RangaReddy

News May 3, 2024

HYD: గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

image

చెన్నాపురం చెరువులో దూకి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. చెన్నాపురం చెరువులో గురువారం గుర్తు తెలియని వ్యక్తి(25-30) చెరువులో దూకాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 3, 2024

HYD: ఎర్రకుంటలో మృతదేహం లభ్యం

image

ఎర్రకుంటలో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన మైలార్‌దేవ్‌పల్లి PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మధుబన్ కాలనీలో GHMC పారిశుద్ధ్య కార్మికులు గురువారం చెత్తను శుభ్రం చేస్తుండగా మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 3, 2024

BREAKING.. శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత

image

శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. ఐదు రోజులుగా చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. దీన్ని పట్టుకోవడానికి 5 బోన్లు, 20 కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ చిరుతను నెహ్రూ జూ పార్కుకు తరలించనున్నారు. జూలో చిరుత ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌కు తరలించనున్నారు. కాగా, 5 రోజులుగా అధికారులను చిరుత ఉక్కిరిబిక్కిరి చేసింది.

News May 3, 2024

ఉప్పల్: ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

image

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన ఉప్పల్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పాతబస్తీ ఉప్పుగూడకు చెందిన రమేశ్(70) ఉప్పల్ ఆదిత్య ఆసుపత్రి వెనకాల లేట్ మిషన్ నడిపిస్తున్నాడు. గురువారం సాయంత్రం ఉప్పల్ నుంచి బోడుప్పల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

News May 3, 2024

HYD: చికెన్‌ కర్రీలో పడి BRS కార్యకర్తకు గాయాలు

image

చికెన్‌ కర్రీలో పడి BRS కార్యకర్తకు తీవ్ర గాయాలైన ఘటన ధారూరు మండలంలో చోటుచేసుకుంది. ధారూరులోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం భోజనానికి వెళ్లగా.. కుక్కింద గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ కార్యకర్త మల్లయ్య.. కార్యకర్తల తోపులాటలో అదుపు తప్పి పక్కనే ఉన్న చికెన్‌ బోగాణలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో మల్లయ్యకు తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.

News May 3, 2024

వికారాబాద్: రూ.2,62,96,691 పట్టివేత

image

పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతుంది. వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు పోలీసులు ఇతర శాఖల అధికారులు సంయుక్త తనిఖీల్లో రూ.2,62,96,691 పట్టుబడింది. ఇందుకు సంబంధించి 95 కేసులు నమోదయ్యాయి. మద్యం సరఫరాకు సంబంధించి 148 కేసులు నమోదు కాగా.. రూ.10.83 లక్షల విలువచేసే 3,359 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు. వీటితో పాటు 338 గ్రాముల బంగారం, 5.12 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు.

News May 3, 2024

చేవెళ్ల: 18 నుంచి 39 ఏళ్లలోపు యువ ఓటర్లు 15,20,890 మంది

image

చేవెళ్ల పార్లమెంట్‌‌లోని 7 నియోజకవర్గాల్లో మొత్తం 29,38,370 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లలో 18 నుంచి 39 ఏళ్లలోపు యువ ఓటర్లు మొత్తం 15,20,890 మంది ఉండగా.. 40-49 ఏళ్ల వయస్సు ఓటర్లు 6,07,268 ఉన్నారు. 50-59 ఏళ్ల వయస్సు ఓటర్లు 3,62,074, 60-69 ఏళ్ల వయస్సు ఓటర్లు 2,13,014, 70-79 వయస్సు ఓటర్లు 1,02,115, 80-89 ఏళ్ల వయస్సు ఉన్న ఓటర్లు 26,226 ఉండగా.. 90-99 ఏళ్ల వయస్సు ఓటర్లు 4,531 మంది ఉన్నారు.

News May 3, 2024

రంగారెడ్డి: ఎండ తీవ్రతకు ఖాళీగా మారిన రోడ్లు

image

ఉమ్మడి రంగారెడ్డిలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటాయి. దీంతో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. ఎండ తీవ్రతకు నార్సింగి నుంచి అప్పా జంక్షన్‌కు వెళ్లే ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మానుష్యంగా మారింది. మేడ్చల్‌ జిల్లా కీసరలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. కుల్కచర్ల మండలం పుట్టపహాడ్‌లో 44.3 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో 44.0 డిగ్రీలుగా నమోదైంది.

News May 3, 2024

HYD: డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరి అరెస్టు

image

కాటేదాన్, బాబూల్ రెడ్డి నగర్లో ఓ గిడ్డంగిలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో శంషాబాద్ ఎక్సైజ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు నల్లమందు స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. తనిఖీలో రూ.కోటి 60లక్షల విలువ చేసే నల్ల మందును గుర్తించారు. ఇద్దరిని అరెస్టు చేసి ఎన్డిపిఎస్ చట్టం కింద కేసు నమోదు చేసిన్నట్లు పోలీసులు తెలిపారు.

News May 3, 2024

HYD: ఆటో ప్రయాణికులను దోచుకుంటున్న నలుగురు అరెస్టు

image

ఆటో ప్రయాణికులను దోచుకుంటున్న నలుగురు ముఠా సభ్యులను మీర్‌చౌక్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మూడు మొబైల్ ఫోన్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. చాంద్రాయణగుట్టకు చెందిన అబ్దుల్ ఖాజా ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కంచన్‌బాగ్‌కు చెందిన మహ్మద్ ఇంతియాజ్, ఫతేనగర్‌కు చెందిన ఎండి నవాజ్, షాహిన్ నగర్‌కు చెందిన గులాం హసన్ కలిసి ప్రయాణికులను దోచుకుంటున్నారు.