RangaReddy

News May 31, 2024

HYD: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల రిహార్సల్స్‌.. ట్రాఫిక్‌ ఆంక్షలు

image

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల రిహార్సల్స్‌ సందర్భంగా గన్‌పార్క్‌, పరేడ్‌ గ్రౌండ్స్‌, ట్యాంక్‌బండ్‌ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై శుక్రవారం ఆంక్షలుంటాయని పోలీస్‌ అధికారులు తెలిపారు. గన్‌పార్క్‌ పరిసరాల్లో ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, పరేడ్‌ గ్రౌండ్స్‌ వద్ద ఉదయం 10నుంచి 11 గంటల వరకు, ట్యాంక్‌బండ్‌పై రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలుంటాయన్నారు.

News May 31, 2024

రంగారెడ్డి: జిల్లాలో విత్తనాల కొరత లేదు: కలెక్టర్

image

RR జిల్లాలో పత్తి, పచ్చిరొట్ట విత్తనాల కొరత లేదని కలెక్టర్ శశాంక అన్నారు. గురువారం కలెక్టరేట్ లో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి గీతారెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం తరఫున రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, అగ్రో రైతు సేవ కేంద్రాల్లో రైతులకు అందజేస్తారని తెలిపారు. మేలు రకం పత్తి విత్తనాలు ప్రైవేటు డీలర్ల ద్వారా అందుబాటులో ఉంటాయన్నారు.

News May 31, 2024

ఉద్యమానికి ఊపిరి ‘భాగ్యనగరం’

image

ప్రజల బలిదానాలు, అనేక మంది పోరాటాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. రాష్ట్రం ఏర్పడి పదేళ్లయినా ఇప్పటికీ నగరంలోని పలు ప్రాంతాలు ఆనాటి ఘటనలను గుర్తుచేస్తుంటాయి. 2009నవంబర్ 9న LBనగర్ చౌరస్తాలో శ్రీకాంతచారి బలిదానం, 2010జనవరి 3న OUలో విద్యార్థి మహాగర్జన, 2011మార్చి 10న HYDలో మిలియన్ మార్చ్, 2011సెప్టెంబర్ 13న ప్రారంభించిన సకలజనుల సమ్మె మలిదశోద్యమంలో ఓ మైలురాయిగా నిలిచింది.

News May 31, 2024

కాంగ్రెస్ కుట్రను భగ్నం చేస్తాం: మల్కాజిగిరి MLA

image

తెలంగాణ రాజముద్రపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని BRS మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. మల్కాజిగిరిలో ఆయన గురువారం మాట్లాడుతూ.. కాకతీయ తోరణం, చార్మినార్ రాచరిక గుర్తులు కాదని, అవి మన తెలంగాణ చరిత్రకు గుర్తులన్నారు. రాష్ట్ర అధికార చిహ్నం నుంచి కాకతీయ తోరణం, చార్మినార్ తొలగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సంకుచిత నిర్ణయాలపై సమర శంఖం పూరించి ప్రజా ఉద్యమం చేస్తామన్నారు.

News May 30, 2024

FLASH: HYD: నీటి పారుదల శాఖ ఆఫీస్‌లో ఏసీబీ సోదాలు

image

HYD రెడ్‌హిల్స్‌లోని రంగారెడ్డి జిల్లా పర్యవేక్షణ ఇంజినీర్ ఆఫీసులో ఈరోజు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవినీతికి పాల్పడిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బన్సీలాల్, ఏఈలు నటాశ్, క్రాంతి తమకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారని ఏసీబీ అధికారులు తెలిపారు.

News May 30, 2024

BREAKING: HYD: స్టూడెంట్ SUICIDE

image

పరీక్షల్లో ఫెయిలైందని ఓ మెడికో సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD శివారు షాద్‌నగర్‌లోని రైతు కాలనీలో RMP వైద్యుడు బుచ్చిబాబు కుటుంబంతో పాటు ఉంటున్నారు. అతడి భార్య GOVT టీచర్. కాగా ఆయన కూతురు కీర్తి(24) ఫిజియోథెరపీ ఫోర్త్ ఇయర్ చదువుతోంది. మరో కూతురు HYDలో చదువుతుండగా ఈరోజు తల్లిదండ్రులు ఆమెను చూసేందుకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేనిది చూసి కీర్తి ఉరేసుకుని చనిపోయింది. కేసు నమోదైంది. 

News May 30, 2024

GHMC కాంట్రాక్టర్ల నో పేమెంట్-నో వర్క్ సమ్మె విరమణ

image

ఈనెల 18 నుంచి జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు చేస్తున్న నో పేమెంట్- నో వర్క్ సమ్మెను ఈరోజు విరమించారు. కమిషనర్ రోనాల్డ్ రాస్‌తో సమావేశమైన కాంట్రాక్టర్లు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. జూన్ చివరి వారంలోపు పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ క్లియర్ చేస్తామని కమిషనర్ కాంట్రాక్టర్లకు హామీ ఇవ్వడంతో ఈ సమ్మెను విరమించుకున్నారు. రేపటి నుంచి పనులు ప్రారంభిస్తామని, అలాగే టెండర్లలో కూడా పాల్గొంటామన్నారు.

News May 30, 2024

గాంధీ ఆస్పత్రి డాక్టర్ అవినీతిపై పూర్తయిన కమిటీ ఎంక్వయిరీ

image

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఆర్ధోపెడిక్​ వైద్యాధికారిపై పేషెంట్ చేసిన అవినీతి ఆరోపణలపై నియమించబడిన నలుగురు HOD వైద్యాధికారుల కమిటీ రిపోర్టు వచ్చినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్​ ప్రొ.రాజారావు తెలిపారు. విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను సీల్డ్​ కవర్‌‌లో మెడికల్​ ఎడ్యుకేషన్​ డైరెక్టరేట్​​ (DME)కు పంపించినట్లు రాజారావు పేర్కొన్నారు. సదరు నివేదికపై DME తదుపరి నిర్ణయం తీసుకుంటారన్నారు.

News May 30, 2024

హైదరాబాద్‌ ఆస్పత్రులకు వస్తున్నారు..!

image

అంతర్జాతీయ, జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఆసుపత్రులు HYDలో అధికంగా ఉండటంతో విదేశీయులు, ఇతర రాష్ట్రాల వారు వరుస కడుతున్నారు. ఈస్ట్ ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, దక్షిణాసియా సహా భారత్‌లోని పలు రాష్ట్రాల నుంచి అత్యధికంగా వైద్యం కోసం పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే నగరంలో తక్కువకే వైద్య సేవలు అందుతుండటం కూడా కారణం. ఉస్మానియా, గాంధీ, MNJలో వైద్య సేవలు పొందుతున్నారు.

News May 30, 2024

HYD: క్యాండిల్ ర్యాలీ ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే

image

జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జూన్ 1వ తేదీన HYD అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న క్యాండిల్ ర్యాలీ ఏర్పాట్లను జూబ్లీహిల్స్ MLA, BRS HYD చీఫ్ మాగంటి గోపీనాథ్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత నిర్వాహకులతో మాట్లాడి ఏర్పాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు.