India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జూన్ 4వ తేదీన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అప్రమత్తంగా.. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం పగడ్బందీగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి, HYD కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ హాల్లో పార్లమెంట్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఏఆర్ఓ నిర్వహించిన సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు.
ఐఆర్డీఏ సంస్థ ‘ప్రకృతి మిత్ర’ లోగోను మంత్రి కొండా సురేఖ ఈరోజు హైదరాబాద్లోని వారి నివాసంలో ఆవిష్కరించారు. గిన్నీస్ బుక్ రికార్డు లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 450 టన్నుల వేస్ట్ పేపర్ను సేకరించి, రీసైకిల్ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినీవిద్యార్థులకు నోట్ బుక్కులను అందించాలనే లక్ష్యంతో ఐఆర్డీఏ చేస్తున్న కృషి స్ఫూర్తిదాయాకమని మంత్రి అన్నారు.
ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ఏసీబీ అధికారులందరికీ త్రైమాసిక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా పనిచేస్తున్నారని సిబ్బందిని అభినందించారు. 2024 ఏప్రిల్, మే నెలల్లో బాగా పనిచేసిన హోంగార్డులు, ఔట్ సోర్సింగ్ సిబ్బందితో సహా 220 మంది అధికారులు సిబ్బందికి ఆయన ప్రశంసాపత్రాలు, నగదు, ఇతర బహుమతులు అందజేశారు.
HYD జీడిమెట్లలో పెళ్లికి ప్రేమికుడు ఒప్పుకోకపోవడంతో బుధవారం <<13340754>>అఖిల (22) అనే యువతి సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. ‘షాపూర్నగర్కు చెందిన అఖిల్ సాయిగౌడ్ ప్రేమించాలని నా వెంటపడ్డాడు.. నేను లేకపోతే చచ్చిపోతా అని అనడంతో అతడిని నమ్మి మోసపోయాను.. తల్లిదండ్రుల మాట వినుంటే బాగుండేదానిని’ అని.. ఇలా 14 పేజీల లేఖ రాసి సూసైడ్ చేసుకుందని ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
షిరిడీ నుంచి HYD వస్తున్న TGSRTC బస్సులో ప్రయాణికుల బ్యాగులు చోరీకి గురయ్యాయి. బాధితులు తెలిపిన వివరాలు.. తుల్జాపూర్ పెట్రోల్ బంక్ వద్ద బస్సు ఆగడంతో లగేజీ స్టోర్ తాళం పగలగొట్టి బ్యాగులను దుండగులు ఎత్తుకెళ్లారు. బ్యాగులు లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రయాణికులు వాపోయారు. గతంలో కూడా అదే పెట్రోల్ బంక్ వద్ద వేరే బస్సులో చోరీ జరిగింది.
OU హెల్త్ సెంటర్లో కాంట్రాక్టు మహిళా ఉద్యోగిని పట్ల ఒక రెగ్యులర్ ఉద్యోగి అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. సదరు ఉద్యోగిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు గురువారం విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. వీ వాంట్ జస్టిస్ అంటూ నినదించారు.
గ్రేటర్లో మొన్నటి వరకు వర్షాలతో చల్లబడిన వాతావరణం మళ్లీ ఒక్కసారిగా వేడెక్కింది. రెండు, మూడు రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతుండటంతో పగటి పూటజనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 40.2, కనిష్ఠం 27.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అటు గాలిలో తేమ 32 % నమోదైనట్లు వెల్లడించారు.
హరితహారం పేరిట గత ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో లోపాలను సరిచేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ‘వన మహోత్సవం’ పేరిట నగరంలో ఏకంగా 30 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకొంది. కూకట్పల్లి, శేరిలింగంపల్లి, చార్మినార్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, ఎల్బీనగర్ జోన్లలో నీడనిచ్చే వందల రకాల చెట్లను నాటనున్నారు. ఇంటింటికి సైతం పెరటి మొక్కలు అందజేయనున్నారు.
HYD వాసులను అలరించేలా ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ జూన్ 7 నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. ఏటా ముంబై, బెంగళూరులో నిర్వహించే ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ మొదటిసారి హైదరాబాద్ గుడిమల్కాపూర్ కింగ్స్ కోహినూర్ (క్రౌన్) కన్వెన్షన్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి దాదాపు 250 మంది ప్రముఖ కళాకారులు, 30 ఆర్ట్ గ్యాలరీల యాజమానులు పాల్గొననున్నారు.
HYD జీడిమెట్ల PS పరిధిలోని న్యూ ఎల్బీనగర్లో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉండే అఖిల(22) అనే యువతిని అఖిల్ సాయిగౌడ్ అనే యువకుడు ప్రేమిస్తున్నాడు. 8ఏళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పి ఆమె వెంట తిరిగాడు. ఇప్పుడు అతడు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో మనస్తాపం చెందిన అఖిల ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అఖిల తండ్రి ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.