India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన లింగారెడ్డిగూడ సమీపంలో చోటుచేసుకుంది. లింగారెడ్డిగూడా సమీపంలోని మజీద్ వెనకాల మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుని వయస్సు సుమారు 55 నుంచి 60 ఏళ్లు ఉంటుందని తెలిపారు. మృతుడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మైనర్ బాలికను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన జీహెచ్ఎంసీ డ్రైవర్ రామ్ చంద్ర యాదవ్(25) పై కాచిగూడ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎస్సై రవికుమార్ వివరాల ప్రకారం.. నింబోలి అడ్డకు చెందిన రామచంద్ర యాదవ్ మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పి పలుమార్లు ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. మంగళవారం బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ సంఘటన ఛత్రినాక PS పరిధిలో చోటుచేసుకుంది. సైదాబాద్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ముజీబ్ ఉర్ రెహమాన్ ఎలక్ట్రీషియన్. 2021లో అతడు ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. తాజాగా కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 10 వేల జరిమానా విధించింది.
శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆవరణలో ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాకు చిరుత చిక్కింది. 4 రోజులుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చిరుత కోసం ఫారెస్ట్ అధికారులు 25 కెమెరాలు, 5 బోన్లు ఏర్పాటు చేశారు. ఓ బోన్ ముందు చిరుత సంచరిస్తున్న ఫొటోలు లభ్యమయ్యాయి. గొల్లపల్లి, రషీద్గూడ, బహదూర్గూడ, చిన్న గోల్కొండ ఎయిర్పోర్టు ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు గుర్తించారు. బీ కేర్ ఫుల్. SHARE IT
OYOకి వెళ్లిన యువకుడు అనుమానాస్పదంగా మృతిచెందాడు. SRనగర్ పోలీసుల వివరాల ప్రకారం.. జడ్చర్ల వాసి హేమంత్(28) తన లవర్తో కలిసి సోమవారం HYD వచ్చాడు. ఓ ఫంక్షన్కు హాజరైన వీరు రాత్రి OYOలో బసచేశారు. మిడ్నైట్ తర్వాత బాత్రూంకి వెళ్లిన హేమంత్ ఎంతకీ రాకపోవడంతో అమ్మాయి వెళ్లి చూడగా అనుమానాస్పదంగా పడి ఉన్నాడు. 108కి కాల్ చేయగా సిబ్బంది అక్కడికి చేరుకొని పరీక్షించి, చనిపోయినట్లు తెలిపారు. కేసు నమోదైంది.
10th Resultsలో రాజధాని వెనుకబడిన సంగతి తెలిసిందే. గతేడాది <<13150824>>HYD 28, RR 14, MM 20వ<<>> స్థానాల్లో నిలవగా ఈ సారి ఇంకా వెనుకబడ్డాయి. నగరంలోని గవర్నమెంట్ స్కూల్స్లో 7445 విద్యార్థుల్లో 5873 మంది పాస్ అయ్యారు. రంగారెడ్డి, మేడ్చల్లోని ప్రభుత్వ స్కూల్స్లో ఉత్తీర్ణత 80% మించలేదు. సర్కారుబడుల్లో మౌలిక వసతుల కొరత, జీవో 317పై ఆందోళనలు, విద్యార్థులు సక్రమంగా స్కూల్స్కి రాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
పది ఫలితాల్లో చింతపట్ల జెడ్పిహెచ్ఎస్కు చెందిన బండి కంటి ఉమామహేశ్వరి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిపిఏ 8.7 సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఉమామహేశ్వరి 2 సార్లు రాష్ట్రస్థాయి వాలీబాల్ క్రీడల్లో 5 సార్లు జిల్లా స్థాయిలో పాల్గొని పతకాలు సాధించడంలో కీలక పాత్ర వహించిందని హెచ్ఎం శోభాదేవి, పీఈటి సాబేర్ అన్నారు. భవిష్యత్తులో తగిన విధంగా ప్రోత్సహిస్తే చదువుల్లోనూ క్రీడల్లోనూ అద్భుతాలు సాధించవచ్చన్నారు
HYD పరిధి సికింద్రాబాద్ రైల్వే పరిధిలో ఆత్మహత్యలు, పట్టాలు దాటుతుండగా జరిగిన మరణాల పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. 2021లో-586, 2022-677, 2023-648 ఆత్మహత్యలు జరిగినట్లు తెలిపారు. గత మూడేళ్లలో పలు ప్రాంతాల్లో కలిపి 1815 రైల్వే పట్టాలు దాటుతూ మరణించినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ఆత్మహత్యలు, మరణాలు కలిపి 12కు పైగా నమోదయినట్లు వెల్లడించారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా 2.8 లక్షలు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా 2 లక్షల ఎకరాలకు నీరు అందనుంది. ఈ నేపథ్యంలో పాలమూరు రంగారెడ్డికి రూ.2,050 కోట్లు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రూ.9000.59 కోట్లను మొదట ఖర్చు చేసి, త్వరగా ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. దీంతో ఉమ్మడి RR జిల్లా ప్రజలు ప్రాజెక్టుల పై కోటి ఆశలు పెట్టుకున్నారు.
ఫ్లై ఓవర్ పైనుంచి పడి ఓ కార్మికుడు మృతిచెందిన ఘటన అంబర్పేటలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్కి చెందిన ప్రబీర్ సర్దార్(22) చే నెంబర్ ఫ్లై ఓవర్ పై సెంట్రింగ్ పని చేస్తుండగా కాలుజారి కిందపడ్డాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయం అయింది. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.