RangaReddy

News May 21, 2024

HYD: మొబైల్ రికవరీలో తెలంగాణ రెండోవ స్థానం

image

సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా సెల్‌ఫోన్ల రికవరీలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. 2023 ఏప్రిల్‌ 19 నాటి నుంచి ఇప్పటి వరకు 30,049 ఫోన్లు రికవరీ చేసినట్టు అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 4,869, సైబరాబాద్‌ పరిధిలో 3,078, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 3,042 ఫోన్లు రికవరీ చేసినట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 780 ఠాణాల్లో సీఈఐఆర్‌ యూనిట్లు ఉన్నాయన్నారు.

News May 21, 2024

HYD: ‘నా భార్యను నేనే చంపాను’

image

HYD ఉప్పల్ పరిధి బ్యాంక్ కాలనీలో <<13285941>>భార్య కమలను భర్త రమేశ్ హత్య<<>> చేసిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. మార్కెటింగ్ జాబ్ చేసే రమేశ్‌కు కమలతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా భార్యపై అనుమానం పెంచుకున్న రమేశ్‌ అర్ధరాత్రి ఆమెతో గొడవకు దిగాడు. మాటామాట పెరిగి ఆమెపై దాడి చేసి, గొంతు నులిమి చంపేశాడు. తన భార్యను తానే చంపినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.

News May 21, 2024

HYD: సరస్సుల సంరక్షణ, పునరుజ్జీవనంపై వర్క్‌షాప్‌

image

పట్టణ ప్రాంతాల్లో సరస్సుల సంరక్షణ, పునరుజ్జీవనంపై ఈరోజు HYDలో వర్క్‌షాప్‌ నిర్వహించారు. కార్యక్రమంలో MA&UD ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ పాల్గొని మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో సరస్సుల రక్షణ, పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఆరోగ్యకరమైన సరస్సులు అనేక పర్యావరణ ప్రయోజనాలను అందించడమే కాకుండా, అవి మన జీవన నాణ్యతను ప్రభావితం చేస్తాయని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయన్నారు.

News May 21, 2024

HYD: తెలంగాణను నంబర్-1గా మారుస్తాం: మంత్రి

image

HYD హైటెక్స్ వద్ద జరిగిన ఓ సమావేశంలో మంత్రి వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడారు. RRR-రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో IGBC సంస్థ RRR (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్) విధానం అమలు చేసేందుకు పని చేస్తున్నారన్నారు. మన అందరి లక్ష్యం RRR కావడం యాదృచ్ఛికం అని అన్నారు. రాష్ట్రంలో RRR నిర్మాణం, మూసీ ప్రక్షాళన, మౌలిక సదుపాయల కల్పనతో దేశంలో తెలంగాణను నంబర్-1గా మార్చుతామన్నారు.

News May 21, 2024

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సోలార్ విద్యుత్

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనుల్లో వేగం పుంజుకుంది. ఫ్లాట్ ఫాం, స్టేషన్ బిల్డింగ్, సర్వీస్ బిల్డింగ్, రెసిడెన్షియల్ బిల్డింగ్, లెవెల్ క్రాసింగ్ పాయింట్ రూఫ్ పై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసి కరెంటు ఉత్పత్తి చేయనున్నారు. ఈ నిర్మాణానికి ఎట్టకేలకు ముందడుగు పడింది. 1.782 మెగావాట్ల సోలార్ ప్యానల్స్ ప్రాజెక్టు కోసం అధికారులు టెండర్ జారీ చేశారు.

News May 21, 2024

BREAKING: సికింద్రాబాద్: బొల్లారంలో విషాదం

image

సికింద్రాబాద్ బొల్లారంలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉండే దంపతులు రవీందర్, సరళాదేవి చికిత్స నిమిత్తం బొల్లారం కంటోన్మెంట్ ఆస్పత్రికి వచ్చారు. ఈ క్రమంలో ఆస్పత్రి ముందున్న చెట్టు దంపతులపై పడింది. ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మృతిచెందగా భార్యకు తీవ్రగాయాలవడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. సరళాదేవి టీచర్‌గా పనిచేస్తున్నారని పోలీసులు గుర్తించారు.

News May 21, 2024

HYD: గోల్డెన్ జూబ్లీ భవనం.. ప్రారంభానికి మరింత సమయం

image

JNTUలో నూతనంగా నిర్మించిన గోల్డెన్ జూబ్లీ భవనం ప్రారంభానికి మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మంగళవారంతో ప్రస్తుత VC కట్టా నరసింహారెడ్డి పదవీకాలం ముగియనుంది. ఆలోగా ఈభవనాన్ని ప్రారంభించాలన్న ఆలోచనతో గత వారం క్రితమే ప్రభుత్వానికి వర్సిటీ అధికారులు లేఖ రాశారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇప్పటికీ కొన్ని పనులు భవనం లోపల కొనసాగుతుండటంతో ప్రారంభానికి మరి కొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

News May 21, 2024

నేటితో ముగియనున్న ఓయూ వీసీ పదవీకాలం

image

ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ పదవీకాలం నేటితో ముగియనుంది. మూడేళ్ల క్రితం వీసీగా పదవి బాధ్యతలు చేపట్టిన ఆయన క్యాంపస్‌లోని వైస్ ఛాన్సలర్ నివాసంలో ఉంటూ 21 పాయింట్ ఫార్ములాతో నిత్యం వర్సిటీ అభివృద్ధికి పాటుపడ్డారు. PHD విద్యార్థులకు వన్ టైమ్ ఛాన్స్ ఇచ్చి వందలాదిమంది పూర్వ విద్యార్థులకు డాక్టర్ డిగ్రీలను అందుకునేలా అవకాశం కల్పించారు. త్వరలో ఓయూకి కొత్త వీసీ రానున్నట్లు సమాచారం.

News May 21, 2024

HYD: రైలు ఎక్కుతుండగా కిందపడ్డ తండ్రి.. దూకేసిన కుమార్తెలు

image

రైలు నుంచి దూకేయడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. HYD కాచిగూడ రైల్వే ఠాణా పోలీసులు తెలిపిన వివరాలు.. కాచిగూడకి చెందిన రమేశ్ లింగంపల్లిలోని తన అన్న సాయి ఇంటికి వెళ్లడానికి కుమార్తెలు పూజ(15), విజయ(13), కుమారుడితోపాటు తన అన్న మనవరాళ్లతో కలిసి కాచిగూడ స్టేషన్‌కు వచ్చారు. తొలుత పిల్లలందరినీ ఎక్కించిన రమేశ్ కదులుతున్న రైలును ఎక్కబోతూ కిందపడ్డాడు. అనంతరం కుమార్తెలు కూడా దూకేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి.

News May 21, 2024

మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్‌కు బెయిల్

image

సామాజిక మాధ్యమాల్లో పాత వీడియోలను వైరల్ చేసిన అభియోగంపై అరెస్టయిన బీజేపీ మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ వి.శ్రవణ్ కుమార్‌కు నాంపల్లిలోని న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. గత గురువారం ఆయన స్థానిక బీజేపీ కార్యాలయంలో ఉండగా మఫ్టీలో వచ్చిన పోలీసులు తీసుకువెళ్లిన విషయం విదితమే. అదే కేసులో ఆయనతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.