India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
KCRలాగానే రేవంత్ రెడ్డి కూడా ప్రమాదకారి అని సికింద్రాబాద్ ఎంపీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. HYDలో ఆయన ఈరోజు మాట్లాడారు. అధికారం కోసం KCR, రేవంత్ రెడ్డి ఎంతకైనా తెగిస్తారని ఆరోపించారు. అబద్ధాలు ఆడడంలో ఇద్దరు నాయకులు ఆరితేరారన్నారు. గతంలో కాంగ్రెసోళ్ల అసమర్థత వల్లే పాకిస్థాన్కు అడ్డుకట్ట వేయలేకపోయారని, చివరకు సర్జికల్ స్ట్రైక్స్ గురించి ప్రూఫ్స్ అడిగే స్థాయికి రేవంత్ రెడ్డి దిగజారాడన్నారు.
HYDలో కరెంట్ కోతల విషయమై కాంగ్రెస్ ప్రభుత్వంపై KCR మండిపడ్డారు. ఈరోజు తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. మొన్న వర్షం కురిస్తే కొన్ని ప్రాంతాల్లో 6 నుంచి 8 గంటలు కరెంట్ కట్ చేశారని, చందానగర్లోనైతే 24 గంటలు కరెంట్ కట్ చేస్తే ప్రజలు సబ్స్టేషన్కి వెళ్లి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఐటీ కేంద్రమైనా HYD బ్రాండ్ ఇమేజ్ను కాంగ్రెసోళ్లు చెడగొట్టొద్దని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు తెలంగాణ అభివృద్ధికి కృషి చేయలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. శనివారం వికారాబాద్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్, మజ్లిస్ను తరిమే శక్తి కేవలం బీజేపీకే ఉందన్నారు. బుల్లెట్ ట్రైన్ తొలి స్టాప్ వికారాబాద్లో రాబోతుందన్నారు. రూ.400 కోట్లతో చేవెళ్ల పరిధిలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.
ఇంటర్ ఫెయిల్ కావడంతో ఓ యువతి అదృశ్యమైంది. పోలీసుల వివరాలు.. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన ఓ కుటుంబం మల్కాజిగిరిలోని రామకృష్ణాపురంలో నివాసం ఉంటుంది. వారి కుమార్తె (19) ఈనెల 9న ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఇంట్లో తల్లికి కుమార్తె రాసిన లేఖ లభించింది. ఇంటర్లో ఫెయిల్ అయినందుకు మనస్తాపంతో వెళ్లిపోతున్నట్లు లేఖలో పేర్కొంది. శుక్రవారం తల్లి ఫిర్యాదుతో నేరెడ్మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి శనివారంతో తెరపడనుంది. సాయంత్రం 5 గంటల తర్వాత సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారం అన్నింటికీ ముగింపు పలకాలి. ఇతర ప్రాంతాలకు చెందిన నేతలు పాలమూరును వదిలి వెళ్లాల్సి ఉంటుంది. ఇన్ని రోజులుగా మైకులతో హోరెత్తిన పట్టణాలు, గ్రామాలలో నిశ్శబ్ద వాతావరణం నెలకొననుంది.
లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా 100% భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు స్వేచ్ఛగా ఓటేసేలా భరోసా కల్పిస్తున్నామని సీపీ అవినాష్ మహంతి అన్నారు. పోలింగ్ రోజు కట్టుదిట్టమైన బందోబస్తు ఉంటుందన్నారు. అక్రమ నగదు, మద్యం ఉచిత స్వాధీనాల్లో సైబరాబాద్ రాష్ట్రంలోనే తొలి స్థానంలో ఉందన్నారు. మొత్తం 6 వేల మంది పోలీసులు, 13 కంపెనీల కేంద్ర బలగాలు, 850 మంది శిక్షణ కానిస్టేబుళ్లు, SIలు విధుల్లో ఉంటారన్నారు.
యువతుల ఫొటోలను అశ్లీలంగా మార్చుతున్న యువకుడిని HYD మేడిపల్లి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సరూర్నగర్కు చెందిన మహమ్మద్ అర్షద్ (23) ఫేక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా అమ్మాయిల ఫొటోలు సేకరించి, నగ్న చిత్రాలుగా మార్చి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నాడు. ఈ విషయంపై ఇద్దరి యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టి అర్షద్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మోదీ రాకతో ఎల్బీస్టేడియం కాషాయమయమైంది. శుక్రవారం సా. ఆయన రాజధాని పరిధిలోని నలుగురు MP అభ్యర్థులకు మద్దతుగా భాగ్యనగర్ జనసభలో ప్రసంగించారు. INC పాలనలో బాంబ్ బ్లాస్టులు జరిగాయని విమర్శలు గుప్పించారు. BJP హయాంలో నగరంలో ఒక్క బ్లాస్ట్ జరగలేదన్నారు. హైదరాబాద్ అంటే తనకెంతో ఇష్టమని వ్యాఖ్యానించారు. ఆయన ప్రసంగంతో శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. మరి మోదీ చరిష్మా HYDలో వర్కౌట్ అయ్యేనా? మీ కామెంట్?
గొడవలు సృష్టించే MIMకు ఓటు వేయొద్దని, వ్యాపారాలు అభివృద్ధి చేసే INCకి ఓటు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. శుక్రవారం రాత్రి గోషామహల్ పరిధి బేగంబజార్ ఛత్రిలో హైదరాబాద్ MP అభ్యర్థి సమీర్ ఉల్లావల్లితో కలిసి CM ప్రచారం నిర్వహించారు. గత పదేళ్లుగా BJP మూసీ నదిని శుద్ధి చేయాలేదన్నారు. BRS కనీసం ఉస్మానియాను కూడా బాగుచేయలేదని విమర్శించారు. ఓల్డ్ సిటీ మెట్రో కాంగ్రెస్తోనే సాధ్యమని పేర్కొన్నారు.
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 8లో ఉన్న ఆఫ్టర్ 9 పబ్ని అమీర్పేట ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా ఎలాంటి అనుమతి లేకుండా పబ్ కొనసాగుతోందని దర్యాప్తులో తేలింది. కొద్దిరోజుల కిందట పోలీసులు చేసిన దాడిలో 162 మంది యువతీ యువకులతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ యాజమాన్యం పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.