RangaReddy

News May 19, 2024

HYD: రియల్ ఎస్టేట్ దందా.. ముగ్గురు అరెస్ట్

image

మేడ్చల్ జిల్లా కొంపల్లి పరిధిలో భారతి బిల్డర్స్ పేరుతో ప్రీ లాంచ్ ఆఫర్స్ అంటూ మాయమాటలు చెప్పి మోసం చేసిన శివరామకృష్ణ, నాగరాజు, నరసింహరావును పోలీసులు అరెస్టు చేశారు. వీరు అమాయక ప్రజల నుంచి రూ.60 కోట్ల డబ్బు వసూలు చేసి మోసం చేయటంతో సైబరాబాద్ పోలీసులు రిమాండ్ చేసినట్లు తెలిపారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News May 19, 2024

ఉప్పల్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

image

ఉప్పల్ స్టేడియంలో ఆదివారం SRH- కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు రాచకొండ CP తరుణ్ జోషి తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 10:30 గంటల వరకు స్టేడియం పరిసర ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. చెంగిచెర్ల, బోడుప్పల్, పీర్జాదిగూడ నుంచి ఉప్పల్‌కు వచ్చే వాహనాలు HMDA భగాయత్ రోడ్డు వైపు దారి మళ్లిస్తామన్నారు.

News May 19, 2024

KTR‌ను ఎర్రగడ్డలో అడ్మిట్ చేయాలి: కాంగ్రెస్ నేతలు

image

BRS అధికారం కోల్పోయిన తర్వాత KTR మతిభ్రమించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవిరెడ్డి విజితా రెడ్డి, హరినాథ్ రెడ్డి, ఎడ్ల నరేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. నల్లకుంటలో వారు సమావేశమయ్యారు. తెలంగాణలో INCకి ఒక్క MP సీటు కూడా రాదని KTR వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఆయన్ని ఎర్రగడ్డ ఆస్పత్రిలో అడ్మిట్ చేసి, మానసిక వైద్య చికిత్సలు చేయించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు.

News May 18, 2024

EAPCET ఫలితాల్లో HYD విద్యార్థుల సత్తా

image

TS EAPCET ఫలితాల్లో HYDకి చెందిన నలురుగు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కేటగిరిలో అసిఫ్‌నగర్‌కు చెందిన రేపల సాయి వివేక్(5వ ర్యాంకు), నాచారంకు చెందిన మహమ్మద్ అజాన్ సాద్(6వ ర్యాంకు), పేట్‌బషీరాబాద్‌కు చెందిన భార్గవ్ సుమంత్(8వ ర్యాంకు), కుకట్‌పల్లికి చెందిన ఆదిత్య(9వ ర్యాంకు) సాధించారు. ఈ సందర్భంగా వీరిని కుటుంబీకులు, స్థానికులు అభినందించారు.

News May 18, 2024

HYD: ఏకంగా విగ్రహాలనే దొంగలించిన దొంగలు!

image

హైదరాబాద్‌లో ఏకంగా ఫ్యామిలీ విగ్రహాలను దొంగలు మాయం చేశారు. జూబ్లీహిల్స్ నర్నే రోడ్డులో జీహెచ్ఎంసీ వాళ్లు 2021లో ఒక ఫ్యామిలీ విగ్రహాలు పెట్టారు. అయితే దొంగలు ఆ ఫ్యామిలీలోని తండ్రిని వదిలి భార్య, కూతురు, కొడుకు విగ్రహాలు దొంగిలించారు. సుందరీకరణ కోసం ఏర్పాటు చేసిన విగ్రహాలను కూడా దొంగలు వదలడం లేదు. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

News May 18, 2024

HYD: ఆర్టీసీకి ఒకేరోజు రూ.26 కోట్ల ఆదాయం

image

పోలింగ్ మరుసటి రోజు ఆర్టీసీకి రూ.26 కోట్ల ఆదాయం చేకూరిందని ఆ సంస్థ గ్రేటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం జేబీయస్‌‌లోని పుష్పక్ బస్ షెల్టర్ సందర్శియిర్ పోర్ట్‌కు వెళ్తున్న ప్రయాణికులతో మాట్లాడారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు పుష్పక్ AC బస్సులను 24 గంటల పాటు నడుపుతున్నామని, గ్రేటర్ పరిధిలో మరో 125 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

News May 18, 2024

HYD: ఆర్టీసీకి ఒకేరోజు రూ.26 కోట్ల ఆదాయం

image

పోలింగ్ మరుసటి రోజు ఆర్టీసీకి రూ.26 కోట్ల ఆదాయం చేకూరిందని ఆ సంస్థ గ్రేటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం జేబీయస్‌‌లోని పుష్పక్ బస్ షెల్టర్ సందర్శియిర్ పోర్ట్‌కు వెళ్తున్న ప్రయాణికులతో మాట్లాడారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు పుష్పక్ AC బస్సులను 24 గంటల పాటు నడుపుతున్నామని, గ్రేటర్ పరిధిలో మరో 125 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

News May 18, 2024

REWIND-2019: చేవెళ్లలో కాంగ్రెస్ ఓటమి!

image

చేవెళ్లలో విజయం ఎవరిదనేది హాట్‌ టాపిక్‌గా మారింది. 2019‌లోనూ రసవత్తర పోరు సాగింది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి(INC)పై రంజిత్ రెడ్డి (BRS) 14,317 ఓట్ల మెజార్టీతో‌ గెలిచారు. జనార్థన్ రెడ్డి(BJP) 3వ స్థానంలో నిలిచారు. ఎన్నికల‌కు ముందు విశ్వేశ్వర్ రెడ్డి(BJP), రంజిత్ రెడ్డి (INC), జ్ఞానేశ్వర్(BRS) నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశారు. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు‌ తమదే మెజార్టీ‌ అంటున్నారు. మీ కామెంట్?

News May 18, 2024

HYD: రూ.60 లక్షలు సేఫ్..!

image

సైబరాబాద్‌లో ఓ మహిళకు సైబర్ నేరగాళ్లు గాలం వేశారు. తాము మహారాష్ట్ర పోలీసులమని, మీరు మనీ లాండరింగ్‌కు పాల్పడ్డట్లు బాధిత మహిళకు బెదిరింపు కాల్స్ చేశారు. కేసు నుంచి తప్పించుకోవాలంటే డబ్బులు ఇస్తే కేసు క్లియర్ అంటూ నమ్మించి ఆమె ఖాతా నుంచి రూ.60 లక్షలు కొట్టేశారు. వెంటనే సదరు మహిళ 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా గోల్డెన్ అవర్‌ని వాడినందుకు గంటలోనే రూ.60 లక్షలను పోలీసులు నిలుపుదల చేయించారు.

News May 18, 2024

HYD: RTC లహరి AC బస్సుల్స్ స్నాక్స్ బంద్..!

image

లహరి AC బస్సులను రాష్ట్రంలో TSRTC ఆధ్వర్యంలో నడిపిస్తోంది. ఈ బస్సులో ప్రయాణించే వారికి స్నాక్స్ బాక్స్ అందిస్తారు. కానీ..HYD MGBS నుంచి మే 16న ఖమ్మం వెళ్లిన ఓ ప్రయాణికునికి అందించలేదు. దీనిపై ఆర్టీసీ అధికారులను అడగగా.. మే 15 నుంచి స్నాక్స్ బాక్స్ బంద్ చేశామని తెలిపారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు నిలిపి వేశామని, ఒక్కో ప్రయాణికుడిపై రూ.30 ఛార్జీ తగ్గించి తీసుకుంటున్నామని పేర్కొన్నారు.