India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బజార్ ఘాట్లోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ భవన్లో సింగరేణి కార్మికుడు, ప్రముఖ కవి, సినీగేయ రచయిత, కాళోజీ అవార్డు గ్రహీత, తెలంగాణ ఉద్యమకారుడు జయరాజు పదవీ విరమణ జరిగింది. ఈ పదవీ విరమణ సభకు ముఖ్యఅతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని అభినందనలు తెలిపారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు శాలువాతో సన్మానించారు.
ప్రధాని మోదీ భేటీలో HYD అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలను ప్రస్తావించారు.
☞ నగరంలో మెట్రో రైల్ ఫేజ్-IIకు అనుమతించాలి.
☞ మూసీ పునరుజ్జీవానికి కేంద్రం సాయం చేయాలి.
☞ RRRకు అనుమతులు, ఆమోదం ఇవ్వాలి.
☞ మూసీ, గోదావరి అనుసంధాననికి రూ.2వేల కోట్లు కావాలి.
నిన్న మహా శివరాత్రిని పురస్కరించుకుని HYD శివనామస్మరణతో తరించింది. త్రేతాయుగంలో వానర సేన హనుమ, శ్రీ రాముడు ప్రతిష్ఠించిన కీసరలోని శివలింగం వద్ద అద్భుతం జరిగింది. భోళాశంకరుడికి భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని తిన్న వానరాలు.. వాటి కడుపునింపినందుకు ధన్యవాదాలు తెలుపుతూ శివయ్యను మొక్కుతున్నట్లు ఉన్న ఈ ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. వాటి సేనాని, ఆరాధ్య దైవం ప్రతిష్ఠించిన లింగం వద్ద సందడి చేశాయి.
పండగపూట లంగర్హౌస్ చెరువులో <<15590306>>తండ్రీ కొడుకులు<<>> మృతిచెందిన విషయం తెలిసిందే. వారు చనిపోవడానికి ముందు జరిగిన పరిణామాలు స్థానికులు చెబుతుంటే కలవరపెడుతున్నాయి. కొడుకును భుజాన ఎత్తుకుని మునిగిపోతూ అధికారులు, సిబ్బందిని రక్షించమని వేడుకున్నా.. వారు స్పందించకుండా సాయం కావాలని స్థానిక నాయకులకు ఫోన్ చేసి అడిగారని ప్రత్యక్షసాక్షులు వాపోయారు. వారు సాయం అందించుంటే ఇద్దరూ బతికుండేవారని బాధిత కుటుంబం రోదించింది.
ప్రేమపేరుతో వేధిస్తున్న ఉపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించిన ఘటన ఆదిభట్ల PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. నాదర్గుల్లోని ఓ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బాలికను ప్రేమపేరుతో వేధిస్తూ.. అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాలిక తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు ఆదిభట్ల PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి అతడిని రిమాండ్కు తరలించారు.
శివరాత్రికి శివుడిని ఎంత ఇష్టంగా కొలుస్తారో.. అంతే ఇష్టంగా జాగరణలో చేస్తారు. HYDలో అనేక చోట్ల యువత కోసం రాత్రంతా క్రికెట్, వాలీబాల్ టోర్నమెంట్లు ఏర్పాట్లు చేశారు. పెద్దలు స్వామి వారిని.. సంకీర్తనలు, భజనతో స్మరించుకుంటూ జాగరణ పూర్తి చేశారు. కానీ గతంలో మన ఊళ్లల్లో వేసే పద్య, పౌరాణిక, జానపద నాటకాలకు పెద్ద ఫ్యాన్ బేస్ ఉండేది. చిన్నతనంలో పదాలు అర్థం కాకపోయినా చూస్తూ కూర్చునేవాళ్లం. మీరెలా జాగరణ చేశారు.
HYD, MDCL, RR జిల్లావాసులు ఒత్తిడికి గురవడం, మానసికంగా ఆవేదన చెందడం వంటి సమస్యలను ఎదుర్కొంటే టెలీ మానస్ హెల్ప్లైన్ 14416కు కాల్ చేయాలని ఉప్పల్ పీహెచ్సీ డాక్టర్ సౌందర్యలత తెలిపారు. నిష్ణాతులైన వైద్యులు సలహాలు సూచనలు అందజేస్తారు. మీ పిల్లల ప్రవర్తనలో ఏవైనా మానసిక తేడాలు గుర్తించినా కాల్ చేయొచ్చన్నారు. మానసిక సంబంధిత అంశాలన్నింటికి పరిష్కారం ఉంటుందని, ఈ విషయాన్ని అందరికీ తెలపాలని కోరారు.
#SHARE IT.
ఆమనగల్ వ్యవసాయ మార్కెట్ ప్రహరీ నిర్మాణానికి మోక్షం లభించడం లేదు. నాలుగు మండలాలకు కూడలిగా ఉన్న ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్కు ప్రతినిత్యం వందల సంఖ్యల రైతులు వస్తుంటారు. ఆమనగల్ గుర్రం గుట్ట కాలనీ వైపు గల ప్రహరీ కూలడంతో ప్రతినిత్యం పందులు, మార్కెట్లోకి స్వైర విహారం చేస్తున్నాయి. ప్రహరీ కూలిన ప్రదేశంలో మినీ డంపింగ్ యార్డ్ తలపిస్తోంది. ఇప్పటికైనా ప్రహరీ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
రంజాన్ పర్వదినాలలో భాగంగా హలీం విక్రయదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి వెస్టిజోన్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు వివిధ సర్కిళ్లకు చెందిన హలీం విక్రయదారులందరితో సమావేశాన్ని ఏర్పాటు చేసి హలీం తయారీలో తీసుకోవాల్సిన పరిశుభ్రత చర్యలు, వాటిని సజావుగా పంపిణీ చేయటంపై పలు అంశాలను వ్యాపారులకు సూచించారు.
మన జిల్లాలో ప్రసిద్ధ శివాలయాలు. 11వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యరాజు 6వ విక్రమాదిత్యుడు శంకర్పల్లిలో మరకత లింగాన్ని ప్రతిష్ఠించారని శాసనం చెబుతోంది. జ్యోతిర్లింగాల్లో ఒక్కటైన వైద్యనాథుడిని పోలి..ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. త్రేతాయుగంలో 101 లింగాలను కాశీ నుంచి ఆంజనేయుడు తీసుకురాగా..రాముడు కీసరలో ప్రతిష్ఠించాడు. షాద్నగర్ సమీపంలోని రాయకల్లో శ్రీరాముడు లింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి.
Sorry, no posts matched your criteria.