India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రంగారెడ్డి జిల్లాలో అసాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. వేసవి నేపథ్యంలో జిల్లాలో పగటి సమయంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కాగా రాత్రి వేళల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో రాత్రుళ్లు చలి అధికంగా ఉంటోంది. అయితే పగటివేళల్లో అనేక ప్రాంతాలు ఎల్లో జోన్లో ఉండగా రాత్రి సమయాల్లోనూ పలు ప్రాంతాలు ఎల్లో జోన్లో కొనసాగుతున్నాయి.
నిన్న దాయాదుల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ సందర్భంగా రూ.కోట్లల్లో పందేలు సాగాయి. బంతిబంతికి రూ.2000-2500 వరకు పందేలు వేసుకున్నారు. చందానగర్, మాదాపూర్, ఎల్బీనగర్, గోషామహల్, చిలకలగూడ, ముషీరాబాద్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున సొమ్ము చేతులు మారినట్లు తెలుస్తోంది. మాదాపూర్లో ఓ స్థిరాస్తి వ్యాపారి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి వీటిని నిర్వహించినట్లు సమాచారం. దీనిపై పోలీసులు నిఘా ఉంచారు.
పదో తరగతి పూర్తయ్యాక డైరెక్ట్ ఇంజినీరింగ్ విద్యను అభ్యసించడానికి డిప్లొమా పాలిటెక్నిక్ విద్య అందుబాటులో ఉంది. ఇందుకోసం పాలీసెట్ ప్రవేశ పరీక్ష మే 16వ తేదీన జరుగుతుందని రామంతపూర్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ అధికారులు తెలిపారు. ఇందుకు ఇప్పటి నుంచే విద్యార్థులు ప్రిపేర్ అయితే మంచిగా రాణించే అవకాశాలు ఉంటాయన్నారు.
తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్ర జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 312 కాగా, హైదరాబాద్ జిల్లాలో ఇది 18,161కు చేరింది. ఇది దేశ రాజధాని ఢిల్లీ (11,313) కంటే ఎక్కువ. హైదరాబాద్ జిల్లా జనాభా సుమారు 39.43 లక్షలు. నగరంలో గ్రామీణ ప్రాంతాలు లేకపోవడంతో ఇది పూర్తిగా శహరీకృతమైంది. జనాభా పెరుగుదలతో మౌలిక వసతుల అభివృద్ధికి కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది.
రంగారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. ఈరోజు శంకర్పల్లి మండలంలో 37.8℃, మొయినాబాద్ 37.4, ఫరూఖ్ నగర్ 37.3, ఇబ్రహీంపట్నం 37.2, కేశంపేట 37.2, హయత్ నగర్ 37.1, సరూర్నగర్ 37.1, శేరిలింగంపల్లి 37, కొందుర్గ్ 36.9, షాబాద్ 36.6, తలకొండపల్లి 37, అబ్దుల్లాపూర్మెట్ 35.8, నందిగామ 35.8, చేవెళ్ల 35, రాజేంద్రనగర్ 36.1, శంషాబాద్ 35.5, బాలాపూర్ 35.6, కందుకూరు 36.2, మహేశ్వరం 35.5℃గా నమోదైంది.
‘చీరలోని గొప్పతనం తెలుసుకో.. ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో’ అనే పాట వినే ఉంటారు. చీర కట్టుతో అందంగా కనిపించడమే కాదు ఫిట్నెస్ కూడా సాధ్యమేనని పలువురు మహిళలు చాటి చెప్పారు. HYD నెక్లేస్ రోడ్డులో ఆదివారం ఓ ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో శారీ రన్(SAREE RUN) నిర్వహించారు. ఈ వాకాథాన్లో 3,120 మంది మహిళలు చీరకట్టుతో పాల్గొన్నారు. వీరిలో ఓ మహిళ తన బిడ్డతో పాటు పాల్గొని పరుగులు పెట్టడం అందరినీ ఆకర్షించింది.
రంగారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం అత్యధికంగా మొగల్గిద్దలో 37.5℃ ఉష్ణోగ్రత నమోదైంది. అటు ప్రోద్దటూర్, కాసులాబాద్, చందానవల్లి, తొమ్మిదిరేకుల 37.4, చుక్కాపూర్ 37.3, షాబాద్ 37.2, రెడ్డి పల్లి, మొయినాబాద్ 37.1, కేతిరెడ్డిపల్లి 37, తుర్కయాంజాల్ 36.8, మంగల్పల్లి 36.7, కేశంపేట్, యాచారం 36.6, కొత్తూరు, మహేశ్వరం 36.5, తోర్రూర్, కొండూర్గ్లో 36.4℃గా నమోదైంది.
HYDలో చికెన్ ధరలు పతనం అవుతున్నాయి. KG మీద ఏకంగా రూ.18 నుంచి రూ.20 వరకు తగ్గించారు. శుక్రవారం KG స్కిన్ లెస్ రూ 168, విత్స్కిన్ KG రూ.148గా ఉండగా.. నేడు మోరోసారి భారీగా పడిపోయాయి. KG స్కిన్లెస్ రూ.152, విత్ స్కిన్ రూ. 133 చొప్పున అమ్మకాలు జరుపుతున్నారు. హోల్సేల్ దుకాణాల్లో ఇంకా తగ్గించి విక్రయిస్తున్నారు. రిటైల్ షాపుల్లో మాత్రం ధరలు యథావిధిగా ఉంటున్నాయి. మీ ఏరియాలో KG చికెన్ ధర ఎంత?
జీహెచ్ఎంసీ పరిధిలో జనాభా వేగంగా పెరుగుతోంది. వివిధ సర్వేల ప్రకారం, ప్రస్తుతం 1.08 కోట్లు ఉన్న జనాభా 2030 నాటికి 1.27 కోట్లకు చేరుతుందని అంచనా. ఈ పెరుగుదల దృష్ట్యా రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, ట్రాన్స్పోర్ట్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. HYD నగర విస్తరణతో పాటు సమతుల్య ప్రణాళికలు అవసరమని అభిప్రాయపడ్డారు.
అన్న, చెల్లెని గర్భవతిని చేసిన ఘటన HYDలో జరిగింది. బాధితుల వివరాలు..ప్రకాశం జిల్లాకు చెందిన భార్యభర్తలకు కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు విడాకులు తీసుకుని తల్లి, కుమార్తెలు విజయవాడలో, తండ్రి, కొడుకు HYDలో ఉంటున్నారు. పెద్ద చెల్లిని క్రిస్మస్కు సొంతూరు తీసుకెళ్లి తల్లికి అప్పజెప్పకుండా HYDకు వచ్చారు.కొన్నాళ్లకు కుమార్తె గర్భవతి అని తెలిసి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం బయటకొచ్చింది.
Sorry, no posts matched your criteria.