RangaReddy

News June 1, 2024

FLASH: HYD: డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ అరెస్ట్

image

HYDలో పలువురికి డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ నైజీరియన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపిన వివరాలు.. నైజీరియా దేశానికి చెందిన కాస్మోస్ రాంసి అలియాస్ ఆండి బిజినెస్ వీసాపై 2014లో భారతదేశానికి వచ్చాడు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చి డ్రగ్స్ పెడ్లర్‌గా మారాడు. టెలిగ్రామ్ ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్న రాంసిని అరెస్టు చేసి 16 గ్రా. కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.

News June 1, 2024

పదేళ్లు: హైదరాబాద్‌లో పెను మార్పు!

image

TG ఏర్పాటైన‌ పదేళ్లలో ప్రపంచ నగరాలతో‌ HYD పోటీ పడిందని చెప్పొచ్చు. వరల్డ్‌ గ్రీన్‌ సిటీ అవార్డ్‌ (2022) గెలుచుకోవడం ఇందుకు నిదర్శనం. HYD‌లో జరిగిన కీలక ఘట్టాలు.. 1. మెట్రో‌ ప్రారంభం, 2. SRDP‌తో 36 ఫ్లై ఓవర్లు, 3. ట్యాంక్‌బండ్, HMDA పార్కుల సుందరీకరణ, 5. కేబుల్ బ్రిడ్జి, 6. IT కారిడార్‌, 7. నూతన సెక్రటేరియట్, 8. అమరవీరుల స్తూపం, 9. అంబేడ్కర్ విగ్రహం, 10. SNDP పనులు. ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి.

News June 1, 2024

హైదరాబాద్‌లో ఎగ్జిట్‌ పోల్స్‌ ఎటువైపు?

image

లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ నేడు ముగియనుండడంతో‌ అందరి చూపు ఎగ్జిట్‌ పోల్స్‌పై పడింది. గత MP ఎన్నికల్లో‌ రాజధాని ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. హైదరాబాద్‌లో (MIM), సికింద్రాబాద్(BJP), మల్కాజిగిరి(INC), చేవెళ్ల(BRS)ని గెలిపించుకొన్నారు. ప్రస్తుతం రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఇక సాయంత్రం 6.30 తర్వాత వెలువడే ఎగ్జిట్ పోల్స్‌ ఎవరివైపు అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.

News June 1, 2024

హైదరాబాద్‌: CM రేవంత్ ఆహ్వానం.. KCR వస్తారా?

image

రేపు HYD పరేడ్‌ గ్రౌండ్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో సోనియా గాంధీ, ఉద్యమకారులు, అమరుల కుటుంబీకులను భాగస్వాములను చేయాలని‌ కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. ఉద్యమంలో KCR కీలకం కావడంతో CM రేవంత్ ఆయనకూ ఆహ్వానం పంపారు. శుక్రవారం ప్రభుత్వ ప్రోటోకాల్ ఛైర్మన్‌ హర్కర వేణుగోపాల్ ఇన్విటేషన్ అందించారు. మరి CM పిలుపుతో KCR వస్తారా? లేదా? అనేది హాట్‌ టాపిక్‌గా మారింది.

News June 1, 2024

హైదరాబాద్‌‌లో ACB తగ్గేదేలే!

image

HYDలో ACB మెరుపుదాడులు కొనసాగిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే‌ 8 మందికి చెక్ పెట్టింది. లంచం తీసుకొంటున్న ఇరిగేషన్‌ శాఖ AE భన్సీలాల్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్స్‌ కార్తీక్‌, నిఖేష్‌కుమార్‌తో పాటు సర్వేయర్‌ గణేశ్‌ను పట్టుకొంది. కుషాయిగూడ PSలో రూ. 3 లక్షలు డిమాండ్ చేసిన CI వీరాస్వామి, SI షఫీ ఆట కట్టించింది. గొర్రెల పంపిణీ స్కాం విచారణలో భాగంగా మాజీ మంత్రి OSDతో పాటు మరో అధికారిని ACB అరెస్ట్ చేయడం విశేషం.

News May 31, 2024

గచ్చిబౌలి‌ విప్రో సర్కిల్ వద్ద రోడ్డు ప్రమాదం

image

గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. గౌలిదొడ్డి నుంచి గచ్చిబౌలి వైపు వస్తోండగా బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్టూడెంట్స్ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతులు నవీన్ రెడ్డి(22), హరీశ్ చౌదరి(22)గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 31, 2024

HYD: మైనర్‌ను గర్భవతిని చేసిన యువకుడు

image

చేవెళ్లలో దారుణం చోటు చేసుకుంది. చేవెళ్లకు చెందిన పదోతరగతి విద్యార్థినిని ఓ వ్యక్తి గర్భవతిని చేశాడు. అబార్షన్ చేయించడంతో గాంధీలో ప్రాణాపాయ స్థితిలో విద్యార్థిని కొట్టుమిట్టాడుతుంది. విద్యార్థిని తండ్రి బుచ్చయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా సుదర్శన్ అనే వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు సుదర్శన్‌కు వివాహం కాగా.. ఓ కుమారుడు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 31, 2024

సమాజ నిర్మాణంలో తుమ్మబాల ఎనలేని సేవలు: సీఎం

image

సమాజ నిర్మాణంలో తుమ్మబాల ఎనలేని సేవలు అందించి శాంతి, మతసామరస్యం, విద్యను ప్రజలకు అందించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా తుమ్మబాలతో నాకు ప్రత్యేక అనుబంధం ఉందని 2019 ఎంపీ ఎన్నికల్లో, 2023 శాసనసభ ఎన్నికల్లో వారు మమ్మల్ని మంచి మనసుతో ఆశీర్వదించారు. ఆయన మరణం వారి అభిమానులకు తీరని దుఃఖాన్ని మిగిల్చిందని పేర్కొన్నారు.

News May 31, 2024

HYD: స్పా సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలు

image

స్పా సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. నిర్వాహకులు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12లోని ఓ అపార్ట్‌మెంట్లో స్పా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నలుగురు మహిళలను పోలీసులు రైడ్స్ చేసి అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.

News May 31, 2024

BREAKING.. HYD: నీటిపారుదల శాఖలో ఏసీబీ రైడ్స్, ముగ్గురి అరెస్టు

image

ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు ఏసీబీ అధికారులు వివిధ శాఖలపై రైడ్స్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాంపల్లిలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అదేవిధంగా రెడ్ హిల్స్‌లో ఉన్న రంగారెడ్డి జిల్లా పర్యవేక్షక ఇంజినీరింగ్ శాఖలో రాత్రి నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బన్సీలాల్, ఇల్లు కార్తీక్, నికేష్ అధికారులకు పట్టుపడ్డారు.