RangaReddy

News May 4, 2024

HYD: పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

image

పెళ్లి పేరుతో ఓ యువతిని మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన HYD వనస్థలిపురం PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా ఉండే ఓ సంస్థలో యువతితోపాటు యువకుడు పనిచేస్తూ ఆమెతో స్నేహపూర్వకంగా మెలిగాడు. ఆమెను పెళ్లి చేసుకుంటా అని చెప్పి లోబరుచుకున్నాడు.ఆ సమయంలో కొన్ని ఫొటోలు తీశాడు. పెళ్లి గురించి ఆమె అడగగా నిరాకరించి, ఫొటోలు వైరల్ చేస్తా అని బెదిరించడంతో PSలో ఫిర్యాదు చేసింది.

News May 4, 2024

HYD: పార్లమెంట్ ఎన్నికలు.. పోలీసుల కవాతు..!

image

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటం, ప్రజలకు మరింత భద్రత కల్పించడంలో ఇదొక భాగమని అన్నారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్‌ల వద్ద పకడ్బందీ భద్రత చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

News May 4, 2024

HYD: ప్రధాని మోదీపై దానం నాగేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు

image

ప్రధాని మోదీపై కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బంజారాహిల్స్‌లోని లేక్ వ్యూ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బూత్ కార్యకర్తల సమావేశంలో దానం నాగేందర్ మాట్లాడుతూ.. మహిళలకు మంగళసూత్రం ఎంత విలువైనదో, భార్య వదిలిపెట్టిపోయిన మోదీకి ఏం తెలుసు అంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీపై మోదీ దుష్ప్రచారం మానుకోవాలని అన్నారు.

News May 4, 2024

HYD: కరెంట్ బిల్లు చూసి షాక్ అయ్యాడు..!

image

HYD మల్కాజిగిరి వసంతపురి కాలనీకి చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తికి ఏకంగా రూ.1,75,173 కరెంటు బిల్లు వచ్చిందని వాపోయాడు. జీరో బిల్లు రావాల్సిన అతడికి రూ.లక్షల్లో బిల్లు రావడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఈ విషయమై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెళితే వారు స్పందించడం లేదని బాధితుడు తెలిపాడు. అంతకుముందు రెండు నెలల్లో ఒకసారి రూ.600, మరోసారి రూ.1,438 బిల్లు వచ్చినట్లు తెలిపారు.

News May 4, 2024

HYD: కుళ్లిన మహిళ మృతదేహం కలకలం

image

ఓ మహిళ మృతదేహం కలకలం సృష్టించిన ఘటన HYD బాలాపూర్ PS పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలాపూర్ ఉస్మాన్ నగర్ చెరువులో 30-40 ఏళ్ల వయసు గల ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం కుళ్లిన స్థితిలో ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి పరిశీలించి, ఆమె ముస్లిం మహిళగా అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

News May 4, 2024

HYD: కాంగ్రెస్ వద్దు.. BRS కావాలంటున్నారు: MLA

image

BRS సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని అంబర్‌పేట్ MLA కాలేరు వెంకటేశ్ అన్నారు. శనివారం గోల్నాకలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అసత్య ప్రచారంతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ప్రజల్లో మార్పు మొదలైందని, కాంగ్రెస్ వద్దు.. BRS కావాలంటున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో BRS వైపే ప్రజలు ఉన్నారని అన్నారు.

News May 4, 2024

HYD సిటీ కాలేజీలో ఇంటర్వ్యూలు

image

HYDలోని ప్రభుత్వ సిటీ కళాశాల(అటానమస్)లో తాత్కాలిక అతిథి అధ్యాపకుల నియామకానికి అర్హులైన అభ్యర్థులు ఈనెల 6వ తేదీ ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూకి హాజరు కావాలని ప్రిన్సిపల్ ఆచార్య పి.బాల భాస్కర్ తెలిపారు. బయో టెక్నాలజీ విభాగంలో ఖాళీగా ఉన్న 2 పోస్టులకు పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 55 శాతం మార్కులున్న అభ్యర్థులు అర్హులని, పీహెచ్‌డీ, ఎం.ఫిల్, నెట్, స్లెట్ అదనపు అర్హతలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.

News May 4, 2024

HYD: తొలిరోజు హోమ్ ఓటింగ్ వినియోగించుకున్న 177 మంది

image

హోమ్ ఓటింగ్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా, హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో హోమ్ ఓటింగ్‌కు అర్హులైన 121 మందిలో 112 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. సికింద్రాబాద్‌ పరిధిలోని 385 మంది అర్హుల్లో 65 మంది తొలి రోజునే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పూర్తి పారదర్శకంగా అధికారులు హోం ఓటింగ్ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు.

News May 4, 2024

ఓయూలో ఈనెల 16 నుంచి డిగ్రీ వన్ టైమ్ ఛాన్స్ పరీక్షలు

image

ఓయూ పరిధిలో మే 16 నుంచి డిగ్రీ వన్ టైమ్ ఛాన్స్ పరీక్షలు ప్రారంభంకానున్నట్లు కంట్రోలర్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, ఇతర డిగ్రీ కోర్సులు చదివి ఫెయిలైన పూర్వ విద్యార్థులకు పరీక్ష రాసుకునేందుకు ఒక్క అవకాశం ఇచ్చిన విషయం విదితమే. వన్ టైమ్ ఛాన్స్ పరీక్షకు 15 వేల మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. వచ్చే వారం నుంచి హాల్ టికెట్లు జారీ చేయనున్నట్లు కంట్రోలర్ చెప్పారు. SHARE IT

News May 4, 2024

సికింద్రాబాద్ ‘సికందర్’ ఎవరు?

image

సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో గెలిచిన పార్టీనే కేంద్రంలో అధికారం చేపడుతుందనే సెంటిమెంట్ ఉంది. 1998 నుంచి ఇలాగే జరుగుతోంది. ఈసారి ఇక్కడ సిట్టింగ్ MP కిషన్ రెడ్డి (BJP), దానం నాగేందర్ (INC), పద్మారావు గౌడ్ (BRS) పోటీ పడుతున్నారు. ముగ్గురూ బలమైన నేతలే కావడంతో పోరు రసవత్తరంగా ఉండనుంది. ఇక్కడ 12 సార్లు కాంగ్రెస్, 5 సార్లు BJP, ఓసారి తెలంగాణ ప్రజా సమితి పార్టీ గెలిచింది. ఈసారి సికందర్ ఎవరో మీ కామెంట్?