India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యువతి ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాపట్లకు చెందిన యువతి HYDలో ఉంటోంది. ఈ క్రమంలో ఆమె స్నానం చేస్తుండగా పొరుగింటి యువకుడు వీడియో తీశాడు. తర్వాత ఆ వీడియోను ఆమెకు పంపి డబ్బు కావాలని బెదిరించగా రూ.40 వేలు పంపింది. కొన్ని రోజులకు మళ్లీ డబ్బు కావాలని అడగడంతో భయపడిన యువతి బాపట్లకు వెళుతూ బస్సులోనే పురుగు మందు తాగింది. తోటి ప్రయాణికుల సమాచారంతో పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కవి యాకుబ్, ఆర్.వాసు ఎన్నికయ్యారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ జనరల్ బాడీ సమావేశాన్ని బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా శోభన్ బాబు, మలుపు బాల్రెడ్డి, సహాయ కార్యదర్శులుగా సూరిబాబు, సురేశ్, కోశాధికారిగా నారాయణరెడ్డి ఎన్నికయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం టీ-వర్క్స్ సీఈవోగా జోగీందర్ తనికెళ్ల, టీ-హబ్ సీఈవోగా సీతా పల్లచోళ్లను నియమించింది. ఈ మేరకు ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఈ పదవుల్లో మూడేళ్లపాటు కొనసాగనున్నారు. కాగా టీ- వర్క్స్ అనేది ఎలక్ట్రానిక్ అండ్ హార్డ్వేర్ రంగంలో నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన అతిపెద్ద ప్రొటోటైపింగ్ కేంద్రం.
HYDలో విషాద ఘటన జరిగింది. దుండిగల్ SIరాజేశ్ తెలిపిన వివరాలు..బిహార్కు చెందిన రాహుల్, ప్రీతి(24) దంపతులు HYDకు వలసొచ్చి బహదూర్పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలో ఉంటున్నారు. వీరికి కుమార్తె ఉంది. ఈక్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా కూతురు చూస్తుండగానే ప్రీతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఏం చేసుకుందో తెలియని ఆ చిన్నారి చాలాసేపు అమ్మని చూస్తూ ఏడవగా స్థానికులు వచ్చి పోలీసులకు విషయం చెప్పారు.
HYDలో ఓ తల్లి మరణించినా.. అవయవ దానం ద్వారా ఆరుగురికి ప్రాణం పోశారు. యాదాద్రి జిల్లా ఆలేరు మండలానికి చెందిన జంపాల సుజాత అపస్మారక స్థితిలో ఇటీవల కింద పడిపోయారు. వెంటనే ఆమెను HYD మేడిపల్లిలోని ఓ ఆసుపత్రికి తరలించగా, తాజాగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబీకుల అంగీకారంతో సుజాత గుండె, నేత్రాలు, కాలేయం తీసుకుని ఆరుగురికి అమర్చి, ప్రాణం పోసినట్లు జీవన్ దాన్ బృందం తెలిపింది.
HYDలో ఇన్ని రోజులు చిన్న హోటళ్లలో ఆహారకల్తీని అధికారులు గుర్తించగా ఇప్పుడు పెద్ద వాటిల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బుధవారం సోమాజిగూడ క్రుతుంగ రెస్టారెంట్, రెస్ట్ ఓ బార్, KFCలో నాసిరకం, పాడైన ఆహారపదార్థాలు గుర్తించామని, వాటి నమూనాలను ల్యాబ్కు పంపామని అధికారులు తెలిపారు. HYD, ఉమ్మడి RR పరిధిలోని పలు హోటళ్లలో బిర్యానీకి పాడైన, నిల్వ చేసిన చికెన్ వాడుతున్నారని అధికారులు గుర్తించారు. SHARE IT
HYD నగరంలో ఓ తల్లి మరణించినా.. అవయవ దానం ద్వారా ఆరుగురికి ప్రాణం పోశారు. ఆలేరు మండలానికి చెందిన జంపాల సుజాత అపస్మారక స్థితిలో ఇటీవల కింద పడిపోయారు. వెంటనే ఆమెను HYD మేడిపల్లిలోని ఓ ఆసుపత్రికి తరలించగా, తాజాగా.. బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబీకుల అంగీకారంతో సుజాత గుండె, నేత్రాలు, కాలేయం తీసుకుని ఆరుగురికి అమర్చి, ప్రాణం పోసినట్లు జీవన్ దాన్ బృందం తెలిపింది.
AP హైకోర్టు న్యాయమూర్తి పేరు చెప్పి మోసానికి పాల్పడుతున్న నిందితుడిని KPHB పోలీసులు అరెస్టు చేశారు. SI సుమన్ వివరాల ప్రకారం.. సందీప్ అనే వ్యక్తి KPHB పీఎస్ పరిధిలో దర్యాప్తులో ఉన్న క్రిమినల్ కేసుకు సంబంధించి తాను న్యాయం చేస్తానంటూ బాధితుల నుంచి రూ.50 వేలు తీసుకున్నాడు. ఓ యాప్ ద్వారా న్యాయమూర్తిలాగ వాయిస్ మార్చి పోలీసులకు కాల్ చేశాడు. నిందితుడు నేరం ఒప్పుకోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
HYD, RR, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాలలో ఉరుముల మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు రేపటి నుంచి రెండు రోజులపాటు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రూరల్ ప్రాంతాల్లో ఉండేవారు అప్రమత్తంగా ఉండటం మంచిదని సూచించారు.
ఉప్పల్ పరిధిలోని సెంటర్ ఫర్ ఫింగర్ ప్రింట్ డిటెక్టివ్ సెంటర్లో లైఫ్ సైన్సెస్ ఇంక్యుబేషన్ ప్రోగ్రాం సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జూన్ 5 వరకు ఈ అవకాశం ఉందని, ఆసక్తి గల అభ్యర్థులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లైఫ్ సైన్సెస్ పై ఆసక్తి గల వారికి నెట్వర్కింగ్, ల్యాబ్ అంశాల పై ట్రైనింగ్ అందిస్తారు.
Sorry, no posts matched your criteria.