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శనివారం నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. వినాయక కౌతం, తక్కువేమి మనకు, రామకోదండ రామ, శ్రీమన్నారాయణ, పలుకే బంగారమయేహ్న, వినరో భాగ్యం, వింతలు వింటివా యశోద, నాటకరంజిని పదవర్ణం, త్యాగరాజ కీర్తన అంశాలను లక్ష్మీప్రియా, సహస్ర, వైష్ణవి, రిధి, నిహారిక, హిరణ్య, ఈషా, సాన్విక, అధిత్రి, వైద్య, సంకీర్త్ ప్రదర్శించారు.

News June 1, 2024

HYD: పుణ్య క్షేత్రాలకు వెళ్లేందుకు సువర్ణ అవకాశం

image

సికింద్రాబాద్ నుంచి దివ్య దక్షిణ యాత్ర పేరిట ప్రత్యేక రైలు జూన్ 22వ తేదీన అందుబాటులో ఉంటుందని IRCTC తెలిపింది. ఒక వ్యక్తికి రూ.14,250 ఛార్జి ఉంటుందని, అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, తిరువనంతపురం, తంజావూరు లాంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చని పేర్కొంది. ఆసక్తి ఉంటే https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCZBG25 లింక్ ద్వారా బుక్ చేసుకోవాలని తెలిపింది. SHARE IT

News June 1, 2024

HYD: వైభవంగా వేడుకలు నిర్వహిస్తాం: మంత్రులు

image

రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకల ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు ఈరోజు పరిశీలించారు. 10వ ఆవిర్భావ వేడుకలను వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో MLA దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి, MP అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ శ్రీలత, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

News June 1, 2024

BREAKING: HYD: యువతి ఆత్మహత్య

image

పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. నల్గొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన సంగీత(24) తన సోదరుడితో కలిసి HYD వచ్చింది. మేడ్చల్‌లోని రాఘవేంద్ర నగర్ కాలనీలో ఉంటూ గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలో ఒత్తిడికి గురైన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని చనిపోయింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి కేసు నమోదు చేశారు.