India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాతబస్తీ శాలిబండ ప్రాంతంలో డ్రగ్స్ కంట్రోల్, పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. చార్మినార్ బస్ స్టాండ్ పార్కింగ్లో డ్రగ్స్కి అలవాటు పడ్డ వారికి నిషేధిత టైడోల్ ట్యాబ్లెట్లు విక్రయిస్తున్న యాకుత్పురకు చెందిన హర్షద్ ఖాన్ని అరెస్ట్ చేశారు. అతడి వద్ద 100కి పైగా ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ట్యాబ్లెట్లు వాడటం వలన మెదడుపై ప్రభావం చూపి మనిషి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని తెలిపారు.
సికింద్రాబాద్, మల్కాజిగిరి ఎంపీ నియోజకవర్గాల్లో ఇంతవరకు ఒక్కసారి కూడా BRS పార్టీ గెలవలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో 6 BRS, ఒకటి MIM గెలిచింది. ఇక మల్కాజిగిరిలో 7కు 7 BRS గెలిచింది. ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నా ఎంపీలుగా మాత్రం గెలవలేదు. మరి ఈసారి 2ఎంపీ నియోజకవర్గాల్లోనూ BRS గట్టిగా ఉంది. పార్టీని గెలిపించేందుకు KCR, KTR ప్రచారం చేస్తున్నారు. మీ కామెంట్?
స్టాక్ ట్రేడింగ్ పేరుతో రూ.6.5 లక్షలు సైబర్ నేరగాళ్లు దోచేశారు. నగరానికి చెందిన గృహిణి(64) ఫేస్ బుక్లో ట్రేడింగ్లో మంచి లాభాలు వస్తాయనే ప్రకటన చూసి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. మొదటగా కొంత పెట్టుబడి పెట్టగా లాభాలు వచ్చాయి. దీంతో విడతల వారీగా రూ.6.50 లక్షల వరకు యాప్లో పెట్టుబడి పెట్టారు. లాభాలు వచ్చిన విత్ డ్రా చేసుకోవడానికి రాకపోవడంతో మోసపోయి HYD సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.28,43,735 నగదు, రూ.5,55,605 విలువైన ఇతర వస్తువులు, 33.50 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. ఆరుగురిపై FIR నమోదు చేశామన్నారు. ఇప్పటి వరకు రూ.22.5 కోట్ల నగదు, రూ.17.93 కోట్ల విలువైన వస్తువులు, 26.83 లక్షల లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అయితే ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.3.16 కోట్ల విలువ చేసే బంగారం, వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా బాచుపల్లిలో రెండు బైకులపై తరలిస్తున్న రూ.22 లక్షల నగదు పోలీసులు గుర్తించారు. డబ్బుకు సంబంధించి సరైన ఆధారాలు చూపకపోవడంతో క్యాష్ సీజ్ చేశామని పోలీసులు తెలిపారు.
తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు కేంద్రం నుంచి తెచ్చానన్న కిషన్ రెడ్డి.. ఆ డబ్బులు ఎక్కడ ఖర్చుపెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ డిమాండ్ చేశారు. బంజారాహిల్స్లోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రూ. 10 లక్షల కోట్లు తెస్తే సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల్లో DRC బృందాల సభ్యులు విధులను సమర్ధవంతంగా నిర్వర్తించాలని HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ సూచించారు. జూబ్లీహిల్స్లోని భీమ్ ఆదివాసీ భవన్లో DRC బృందాలు, అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల అనుభవాల దృష్ట్యా ఎలాంటి సమస్యలు లేకుండా డిస్ట్రిబ్యూషన్ సాఫీగా జరిగేలా చూడాలన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అకడమిక్, అభివృద్ధి కార్యకలాపాలపై మే 9న మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ఈఎంఆర్అండ్ఆర్సీ డైరక్టర్ ఆచార్య వడ్డాణం శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయ యూట్యూబ్ ఛానెల్, టీ-శాట్ నిపుణ ద్వారా ఈ టెలీకాన్ఫరెన్స్ ఉంటుందని, విద్యార్థులు, అధ్యయన కేంద్రాల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనలన్నారు.
రాష్ట్రంలో 2024 -25 విద్యాసంవత్సరానికి గాను జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఇంటర్ బోర్డు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. నేటి నుంచి ఫస్ట్ ఫేజ్ అప్లికేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. కాగా ఈనెల 31 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. కాగా జూన్ 1వ తేదీ నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. జూన్ 30వ తేదీలోపు తొలి దశ అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు HYDలో అధికారులు స్పష్టం చేశారు.
మాజీ గవర్నర్ తమిళిసై సౌందరాజన్పై ఈసీకి బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి జి.కిషన్ రెడ్డికి మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే కాలనీలో తమిళిసై ఎన్నికల ప్రచారం చేశారని, ఆ సమయంలో ఓటర్లకు అయోధ్య రామమందిర నమూనాలను పంపిణీ చేశారన్నారు. ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు.
Sorry, no posts matched your criteria.