India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD జిల్లా పరిధిలో మార్చి నెలలో మొత్తం స్థిరాస్తుల సంఖ్య 4,376, మేడ్చల్ జిల్లాలో 13,051, రంగారెడ్డి జిల్లాలో 19,663గా ఉంది. మరోవైపు ఇళ్లులు,ప్లాట్లు, స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లకు HYD జిల్లాలో రూ.120.53 కోట్లు, మేడ్చల్ జిల్లాలో రూ.213.19 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో రూ.432.60 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా రిపోర్టు విడుదల చేసి, పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలో వినియోగిస్తున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(EVM)లలో 90 శాతం HYDలోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECIL) రూపొందించినవే. 543 ఎంపీ స్థానాలలో దాదాపు 500 చోట్ల ECIL తయారుచేసిన EVMలనే వాడుతున్నారు. 2 నెలల కిందటే 6.25 లక్షలకు పైగా కంట్రోల్ యూనిట్లు, 8.39 లక్షల బ్యాలెట్ యూనిట్లు, 5.45 లక్షల వీవీ ప్యాట్లను ఈసీఐకి సరఫరా చేసినట్లు తెలిపారు.
✓ తీరా వర్షాలు కురిసే సమయం వరకు దుక్కులు దున్నకుండా ఉండొద్దు.
✓వేసవిలోనే దుక్కి సిద్ధం చేయడం మంచిది
✓విత్తనం వేసే నెలరోజుల ముందుగానే దుక్కి సిద్ధం చేసుకోండి
✓వేసవి దుక్కులు లోతుగా చేయడం వల్ల, ఎండ వేడికి పలు రకాల చీడపీడ పురుగులు చచ్చిపోతాయి
✓ మొలకెత్తి మొలకల శాతం పెరుగుతుంది
✓ మొలిచిన మొలకలు ఆరోగ్యంగా ఎదుగుతాయి
•పై సూచనలు పాటించాలని AO సూర్య ప్రకాష్ తెలిపారు.
HYD నగరంలోని ఆర్కిటెక్చర్ అందాలు, పురాతన కట్టడాలపై బ్రిటిష్ హై కమిషనర్ కామెరాన్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా 300 ఏళ్ల చరిత్ర కలిగిన బన్సీలాల్ పేట మెట్ల బావిని సందర్శించిన ఆమె పునరుద్ధరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం చార్మినార్ వద్ద ఇరానీ టీ, ఉస్మానియా బిస్కెట్ తిని ఆస్వాదించారు. HYD నగరాన్ని సందర్శించడంతో తనివి తీరా ఆనందం లభించిందని పేర్కొన్నారు.
HYD ఎల్బీనగర్ పరిధి నాగోల్-ఆనంద్ నగర్ రోడ్డుపై ఉన్న బురదలో ఓ యువతి కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. రోడ్లు మొత్తం గుంతలమయంగా మారి, వర్షం నీరు చేరి అవస్థలు పడుతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గుంతల్లో పడి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని మండిపడ్డారు. గ్రేటర్ HYDలో అనేక చోట్ల ఇదే పరిస్థితి ఉందని, ఇప్పటికైనా GHMC యంత్రాంగం స్పందించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
నగరంలో GHMC పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకు ఈ దృశ్యాలే సాక్ష్యం. రోడ్లపై చెత్త వేసే వారిపై తమ సిబ్బంది నిఘా పెట్టి చర్యలు తీసుకుంటుందన్న హెచ్చరికలు మాటలుగానే నిలుస్తున్నాయి. ఆటోల్లో కాకుండా కాలనీలు, వీధుల్లో, సీసీ రోడ్లపై స్థానికులు ఇష్టానుసారంగా చెత్త వేస్తున్న దృశ్యాలు LBనగర్, HYT నగర్ వనస్థలిపురం, BNరెడ్డి, మన్సూరాబాద్, DSNR, UPL, GHMCలోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి.
ఇటీవల కజకిస్థాన్లో జరిగిన ఎలోర్డా పోటీల్లో 52 కేజీల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో విజేతగా నిలిచి బంగారు పతకం సాధించిన బాక్సర్ నిఖత్ జరీన్.. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ను కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను కమిషనర్ శాలువాతో సత్కరించారు. దేశ గౌరవం విశ్వ వ్యాప్తం చేసేలా మున్ముందు మరింత రాణించాలని కమిషనర్ కోరారు.
HYD, ఉమ్మడి RRలో కల్తీ, పాడైన ఆహార పదార్థాల అమ్మకాల ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. నగరంలోని పలు బార్లు, వైన్స్ల వద్ద తనిఖీలు చేసిన అధికారులు.. చికెన్ను నిల్వ చేసి అమ్ముతున్నట్లు గుర్తించారు. పాడైన సరే చికెన్ను అలాగే వండి ఇస్తున్నారని తెలిపారు. తాజాగా సోమాజిగూడలోని హెడ్ క్వార్టర్స్ రెస్ట్-ఓ-బార్లో అధికారులు తనిఖీ చేసి ఫ్రిడ్జిలో కొన్ని రోజుల నుంచి నిల్వ చేసి ఉన్న చికెన్, మటన్ను గుర్తించారు.
HYD గాజులరామారం GHMC సర్కిల్ ఎస్ఎఫ్ఏ (శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్) కిషన్ రాసలీలలు కలకలం రేపుతున్నాయి. బాధితులు తెలిపిన వివరాలు.. మహిళా శానిటేషన్ సిబ్బందిని భయపెట్టి లైంగిక దాడి చేసి ఆ వీడియోలు, ఫొటోలు తీసి కిషన్ బెదిరింపులకు పాల్పడ్డాడు. మాట వినకుంటే జాబ్ నుంచి తొలగిస్తూ మహిళా ఉద్యోగులను హింసించాడు.పరిస్థితి విషమించడంతో బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
స్టాక్ మార్కెట్లో లాభాలిస్తామని ఓ గృహిణి నుంచి రూ.11.20 లక్షలను సైబర్ నేరగాళ్లు లూటీ చేశారు. HYD నారాయణగూడకు చెందిన గృహిణికి స్టాక్ మార్కెట్లో లాభాలు వస్తాయని ఓ మెసేజ్ వచ్చింది. దాంట్లో ఉన్న లింకును క్లిక్ చేయగా ఒక యాప్ డౌన్లోడ్ అయింది. దాంట్లో మొదట కొంత పెట్టుబడి పెట్టగా లాభాలు వచ్చాయి. దీంతో విడతల వారీగా రూ.11.20 లక్షలు పెట్టుబడి పెట్టగా విత్ డ్రా అవ్వలేదు. బాధితురాలు CCSలో ఫిర్యాదు చేసింది.
Sorry, no posts matched your criteria.