RangaReddy

News August 25, 2024

HYD: వినాయకచవితికి పటిష్ట చర్యలు: సీపీ

image

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి శనివారం బంజారాహిల్స్ పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో మూడు కమిషనరేట్స్ పరిధిలోని ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులు, గణేశ్ ఉత్సవ్ సమితి, ఖైరతాబాద్ ఉత్సవ్ సమితి, పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయకచవితి ఉత్సవాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టాలని పలు సూచనలు చేశారు

News August 25, 2024

HYD: 75 ఏళ్ల వయసులో దేశభక్తి చాటుతూ.. బైక్‌ రైడ్‌

image

ఈయన పేరు శివన్‌కుట్టి.. రిటైర్డ్‌ ఆర్మీ అధికారి. వయస్సు 75 ఏళ్లు. ఈ వయస్సులోనూ సాహసోపేత బైక్‌ రైడ్‌ చేపట్టి ఈ తరం యువతకు తానేం తక్కువ కాదని నిరూపించారు. హైదరాబాద్‌ టూ లడఖ్‌.. లడఖ్‌ టూ కన్యాకుమారి, హైదరాబాద్‌ ఇలా సోలో బైక్‌ రైడ్‌తో దేశభక్తి చాటుతూ.. జాతీయ జెండాను రెపరెపలాడించారు. ఈ ఏడాది మే 26న నా యాత్ర ప్రారంభమై.. జూలై 20న ముగిసింది. 55 రోజుల్లో 8,826 కిలోమీటర్ల మేర యాత్ర చేశారు.

News August 25, 2024

HYD: ‘క్యూలైన్ తిప్పలు వద్దు..UTS యాప్ ముద్దు’

image

HYD, RR, MDCL,VKB జిల్లాలో ఉంటున్న ప్రజలకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. ‘క్యూలైన్ తిప్పలు వద్దు.. UTS యాప్ ముద్దు’ అని తెలిపారు. ఇటీవల రైల్వే స్టేషన్లలో వందల సంఖ్యలో ప్రయాణికులు క్యూలైన్లో నిలబడి టికెట్లు తీసుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఎలాంటి ఇబ్బంది లేకుండా UTS మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.

News August 25, 2024

HYD: కల్తీ కల్లు దుకాణాలను మూసేయాలి: ఎంపీ

image

VKB జిల్లాలో కల్తీకల్లు తాగి ఒకరు మృతి చెందారని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇదిలా ఉండగా.. ఆసుపత్రిలో ఉన్న 60 మంది పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. గత పది ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారు రసాయన కల్లుకు బానిసయ్యారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రసాయన కల్తీ కల్లు దుకాణాలను మూసేయాలన్నారు.

News August 24, 2024

RR:ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉంది:జానీ
✓HYD:ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ దానం అంతంతే!
✓తార్నాక: ఆర్టీసీ బాధితులకు రూ.1.15 కోట్ల చెక్కు
✓HYD: ట్రాఫిక్ ఉల్లంఘన పై 28% పెరిగిన జరిమాణాలు
✓డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుపడ్డ వారికి 2 రోజులు ట్రాఫిక్ డ్యూటీ
✓జగద్గిరిగుట్ట: నవ వధువు మనిషా ఆత్మహత్య
✓ఉప్పల్: మూడో ఫ్లోర్ నుంచి దూకి యువకుడు ఆత్మహత్య

News August 24, 2024

HYD: ఇక 40 ఏళ్ల వరకు డోకా లేదు: కేంద్ర మంత్రి

image

HYD నగరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధిపై రైల్వే సహాయక మంత్రి రవ్‌నీత్‌సింగ్ బిట్టు మీడియాతో మాట్లాడారు. పునరాభివృద్ధి అనంతరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తే, 40 ఏళ్ల వరకు ఎలాంటి డోకా ఉండదన్నారు. రాబోయే 40 ఏళ్ల ప్రయాణికుల సామర్థ్యాన్ని అంచనా వేసి, డిజైన్ చేసి పనులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రోగ్రాంలో GM అరుణ్ కుమార్ జైన్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

News August 24, 2024

HYD: బాధితులకు రూ.1.15 కోట్ల చెక్కు అందజేత

image

ఉద్యోగులకు ఆర్టీసీ సంస్థ అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరెంట్ షాక్‌తో మరణించిన వరంగల్-2 డిపోకు చెందిన డ్రైవర్ మెరుగు సంపత్ కుటుంబ సభ్యులకు రూ.1.15 కోట్ల విలువగల ప్రమాద బీమా చెక్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం బాగ్‌లింగంపల్లిలో అందజేశారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ. సజ్జనర్, యూనియన్ బ్యాంక్ డిప్యూటీ జోనల్ హెడ్ అరుణ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.

News August 24, 2024

HYD: కాలేయ మార్పిడి కోసం ఎదురుచూపులు..!

image

HYD నగరంలోని ఉస్మానియా, గాంధీ, NIMS ఆస్పత్రుల్లో కాలేయ మార్పిడి కోసం రోగులు ఏళ్లుగా వేచి చూస్తున్నారు. లాస్ట్ స్టేజ్ సిరోసిస్ లాంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి కాలేయ మార్పిడే చివరి ఆశ. ఉస్మానియాలో కాలేయ మార్పిడి కోసం వందల మంది వేచి చూస్తున్నారు. కాలేయ మార్పిడి జరిగితే తప్ప బతకడం కష్టమని రోగుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News August 24, 2024

BREAKING: HYD: నవ వధువు ఆత్మహత్య

image

జగద్గిరిగుట్ట PSపరిధి రిక్షా పుల్లర్ కాలనీలో విషాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. యువతి మనీషాను ప్రేమించి, పెద్దల అనుమతితో జులై 10న ఆర్య సమాజ్‌లో యువకుడు శేఖర్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందే మరో యువతితో శేఖర్‌కు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. వరకట్న వేధింపులతో ఈనెల 11న మనీషా యాసిడ్ తాగింది. చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందింది. శేఖర్ అల్వాల్ PSలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

News August 24, 2024

HYD: నిబంధనల ఉల్లంఘన.. 28% పెరిగిన జరిమానాలు!

image

HYDలో సెల్ ఫోన్ డ్రైవింగ్, రాంగ్ డ్రైవింగ్, నో పార్కింగ్, అర్హత లేకుండా డ్రైవింగ్ లాంటివి చేసిన వారిపై గత సంవత్సరం 14.2 లక్షల మంది పై మాత్రమే కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది మే వరకు 18.15 లక్షల మంది పై కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే దాదాపుగా 28% జరిమానాలు పెరిగినట్లు పేర్కొన్నారు. రోడ్లపై డ్రైవింగ్ చేసేవారు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.