India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD ఉస్మానియా యూనివర్సిటీ 25వ వీసీగా ఉన్న ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ పదవీ కాలం మే 21న ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక వీడ్కోలు సమావేశం నిర్వహించి, ప్రొఫెసర్, డాక్టర్ రవీందర్ దంపతులను ఘనంగా సన్మానించిన యూనివర్సిటీ బృందం ఘన వీడ్కోలు పలికింది. కాగా నూతన వీసీగా దాన కిషోర్ IASని ప్రభుత్వం నియమించగా ఆయన ఈరోజు బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో కొద్దిరోజుల క్రితం మోస్తారు చిరుజల్లులు కురిశాయి. దీంతో దుక్కులు దున్నుతున్న రైతన్న వర్షాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇదే సమయంలో విత్తనాలకు ఫుల్ డిమాండ్ ఉన్న నేపథ్యంలో కొందరు నకిలీ విత్తనాలు తయారు చేసి, విక్రయించేందుకు తెరలేపుతున్నారు. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు నకిలీవని అనుమానం వస్తే వెంటనే 8712662111కు కాల్ చేయాలన్నారు.
ఇటీవలే కురిసిన వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై ఇసుకమేటలు పేరుకుపోయాయి. ఎగువ నుంచి లోతట్టు ప్రాంతాలకు ఇసుక కొట్టుకురావడంతో అవి కట్టగా ఏర్పడి వాహనదారులకు ఇబ్బందిగా ఉన్నాయి. అంతేకాకుండా దుమ్ము, ధూళితో అసౌకర్యంగా మారాయి. ద్విచక్ర వాహనదారులు ఒకానొక సందర్భంలో స్కిడ్ అయి పడిపోతున్నామని అంటున్నారు. ఇసుక మేటలను తొలగించాలని కోరుతున్నారు.
చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో 16.57 లక్షల మంది ఓటు వేసి 56.40 ఓటింగ్ శాతం నమోదు చేయటం పట్ల రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చేవెళ్ల పార్లమెంటు ఓటర్లకు ధన్యవాదాలు తెలుపుతూ X వేదికగా ట్వీట్ చేశారు. 2019 ఎన్నికలతో పోలిస్తే 2024లో 3.58 లక్షల మంది అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు.
HYD ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్గా సీనియర్ ఐఏఎస్ అధికారి దాన కిషోర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ఇన్ని రోజులు కొనసాగిన ప్రొఫెసర్ రవీందర్ పదవీకాలం మంగళవారంతో ముగియడంతో తెలంగాణ ప్రభుత్వం దాన కిషోర్ను వీసీగా నియమించింది. ఈ మేరకు ఓయూ చేరుకున్న ఆయన వీసీగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సీపీ తరుణ్ జోషి సూచించారు. రూ.1.33 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 170 ట్యాబ్స్, 18 ల్యాప్ టాప్స్, 80 అధునాతన డిస్క్ టాప్లను స్టేషన్ హౌస్ అధికారులు, పెట్రోమొబైల్స్ సిబ్బందికి నేరేడ్మెట్లోని సీపీ కార్యాలయంలో అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సత్వర సేవలు అందించే లక్ష్యంతో పని చేయాలన్నారు.
బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. సికింద్రాబాద్ తుకారంగేట్ PS పరిధిలో ఉండే బాలిక(16) తరచూ ఫోన్లో మాట్లాడుతుందని తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఆమె ఇంటి నుంచి బయటకెళ్లింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా అదే సమయంలో బైక్ వస్తున్న సందీప్ రెడ్డి(28) ఆమెను ఆపాడు. మాయమాటలు చెప్పి బైక్ ఎక్కించుకుని కాచిగూడలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. కేసు నమోదైంది.
మెట్రో రెండో దశపై అడుగులు వేగంగా పడుతున్నాయి. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే కార్యాచరణ ప్రారంభం కానుంది. HYDలోని 6 మార్గాల్లో నిర్మించనున్న మెట్రో రెండో దశపై సమగ్రమైన ప్రాజెక్టు నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేయనున్నారు. జూన్లోనే DPR సిద్ధం చేయనున్నట్లు HMRL అధికారులు తెలిపారు. రెండో దశ మెట్రో నిర్మాణంలో భాగంగా మొదట ఎయిర్పోర్ట్ కారిడార్ను చేపట్టనున్నారు.
అమృత్ ప్రాజెక్టును అమలు చేయడానికి ప్రయోగాత్మకంగా గ్రేటర్ HYD నగరంలో చేపట్టేందుకు జీహెచ్ఎంసీ 5 మున్సిపల్ పార్కులను ఎంపిక చేసింది. HYD నగరంలోని ఖైరతాబాద్ జోన్లో కేఎల్ఎన్ యాదవ్ పార్కు, శేరిలింగంపల్లి జోన్లో టెక్నో పార్క్, సికింద్రాబాద్ జోన్లో ఇందిరా పార్కు, ఎల్బీనగర్ జోన్లో హబ్సిగూడలోని కాకతీయ నగర్ కాలనీ పార్కు, సైనిక్పురిలోని ఈ-సెక్టార్ పార్కులు.. పైలెట్ ప్రాజెక్టులో ఉన్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేస్తూ గాంధీ హాస్పిటల్ పై Xలో పోస్ట్ చేసిన డీప్ ఫేక్ వీడియోను BRS USA ఎక్స్ ఖాతా నిర్వాహకుడు హరీశ్ రెడ్డి తొలగించారు. తనకు తెలియక పొరపాటున పాత వీడియోను పోస్ట్ చేశానని, అపాలజీ చెబుతూ.. మరో వీడియో పెట్టారు. గాంధీ సూపరింటెండెంట్ ఫిర్యాదుతో హరీశ్ రెడ్డిపై చిలకలగూడ PSలో IT, IPC 505 క్లాజ్ 2 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు SHO అనుదీప్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.