India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గతవారం రూ.193 ఉన్న స్కిన్లెస్ చికెన్ ధర నేడు రూ.140కి పడిపోయింది. ఫిబ్రవరి చివరివారంలో రూ.152 ఉండగా రంజాన్ ప్రారంభంలో ధరలు పెరిగాయి. ఈ వారం ఏకంగా రూ.50కిపైగా చికెన్ ధర పడిపోయింది. రిటైల్లో నేడు గుడ్ల ట్రే రూ.150గా ఉంది. పలు చోట్ల తెల్లవారు జామునుంచే మటన్, చేపల మార్కెట్ల వద్ద ప్రజలు బారులుతీరారు. మటన్ కిలో రూ.850-1000 వరుకు, చేపల రకాలని బట్టి కిలో రూ.200లకుపైగా విక్రయాలు జరుగుతున్నాయి.
తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా 10జాతీయ రహదారులను పూర్తి చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ.. రూ.6,280 కోట్ల వ్యయంతో 285 కి.మీ నూతన జాతీయ రహదారులను నిర్మించామని అన్నారు. అయితే, ఆ రహదారుల ప్రారంభానికి రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వస్తారని పేర్కొన్నారు.
పెళ్లైన నెలరోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన బాలానగర్లో జరిగింది. బాల్రెడ్డినగర్లో నివాసం ఉంటున్న విజయగౌరి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఆమె బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది. గత నెల 6వ తేదీన ఈశ్వరరావుతో విజయగౌరికి వివాహం జరిగింది. మృతురాలి స్వస్థలం ఏపీలోని విజయనగరం జిల్లా. ఇష్టం లేని పెళ్లి చేయడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు.
బైక్ రైడింగ్ అంటే మగవారాకి మాత్రమే అనుకునే ఈ కాలంలో మేము కూడా దేనికి తీసిపోమని నిరుపిస్తున్నారు HYDకు చెందిన జైభారతి. బుల్లెట్ బైక్ వేసుకొని 7 దేశాలు, లక్ష కి.మీ తిరిగొచ్చారు. ఆర్కిటెక్ట్గా విధులు నిర్వహిస్తూ బైక్ రైడింగ్ చేస్తున్న జైభారతి 2013లో ‘బైకర్నీ విమెన్ గ్రూప్ HYD చాప్టర్’ ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్ అంతా బైకులపై పలు ప్రాంతాలకు వెళ్లేవారు. ఆమె సహసాన్ని ప్రధాని మోదీతో పాటు KCR అభినందించారు.
రావిర్యాల ఓఆర్ఆర్పై గురువారం రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కారు ట్యాంకర్ను ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. అయితే కృష్ణారెడ్డి అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. కాగా, కృష్ణారెడ్డి చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఫాల్కన్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ప్రధాన నిందితుడు అమర్ దీప్కు చెందిన ప్రైవేట్ జెట్ విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో సీజ్ చేశారు. అమర్ దీప్ కుమార్ ఇదే విమానంలో జనవరి 22న దుబాయ్ పారిపోయినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఇదే కేసులో ఫిబ్రవరి 15న ఫాల్కన్ డైరెక్టర్స్ పవన్ కుమార్, కావ్య నల్లూరిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
HYD పేరు నిలబెడుతోందీ ఈ సింగర్. ఆధ్యాత్మిక పాటలతో సంగీత ప్రియులను కట్టిపడేస్తూ దేశ, విదేశాల్లో 650 పైగా కల్చరల్ ఈవెంట్లలో పాల్గొంది. 9 ఏళ్ల వయసులోనే తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్లో 17 కీర్తనలతో అల్బమ్ విడుదల చేసింది. తన ప్రతిభతో ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’లో పేరుతెచ్చుకుంది. బర్కత్పురాలో ఉండే వివేక్ ఆనంద్, సుచిత్ర దంపతుల కుమార్తెనే ఈ మాళవిక ఆనంద్. ఓ మగువా నీ ప్రతిభకు సలాం.
HAPPY WOMEN’S DAY
HYD శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కనిష్క్ రెడ్డి(19) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. HYD శివారులోని గొల్లపల్లి కలాన్ వద్ద ఓఆర్ఆర్పై లారీ కిందకు కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కనిష్క్ మలక్పేట యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కనిష్క్ మూసారాంబాగ్ BRS మాజీ కార్పొరేటర్ తీగల సునరిత, అజిత్ రెడ్డి కుమారుడు.
కొత్వాల్గూడలో ఎకో పార్క్ 6 ఎకరాల్లో సాహస క్రీడలతో ప్రత్యేక జోన్ 6 ఎకరాల్లో ఏర్పాటు చేయడానికి HMDA ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ORR పరిధిలోని హిమాయత్సాగర్ పక్కన 85 ఎకరాల్లో HMDA ఎకో పార్క్ అభివృద్ధి చేస్తోంది. దేశవిదేశాల నుంచి దాదాపు 1,500 రకాల పక్షులను సేకరించి ఇక్కడి వాతావరణానికి అలవాటు చేస్తున్నారు. ఈ అడ్వెంచర్ జోన్కు రూ.20 కోట్ల వరకు ఖర్చవుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు.
జీహెచ్ఎంసీలోని ఇంజినీరింగ్ విభాగంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రూ.5,942 కోట్లతో 23 పథకాలను చేపట్టాలని ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీచేసి 3 నెలలు పూరైనా ఇంజినీరింగ్ విభాగం మాత్రం ఒక్క పథకానికి కార్యరూపంలోకి దాల్చలేదని పలువురు కార్పోరేటర్లు విమర్శిస్తున్నారు. సీఎం రూ.5,827 కోట్ల పనులను డిసెంబర్ ప్రారంభించిన టెండర్లను పిలవడంలో ఇంజనీరింగ్ విభాగం ఎలాంటి చర్యలకు పూనుకోలేదు.
Sorry, no posts matched your criteria.